Telugu News Power

సుప్రీంకోర్టు తీర్పు, నర్సాపురానికి బంగారు భవిష్యత్తు – ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.

నర్సాపురం: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) గౌరవ భారత అత్యున్నత న్యాయస్థానం ప్రకటించిన తీర్పు,నరసాపురం ప్రాంత అభివృద్ధికి బంగారు బాటలు వేస్తుందని, స్థానిక లోక్సభ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రంలో, స్థానిక జనసేన ఎమ్మెల్యే, విప్ బొమ్మిడి నాయకర్ తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. చించినాడ- దిండి, వశిష్ట వారధికి ఇరువైపులా ఉన్న జాతీయ రహదారి 216, విస్తరణ సంబంధించి భూసేకరణ విషయంలో, భూస్వాములు న్యాయం కోరుతూ,…

Read More

ప్రతి ఇంటికి పాడిపశువు ఉండాలి – కలెక్టర్ నాగరాణి

పాలకొల్లు: ఫిబ్రవరి, 18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక మండలం, అగర్తిపాలెంలో పశుసంవర్ధక శాఖ, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం సంయుక్తంగా నిర్వహించిన మెగా పశు వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి బుధవారం ప్రారంభించారు. గోమాతకు పూజలు చేసి శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్, గర్భకోశ శస్త్రచికిత్స, నట్టల నివారణ, గోమార్ల నివారణ, ఉచిత మందులు, ల్యాబ్ పరీక్షలను స్వయంగా పరిశీలించారు. రైతుల సమావేశంలో మాట్లాడుతూ,స్వచ్ఛమైన పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, కల్తీ పాల వల్ల ప్రమాదాలు…

Read More

కత్తి పట్టిన క్షత్రియులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,18(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్ఫూర్తితో, ఆఖరి మజిలీ చేసే స్మశాన ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సంకల్పించినట్టు, పాలకొల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పేర్కొన్నారు. స్థానిక పూలపల్లి, రాజుల స్మశాన వాటిక ప్రాంతాన్ని భగవాన్ రాజు ఆధ్వర్యంలో పలువురు క్షత్రియులు కత్తి పట్టి శ్రమదానం చేసారు.అడవిలా…

Read More

నర్సాపురం వద్ద వంతెన నిర్మించాలి. -కాంగ్రెస్ పార్టీ డిమాండ్

నరసాపురం: ఫిబ్రవరి, 18 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వశిష్ట గోదావరిపై వెంటనే వంతెన నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. జిల్లా బీసీ నాయకులు,కొలకలూరి అర్జునరావు ఆధ్వర్యంలో బుధవారం, వాళ్ళందర్ రేవులో అర్జున్ రావు మాట్లాడుతూ, 2004 నుంచి చాలా ప్రభుత్వాలు మారినప్పటికి, ఇప్పటికీ బ్రిడ్జి నిర్మించకపోవడం పట్ల నిరసన తెలిపారు. సముద్రంలో కూడా బ్రిడ్జిలు కడుతున్న నేటి అభివృద్ధి చెందిన సాంకేతిక నైపుణ్యంతో, నర్సాపురం వంటి చిన్ని గోదావరి నిర్మించలేకపోవటం, ప్రజల్ని మభ్యపెట్టడమేనన్నారు. తాము…

Read More

సఖినేటిపల్లి నుంచి జాతీయ రహదారి 216.

రాజోలు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) దిండి – చించినాడ గోదావరిపై నది పై నిర్మించిన వంతెన, ఉభయ గోదావరి లను కలుపుతూ 216 జాతీయ రహదారికి అనుసంధానంగా ఉంది. సఖినేటిపల్లి మీదుగా 216 జాతీయ రహదారి కలపటానికి, సుప్రీంకోర్టులో కేసు అడ్డంకిగా మారింది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇంతకాలం,ఇందువల్ల జాతీయ రహదారికి అడుగు ముందుకు పడలేదు. రాజులు నియోజకవర్గ అభివృద్ధికి 216 జాతీయ రహదారి ఎంతో దోహదపడుతుంది. ఈ కేసులో, రాజోలు జనసేన,…

Read More

వాకర్స్ క్లబ్, పాలకొల్లు సహాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలోనే నిజమైన ఆనందం ఉన్నదని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. కొత్త కుళాయి చెరువు వద్ద సభ్యులతో కలిసి,మంగళవారం స్థానిక క్లబ్ తరపున, పలువురికి సహాయం అందించారు. కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షుడు మానెం బసవరాజు, సలాది రామచంద్రరావు, కోశాధికారి పోతుల ఉమాశంకర్ రావు, సభ్యులు కటారి నాగేంద్ర కుమార్, చామా శ్రీనివాసరావు, మానెం ధనుంజయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ…

Read More

విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం, లంకల కోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. పాఠశాలల్లో 6,328 మంది వద్దు లకు గాను 98 శాతం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమాన్ని ధనలక్ష్మి ప్రారంబభించారు. డాక్టర్ నవ్య జీవన్, మాత్రలు వేసుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు గంగాధర్ శర్మ, వీరస్వామి, పి సత్యనారాయణ రాజు, నెక్కంటి ఆదినారాయణ, ఆకుల ధనలక్ష్మీ,…

Read More

జిల్లాలో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు.

తాడేపల్లిగూడెం: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జిల్లాకు తొలి విడతగా, 22,855 మంది ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు సోలార్ వెలుగులు ప్రసరించనున్నాయి. పి ఎం సూర్యఘర్ పధకం ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ పధకం ద్వార కేంద్ర ప్రభుత్వం నిధులు 60 వేల రూపాయలు, మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. మొదటి విడత లబ్ధిదారులకు 260.18 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ప్రతి ఇంటికి 2 కిలోవాట్ల సామర్థ్యంగల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తారు. తాడేపల్లిగూడెంలో…

Read More

ఫోను ముట్టుకున్నా చాలు సొమ్ము కొట్టేస్తారు. కొత్త మోసం. మీ మంచితనమే వారి పెట్టుబడి.

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) ఆధునిక సాంకేతికతతో, ఈ డిజిటల్ యోగంలో మానవులు ఎన్నో పనులు ఇంటి నుంచే,చిటికెలో పూర్తి చేస్తున్నారు. వాటిలో ఉన్న లొసుగులటెక్నాలజీని తమ చెప్పు చేతల్లోకి తీసుకుని,ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు లక్షల కోట్లు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న, ప్రజలు ఈ మోసాలకు గురికాక తప్పడం లేదు. చాలామంది పబ్లిక్ లో మంచివాళ్లు అనిపించుకోవాలని చాలా కుతూహల పడుతూ ఉంటారు. ఎందరికో సాయం చేయాలని తహతలాడుతారు కూడా. ఇదే…

Read More

ఐసెట్, ఏపీ పీజీ సెట్ ఉచిత రిజిస్ట్రేషన్ సేవా కేంద్రం ఏర్పాటు.

పాలకొల్లు: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పేపర్) ఈ ఏడాది నిర్వహించనున్న, ఏపీ ఐసెట్, పీజీ సెట్, రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి కోసం, స్థానిక ఛాంబర్స్ కళాశాలలో, సేవా కేంద్రం ఏర్పాటు చేశారు. ఆన్ లైన్లో చేసే,ఈ రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితం. ఐసెట్ ఫీజు 750, పీజీ సెట్ 850 రూపాయలు అభ్యర్థులు ఆన్లైన్లో చెల్లించాలి. కళాశాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వివరాలకు, 9912046234,7989908776 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి. పాలకొల్లు…

Read More