Skip to main content

Telugu News Power

Blog

సంక్రాంతికి వస్తున్నాం, అయితే బరులు రెడీ, పందాలే తరువాయి

పాలకొల్లు:డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర్) ధనుర్మాసం ఈనెల 16న ప్రారంభమై వచ్చేనెల 14 వరకు కొనసాగుతూంది. ఆడపడుచు గొబ్బెమ్మలతో సంక్రాంతి లక్ష్మికి స్వాగతాలు పలుకుతున్నారు. హరిదాసుల అప్డేటెడ్ వెర్షన్తతో ఖరీదైన ద్విచక్ర వాహనాల నెత్తిన అక్షయపాత్ర పెడుతున్నారు. ఒకప్పుడు హరిదాసులు సాంప్రదాయబద్ధంగా, తమకంఠ స్వరంతో పౌరాణిక గాధలు, తత్వాలు పాడేవారు, ఇప్పుడవి బ్లూటూత్ స్పీకర్లలో వినిపిస్తున్నారు. బుడబుక్కల వారు తెల్లవారుజామున మూడింటికి పల్లెల్లో ప్రవేశించేవారు. ఇప్పుడు డిగ్రీలు చదివిన బుడబుక్కల వారు అందరిలాగే ఉదయాన్నే బయలుదేరుతున్నారు. ఇప్పటికే వారి…

Read More

పడవ యజమానులకు చెక్కుల పంపిణీ

పాలకొల్లు: డిసెంబర్,27(తెలుగు న్యూస్ పవర) స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రజలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, శనివారం మత్స్యకారులకు చెక్కులు పంపిణీ చేశారు. వరదల విపత్తు కారణంగా, కాజ్వే మునిగిపోవడం, ప్రజల దైనందిన జీవన ప్రయాణానికి ఇబ్బంది పడటం జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చాక, ఈ సమస్య లేకుండా, కూటమి ప్రభుత్వం వారు ప్రజలకు పడవలు ఏర్పాటు చేశారు. ఈ పడవల సొంతదారులకు రెండు విడతలుగా సొమ్ములు చుక్కల రూపంలో చెల్లించారు. మొదటి విడత 3.90 లక్షలు, రెండవ విడత…

Read More

తూర్పు కాపు సమస్య పరిష్కరిస్తాం- గుడాల గోపి

పాలకొల్లు: డిసెంబర్,31(తెలుగు న్యూస్ పపర్) తూర్పు కాపులను ఓబీసీలుగా గుర్తించడానికి ఇది సరైన సమయమని పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి వెల్లడించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో తూర్పు కాపు నాయకులతో శుక్రవారం మాట్లాడారు. గతంలో ఈ సమస్యపై నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు. అయితే అప్పుడు సమయం లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించ లేకపోయామన్నారు. ఈ విషయమై జగనన్న కలిసి మరోసారి విజ్ఞప్తి చేద్దామని ప్రకటించారు….

Read More

బడుగుల ఆశాజ్యోతి రంగా -మంత్రి నిమ్మల రామానాయుడు నివాళి

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా అని రాష్ట్ర జలవన రుల శాఖామాత్యులు మంత్రి నిమ్మల రామానాయుడు. పేర్కొన్నారు. వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా స్థానిక మారుతి థియేటర్ సెంటర్ వద్ద రంగా కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రంగా కోసం ఒకప్పుడు ఎందరో నాయకులు ఎదురుచూసేవారన్నారు. కూటమి ప్రభుత్వం రంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చేగొండి…

Read More

రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ – మంత్రి నిమ్మల ఆరోపణ

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పేపర్) రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఓ విలన్ల మారారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ఆరోపించారు. స్థానిక వంద పడకల ఆసుపత్రి అభివృద్ధి, సుందరీకరణ పనులకు శుక్రవారం కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకుగాను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి కోటిన్నర రూపాయలు మంజూరు చేయించినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమాల్లో ప్రతినాయకుడు పాత్రలాగే, జగన్ కథ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలిపారు….

Read More

పాలకొల్లు లో సినిమా షూటింగ్

పాలకొల్లు: డిసెంబర్,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక పశువుల ఆసుపత్రి వద్ద శుక్రవారం హరి గాడి ‘ హరికథ’ సినిమా దృశ్యాలు చిత్రీకరించారు. సురభి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై, సురభి హరినాధరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి మొదటి చిత్రం. దర్శకులు వైవి సర్వేష్ మొదటిసారి పెద్ద తెర సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరు చేసిన వెబ్ సిరీస్ మంచి ప్రజాదరణ పొందడంతో ఈ సినిమా అవకాశాన్ని అందుపుచ్చుకున్నారు. హీరోగా హరి యడ్లపల్లి ఈ సినిమా ద్వారా…

Read More

స్వామి వారిని దర్శించుకున్న జిల్లా అటవీ శాఖ అధికారి

పాలకొల్లు:డిసెంబర్,26 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామిని శుక్రవారం జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సురేష్ కుమార్ దంపతులు దర్శించి,పూజలు చేశారు. కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో, శేష వస్త్రం బహుకరించి సత్కరించారు. ఆలయ పర్యవేక్షకులు పి వాసు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

పాలకొల్లు టిడిపికి జిల్లా పదవులు

పాలకొల్లు:డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) స్థానిక నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకులు బందెల భాస్కరరావుకు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పదవి లభించింది. మరో సీనియర్ టీడీపీ నాయకులు వల్లూరి ధనుంజయ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పదవి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు, ఏఎంసి చైర్మన్ కోడి విజయభాస్కర్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, టిడిపి అధ్యక్షులు గండేటి వెంకటేశ్వర రావు, పాముల రజిని కుమార్, పెచ్చటి బాబు తదితరులు అభినందన తెలిపారు.

Read More

వాడవాడలా క్రిస్మస్ వేడుకలు

పాలకొల్లు: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం సందర్భంగా వాడవాడలా క్రీస్తు బోధనలు బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి వరకు జరుగుతున్నాయి. క్రీస్తు బోధించిన ప్రేమ,కరుణ,దయ గుణాలు ప్రపంచానికి శాంతి, సౌబ్రాత్రుత్వాన్ని అందిస్తాయని బోధకులు కీర్తించారు. ఈ కార్యక్రమాల్లో పిల్లలు,పెద్దలు భక్తి భావంతో, ఉత్సాహంగా ప్రార్థన చేశారు. క్రిస్మస్ కోరల్స్ పాడారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు ప్రజాప్రతినిధులు ఈ క్రిస్మస్ వేడుకల్లో స్వయంగా పాల్గొని దీవెనలు అందుకున్నారు. వివిధ సంస్థలలో క్రిస్మస్ జరుపుకున్నారు. పాలకొల్లు…

Read More

నేటి నుంచే రైలు టిక్కెట్ల ధర పెంపు.

న్యూఢిల్లీ: డిసెంబర్,25(తెలుగు న్యూస్ పవర్) భారత రైల్వే శాఖ నేటి నుంచి ప్రయాణికులు టిక్కెట్ ధర పెంచింది. సబర్బన్(సింగిల్ జర్నీ) టిక్కెట్ ధర పెరగలేదు. అలాగే సబర్బన్, నాన్ సబర్బన్ సీజన్ టిక్కెట్ల ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. సాధారణ రైళ్లు, ఏసీ లేనివి. రెండవ తరగతి (నాన్ ఏసి) 215 కీ. మీ. వరకు – పెంపు లేదు 216 నుంచి 750 కి మీ – రూ 5/- పెంపు 751 నుంచి…

Read More