
సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాల్లో ప్రముఖమైన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం స్వామివారికి తెప్పోత్సవం జరిగింది. ఉత్సవాల్లో 9వది, ఆఖరి రోజున, ఆలయానికి ఉత్తరాన ఉన్న, నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరులో, స్వామివారు, దేవేరులు తెప్పోత్సవం లో విహరించారు. కనుల పండుగగా జరిగిన, ఈ దృశ్యం తిలకించడానికి భక్తజనుల రెండు కళ్ళు సరిపోలేదని, తన్మయత్వంతో చూసి తరించారు. విద్యుత్ కాంతులతో అలంకరించిన హంస వాహనం, కోనేరు చుట్టూ విద్యుత్ దీపాల అలంకరణ, బాణాసంచా కాల్పులు లతో విరజిమ్మిన వెలుగులు, భక్తులు పాలపుంతలో విహరించిన అనుభూతి అనుభవించారు.
శ్రీ లక్ష్మీనరసింహ తెప్పోత్సవం, పశ్చిమగోదావరి జిల్లా, వెంప వాస్తవ్యులు గొట్టుముక్కల భీమరాజు కైంకర్యముతో అత్యంత వైభవంగా జరిగింది.
