Telugu News Power

Blog

పూలపల్లి మరకతలింగ మహాక్షేత్రం సందర్శించండి.

-గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) ఫూలపల్లి లో వేంచేసి ఉన్న, శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత అమృత లింగేశ్వర ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించి, తరించవలసినదిగా గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాజీ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం, శివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు స్వామివారికి…

Read More

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీజీఓ అసోసియేషన్ మద్దతు.

భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12, 2026న జాతీయ సార్వత్రిక సమ్మె కు అలాగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. అనుబంధ సంఘాలన్నీ సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చింది.ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ సంఘీభావం తెలుపుతున్నట్లు, అధ్యక్షులు గుడాల హరిబాబు,కార్యదర్శి గుబ్బల ప్రసాద్ తెలిపారు. డిమాండ్లు: నూతన కార్మిక చట్టాల రద్దు,వేతన సవరణ, పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం…

Read More

ఏఎస్ఎన్ఎం కాలేజ్ విద్యార్థులకు డ్రోన్ పైలెట్ ప్రాక్టికల్స్

పాలకొల్లు: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్…

Read More

నేడే ఛాంబర్స్ కళాశాలలో ఆధునిక పాలనపై సదస్సు.

పాలకొల్లు: ఫిబ్రవరి,11(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఫిబ్రవర,12న మధ్యాహ్నం 2 గంటల నుంచి “స్థానిక పాలనపై ఆధునిక పోకడలు” అన్న అంశంపై సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాదు వారి ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు చైర్మన్, కారుమూరి నరసింహారావు తెలిపారు. ఈ సదస్సులో టంగుటూరి శ్రీరామ్, ప్రొఫెసర్ పి. మోహన్ రావు, సిహెచ్ విద్యాసాగర్, ఎన్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ బి. విజయ సారధి, తహసిల్దార్ వై దుర్గ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, పాలకొల్లు నందు విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ స్కీం కింద ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థ సహకారంతో పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I,…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఫిబ్రవరి, 10 (తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 23 నుండి 31 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 1 వ సెమిస్టర్‌లో మొత్తం 163 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 151 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత…

Read More

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బి ఆర్ ఆర్ & జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం, ది పాలకొల్లు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఈ సృష్టిలో కృత్రిమంగా దొరకనిది,…

Read More

పాన్ ఇండియా చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ అంతర్వేది పర్యటన.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రఖ్యాత పాన్ ఇండియా చిత్రాల రచయిత, రాజ్యసభ సభ్యులు, ప్రముఖ దర్శకులు రాజమౌళి తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్, స్థానిక అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. అంతర్వేది క్షేత్రం చాలా బాగుందని, కళా గా ఉందని, భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్షేత్రం దర్శించుకుంటే భక్తులకు కష్టాలు తీరుతాయని, అందరూ వచ్చి ఈ దైవ దర్శనం చేసుకోవాలని…

Read More

గర్భిణీ స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి – వైద్యుల సూచన

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక లంకలకోడేరు ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి వద్ద రోటరీ క్లబ్ అధ్యక్షులు, నిక్షయమిత్ర, డాక్టర్ రామకృష్ణ ఆనందరాజు, గర్భిణీ స్త్రీలకు, క్షయ వ్యాధిగ్రస్తులకు మంగళవారం సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, అదనపు పోషకాహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని, ఈ సమయంలో వారు తప్పక బలవర్ధక ఆహారం తీసుకోవాలని కోరారు. క్షయ వ్యాధి నివారణ ఇప్పుడు ఎంతో సులువని, ముందుతో పాటు బలమైన ఆహారం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు….

Read More

గీత కార్మికుని కుటుంబానికి మంత్రి 2.50 లక్షల సాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక పాలమూరుకు చెందిన గీత కార్మికుడు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన సందర్భంగా, వారి భార్య శ్రీదేవికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 2లక్షల రూపాయలతో పాటు, మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు అందజేశారు. ఈ రెండున్నర లక్షల రూపాయలతో,…

Read More