Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారినిదర్శించుకున్న కలెక్టర్.

భీమవరం:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం సమర్పించగా, కలెక్టర్ తనయుడు భరత్‌, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి అనుగ్రహ దర్శనం అందుకొన్నారు.