శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల రథోత్సవం.
పాలకొల్లు:ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనుకదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో గుండు నాగబాబు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పురవీధులలో ఏనుగు అంబారిపై అమ్మవారు ఊరేగారు. పూలచత్రాలు ఇరువైపులా బారులు తీరగా, గరగ నృత్యాలు, బేతాళ నృత్యాలు, మ్యూజికల్ బ్యాండ్ బృందాలను అనుసరించి రథోత్సవం సాగింది. భక్తులు శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల అనుగ్రహ దర్శనం అందుకున్నారు….