భీమవరం: ఆగస్టు,18( తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ వస్త్రం ప్రాజెక్టు కు భీమవరం భక్తులు దాట్ల హేమంత్ వర్మ, శ్రీతన్వి పుణ్యదంపతులు 10 గ్రాముల బంగారం అమ్మవారికి కానుకగా సమర్పించారు.వీరికి ఆలయ అర్చకులు పూజలు ఆశీర్వచనం నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్,పాపోలు ఏడుకొండలు బంగారు ప్రాజెక్ట్ సభ్యులు గోంట్ల నారాయణ రావు ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేశారు.
శ్రీ మావుళ్లమ్మకు 10 గ్రాముల బంగారం కానుక.
భక్తుని సత్కరిస్తున్న ధర్మకర్తలు