Telugu News Power

గ్రామాభివృద్ధి కూటమి ప్రభుత్వం కృషి.

పాలకొల్లు/పోడూరు/యలమంచిలి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) గ్రామాల్లో గత ప్రభుత్వం, ఐదేళ్లుగా అభివృద్ధి చేయలేదని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. నియోజకవర్గంలోని, 23 గ్రామాల్లో, ఆదివారం 4.43 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మురుగు కాలువల పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి, ఓ అరుదైన రికార్డు సృష్టించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి టిడిపి వ్యవస్థాపకులు…

Read More

కొత్త జలాంతర్గామితో భారత అణురక్షణ మరింత బలపడింది.

విశాఖపట్నం: ఫిబ్రవరి,21 (తెలుగు న్యూస్ పవర్) భారత్ తన మూడో అణువుశక్తితో నడిచే బాలిస్టిక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ హరిధామన్ ఈ ఏడాది ఏప్రిల్,మే నెలలోనౌకాదళంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. విశాఖపట్నంలోని అత్యంత భద్రతా ప్రమాణాలు ఉన్న షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించిన, ఈ సబ్మెరైన్ నిర్మాణంలో ఎల్ అండ్ టి లాంటి వం ప్రైవేట్ సంస్థలు కీలక పాత్ర పోషించాయి.విస్తృత సముద్ర ప్రయోగాలు సి ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం, ఇది భారత అణునిరోధక శక్తికి ఆధారమైన స్ట్రాటజి…

Read More

ఉపసభాపతి పై ఆరోపణలు తీవ్రంగా ఖండించిన సతీష్ రాజు.

ఉండి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) ఉప సభాపతి, స్థానిక ఎమ్మెల్యే, కనుమూరి రఘురామకృష్ణ రాజు పై ఉండి మండలం, వెలివర్రు గ్రామ నాయకుడు పొత్తూరి వెంకటేశ్వర రాజు, అలియాస్ బుడ్డియ్య రాజు చేసిన తీవ్రమైన, అనుచిత వ్యాఖ్యలను పత్రికా సమావేశంలో కల్లేపల్లి సతీష్ రాజు తీవ్రంగాఖండించారు. నియోజకవర్గ ప్రజలకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసినట్టు సతీష్ రాజు తెలిపారు. బుడ్డియ్య రాజు ఉన్మాదిగ మారి ఆధారాలు లేని, అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని,…

Read More

ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజుచే అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం.

కాళ్ళ: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ప్రాతాళ్ళమెరక గ్రామంలో పలు అభివృద్ధి పథకాలకు, శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీ ఐ ఐ డి సి చైర్మన్, స్థానిక మాజీ ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు రామరాజు,ప్రారంభోత్సవం చేశారు. విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్,30వ వార్షికోత్సవం సందర్భంగా, ప్రాతాళ్ళమెరకలో భారీ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు జరిగాయి. కాళ్ల మండలం ప్రాతాళ్ళమెరకలో సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. సిమెంట్…

Read More

జేఈఈ మెయిన్స్ లో మెరిసిన మరో ఆణిముత్యం హర్ష.

యలమంచిలి: ఫిబ్రవరి,21(తెలుగు న్యూస్ పవర్) మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి హర్ష శ్రీ వినయ్ జేఈఈ మెయిన్స్ లో ఆణిముత్యమై మెరిసాడు. హర్ష 99.97 పర్సంటెయిల్ తో మెయిన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. జనవరిలో జరిగిన జే ఈ ఈ మెయిన్స్ పరీక్షకు సుమారు13 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తమ్మినీడి(నందమూరి) శ్రీనివాసు, అరుణ దంపతులకు మొదటి సంతానం హర్ష. చదువులో తొలి నుంచి చురుగ్గా ఉంటూ, ప్రతిభావంతుడైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. అనేక…

Read More

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

పాలకొల్లు: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) ప్రతి ఏట ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకుంటాం. జగతిలో అమ్మ తర్వాత అమ్మ అంత విలువ గలిగినది అమ్మ నుడియే(మాతృభాష) అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ సందర్భంగా అందరికీ ఒక మనవి . మనలో ఎంతమందికి మాతృభాష పై అభిమానం ఉన్నది. అసలు నేడు ఎంత మంది మాతృభాష గురించి ఆలోచిస్తున్నారు అనే అంశాన్ని చర్చించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది .మనలో చాలామందికి తెలియని…

Read More

డిజిటల్ టెక్నాలజీతో 8వ జనగణన.

అమరావతి: ఫిబ్రవరి,20(తెలుగు న్యూస్ పవర్) భారతదేశంలో పదేళ్లకు ఒకసారి జరిగే జనగణన కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. భారతదేశంలో జరిగే 16వ జనాభా లెక్కల గణన ఇది. స్వాతంత్ర భారతదేశంలో 8వ జనగణన. వచ్చే ఏడాది ఈ జనగణన ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోకూడా జనాభా లెక్కల సేకరణకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే. విజయానంద్ స్థానిక సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారుల(కలెక్టర్ల)తో శుక్రవారం సన్నాహక…

Read More

తహశిల్దార్ కార్యాలయం వద్ద విఆర్వోల నిరసన.

యలమంచిలి: ఫిబ్రవరి, 19 (తెలుగు న్యూస్ పవర్) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన వీఆర్వోల నిరసన కార్యక్రమంలో భాగంగా యలమంచిలి మండల వీఆర్వోలు స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి గురువారం నిరసన తెలిపారు. జనవరి 12 నుంచి వర్కు టు రూల్ పాటించాలని సంఘం నిర్ణయించింది. వీఆర్వోలు రాత్రి పగలు తేడా లేకుండా బాధ్యతలు నిర్వహించవలసి రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. ఇందువల్ల కొందరు ప్రమాదాలకు గురవుతుంటే, మరి కొందరు ఆత్మహత్యలు పాల్పడ్డ…

Read More

రైల్వేవారు దారి వదలాలి రైతులు విజ్ఞప్తి.

యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) కోటిపల్లి-నరసాపురం రైల్వే లైను ఏర్పాటు గురించి సేకరించిన భూమిలో రైల్వే వారు తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు కంచె ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఏనుగువానిలంక,కలగంపూడి మధ్య ఉన్న 7 ఎకరాలు భూసేకరణలో రైల్వే వారు తీసుకున్నారు. దీనికి సంబంధించి రైతులకు సొమ్ము కూడా అప్పుడే చెల్లించారు. రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలు ఇంతవరకు సజావుగా నిర్వహించుకుంటున్నారు. దాళ్వాపంట మాసూళ్లకువస్తున్న సమయంలో కంచ ఏర్పాటు చేయడం వల్ల రైతుల రాకపోకలకు అడ్డంకి ఎదురవుతుందని రైతులు…

Read More

ఏటిగట్టు పనులతో ప్రమాదం -పాలకొల్లు వైసీపీ ఇన్చార్జ్ గుడాల గోపి ఆరోపణ

యలమంచిలి: ఫిబ్రవరి,18 (తెలుగు న్యూస్ పవర్) స్థానికంగా జరుగుతున్న ఏటిగట్టు పనులు ప్రమాదాన్ని తెచ్చి పెట్టేలా ఉన్నాయని పాలకొల్లు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ గుడాల హరి గోపాల్ రావు, గోపి ఆరోపించారు. ఏటిగట్టు పక్కనే ఉన్న మట్టి తవ్వి, పైకి వేయడం వల్ల వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు బలం లేక కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏటిగట్టు పనులు జరుగుతున్న ప్రాంతాన్ని గోపి బుధవారం పరిశీలించారు. ఏటిగట్టు పనులు స్థానిక శాసనసభ్యులు…

Read More