న్యూఢిల్లీ: ఏప్రిల్ ,20 (తెలుగు న్యూస్ పవర్.కాం)
నారీ శక్తి వందన్ అధినియమ్పై పలువురు మహిళ ప్రతినిధులు రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ పొడపాటి తేజస్వి ఆధ్వర్యంలో కలుసుకున్నట్టు తేజస్వి ఆదివారం తెలిపారు. ఉత్తేజకర దృక్పథం తో స్పీకర్ ఉబెర్ల ఈ సమావేశంలో మాట్లాడారు.
పార్లమెంట్ సందర్శన రెండో రోజున మహిళా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పై ఆయన విశిష్ట దృక్పథం, ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టం యొక్క సామర్థ్యంపై చర్చించారు.
ఈ సమావేశం నాయకత్వ లక్షణాలకు ఒక అవగాహన కార్యక్రమంలో ఉపయోగపడింది. మహిళా ప్రతినిధులుగా, స్పీకర్ ఉత్తమసాధికార పార్లమెంటరీ భవిష్యత్తుకు సంబంధించిన దూరదృష్టుని తెలుసుకోవడం ఉత్తేజపరిచింది. ఈ చారిత్రక ఉద్దేశానికి మా బాధ్యతలు మరింత బలపరిచిందని తేజస్వి తెలిపారు.ఒక మరపురాని రోజని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ చైర్పర్సన్ తేజస్వి పొడపాటి పేర్కొన్నారు.
లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లాతో రాష్ట్ర మహిళా ప్రముఖుల సమావేశం.
స్పీకర్ ఓం బిర్లా, ప్యానల్ స్పీకర్ తెన్నేటి ప్రసాద్ తో తేజస్వి బృందం