పాలకొల్లు: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విద్యా చైతన్య సమాఖ్య నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎడ్ల దుర్గ కిషోర్, డాక్టర్ కొండపల్లి లెనిన్, పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే,సంస్థ అధ్యక్షులు దిరిశాల వెంకట ప్రసాద్, కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ, తోలేటి గాంధీ, మంచెం కనకరాజు, కింజరపు దుర్గాప్రసాద్,మంచెం ఉమామహేశ్వరరావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎర్ర అజయ్ కుమార్, కానుకొలను శ్రీనివాస్ పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.