Telugu News Power

Blog

వాకర్స్ క్లబ్ సహాయం.

పాలకొల్లు: మార్చి, 25 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వాకర్స్ క్లబ్, ఇద్దరు పేద విద్యార్థులకు బుధవారం, కొత్త కుళాయి చెరువు వద్ద, అధ్యక్షులు తటవర్తి సుధాకర్ రావు సైకిళ్ళు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామరాజు లంక గ్రామం, ఉర్రింక మధు వర్షిని, నాగులంక గ్రామం, మండపాక సిద్దు దూరంగా ఉన్న పాఠశాలకు వెళ్లడానికి, 14 వేల రూపాయలతో ఈ సహాయం అందజేశారు. బట్టీలంక కు చెందిన ఇంటర్ విద్యార్థి బి.హాసినికి వైద్య…

Read More

దేవాలయాలకు 20 నెలల్లో 40 కోట్ల రూపాయలతో రోడ్డు సౌకర్యం కల్పించాం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విజయవాడ/రామతీర్థం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్.కామ్) ఆలయాల అభివృద్ధికి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆలయాల పవిత్రతను కాపాడటంతోపాటు దేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా నెలిమర్ల నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం వర్చువల్ గా పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ, సీతారాముని పేట కూడలి నుంచి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ కు రూ. 25 లక్షల హుండి కానుకలు.

భీమవరం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణం లోని ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీలు తెరచి బుధవారం లెక్కించారు. గడచిన 26 రోజుల కాలానికి, హుండీల ద్వారా రూ. 25,63,619/- రూపాయలు భక్తులు మావుళ్ళమ్మ కు కానుకలుగా సమర్పించుకున్నారు. బంగారం 30.200 గ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచారు. కాకినాడ పట్టణం…

Read More

పవన్ కళ్యాణ్ పై వేసిన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు.

అమరావతి: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రముఖ నటులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై, మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ వేసిన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా సందర్భంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, టిక్కెట్ ధర పెంపులో నిబంధనలు పాటించలేదని, మేరకు విచారం జరిపించాలని పిటిషనర్ విజయ్ కుమార్ కోర్టుకు వెళ్లారు. వీరి తరఫున న్యాయవాది బి.బాలయ్య వాదించారు. అడ్వకేట్ జనరల్…

Read More

ఉత్తర అమెరికాకు ప్రత్యేక ప్రతినిధిగా మిరియాల శ్రీనివాస్ నియామకం.

అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక పరిపాలనా నిర్ణయం తీసుకుంది. ఉత్తర అమెరికాలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రతినిధ్యం వహించేందుకు శ్రీ మిరియాల శ్రీనివాస్‌ను ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ జారీ చేసిన జి.ఓ.ఆర్.టి నంబర్ 632 ప్రకారం, ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

Read More

వ్యవసాయ అధికారుల క్షేత్ర పర్యటన.

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండలం వెలివెల, ఆరట్లకట్ట గ్రామాల్లో ఆత్మ వారి సహకారం తో మంగళవారం రైతులకు సమావేశం ఏర్పాటు చేశారు. అగర్తి పాలెం లో వరి పాలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమం లో మారుటేరు శాస్త్ర వేత్తలు డాక్టర్ మల్లి కార్జునరావు మాట్లాడుతు వరి పంట పాలు పోసుకొనే దశ లో ఉన్నది ఉక్కబోత గా ఉంటుంది, కావున దోమ వచ్చే సూచన ఉంది, కాబట్టి రైతులు జాగ్రత్తగా పొలం…

Read More

యుటిఎఫ్ నిరాహార దీక్ష

పాలకొల్లు: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) యూటీఎఫ్ రణభేరి 3. పిఆర్సి కమిషన్ ఏర్పాటు, ఐ ఆర్ 29% ప్రకటించుట, డి ఎ బకాయిలు చెల్లించుట, 2004 కు ముందు నియమించబడిన ఉద్యోగులకు ఓ పి ఎస్అమలు చేయాలనే అంశాలపై రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు పాలకొల్లు నియోజక పరిధిలో పాలకొల్లు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరం లో ఉదయం 10 గంటలునుండి 3 గంటల వరకు 70 మంది…

Read More

దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన,దళిత క్రైస్తవుల రిజర్వేషన్ పై సుప్రీంకోర్టు తీర్పుపై, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 25లను నేరుగా ఉల్లంఘిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వంపై కూడా…

Read More

మీ ఇంటికి-మీ డాక్టర్ పథకం ప్రారంభించిన కలెక్టర్ నాగరాణి.

భీమవరం: మార్చి, 24,(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామీణ, తీరప్రాంత నిరుపేదలకు వైద్య సేవలు అందించేందుకు “మీ ఇంటికి మీ డాక్టర్” సంచార వైద్య యూనిట్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం ప్రారంభించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రూ.1.30 కోట్లతో అమలు చేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా డాక్టర్ బృందం గ్రామాలకు వెళ్లి ఉచిత వైద్యం, మందులు అందిస్తుంది. శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా కార్యక్రమం కొనసాగనుందని, కలెక్టర్ చదలవాడ నాగరాణి…

Read More

ఎనర్జీ (విద్యుత్) యూనివర్సిటీ ఏర్పాటు చేయండి- సీఎం ఆదేశాలు.

అమరావతి: మార్చి, (తెలుగు న్యూస్ పవర్. కామ్) విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందుపుచ్చుకునేందుకు ఎనర్జీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులను మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎనర్జీ ట్రాన్సిషన్ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాల్లో ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు అధ్యాయనం చేయాలని కోరారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు నూతన ఆవిష్కరణల కోసం స్టార్ట్…

Read More