Telugu News Power

వీఆర్వోల వర్క్ టు రూల్ నేటి నుంచే

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) వీఆర్వోలు వర్క్ టు రూల్ పాటించి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిగంటలు ఉండాలని డిమాండ్ చేశారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం మండల వీఆర్వో, వీఆర్ఏలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వీఆర్వోల ఐక్యత వర్ధిల్లాలని, పని గంటలు తగ్గించాలని నినాదాలు చేశారు. ఇఎఫ్ఎస్ సర్వే, జాయింట్ ఎల్ పి ఎన్, సుమోటో క్యాస్ట్ సర్టిఫికెట్స్ వంటి వివిధ పనులతో…

Read More

శివరాత్రికి వీరభద్రుని సంబరాలు

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వీరభద్ర స్వామి సంబరాలు వాడవాడలా జరిగాయి. స్థానిక కొత్తపేట వీరభద్ర స్వామి గుడి వద్ద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఘటం శిరస్సుపై ధరించారు. భక్తులు వీరభద్రుని గద్దెల నుంచి జమ్మి చెట్టు వద్దకు, దేవాలయాలకు వెళ్లి ప్రసాదాలు, పానకాలు పంచారు. ఈ సందర్భంగా భక్తులు, తుము కోర్కెలు నెరవేర్చాలని, నిప్పుల గుండం పై నడిచారు. యలమంచిలి వీరభద్ర స్వామి గుడి వద్ద…

Read More

స్మశాన వాటిక పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు, శ్రమదానం.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి, సందర్భంగా శివునికి ప్రీతిపాత్రమైన భస్మస్థలి లో ఆదివారం, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్వగ్రాము ఆగర్తిపాలెం, స్మశాన వాటికలో శ్రమదానం చేసి, గ్రామస్తులకు ఆదర్శంగా నిలిచారు. ఆఖరి మజిలీ, పవిత్రంగా, ప్రశాంతంగా, సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో మంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, ఇతర సంస్థల నుంచి ఈ లక్ష్యం సాధించడానికి నిధులు సేకరిస్తున్నారు. స్మశాన వాటికలకు మంజూరైన 1.25 కోట్ల…

Read More

యుటిఎఫ్ రణభేరికి 17న తరలిరావాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి,15(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల, సుదీర్ఘకాల, పెండింగ్ సమస్యలపై రణభేరి కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, యుటిఎఫ్ సంఘం పిలుపునిచ్చింది. ఈనెల 17న విజయవాడలో ఉపాధ్యాయుల భారీ ప్రదర్శనకు సంసిద్ధులయ్యారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా, మొండిచేయి చూపటంతో, ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల17న తమకు రావలసిన ఆర్థిక బకాయిలు,పిఆర్సి కమిటీ నియామకం, ఐఆర్ ప్రకటించడం పై విజయవాడలో జరిగే రణభేరి 2.0 చలో విజయవాడకు…

Read More

దక్షిణ మధ్య రైల్వే జి ఎం రాక

నర్సాపురం: ఫిబ్రవరి, 14(తెలుగు న్యూస్ పవర్) దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాత్సవ, విజయవాడ, డివిజన్ డిఆర్ఎం మోహిత్ సోనాక్య, నరసాపురం రైల్వే స్టేషన్ ను శనివారం సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్ అభివృద్ధి కార్యక్రమం, భద్రత తనిఖీ కార్యక్రమాలు పర్యవేక్షించారు. వీరిని డి ఆర్ యు సి సి సభ్యులు, జక్కంపూడి కుమార్, పెద్దిరాజు వరి కంకులతో ఆహ్వానించారు. రైల్వేకు సంబంధించి ప్రయాణికుల సమస్యల పరిష్కారం కోసం వీరు రైల్వే…

Read More

ఆక్వా రైతుల సమరభేరి.

పాలకొల్లు: ఫిబ్రవరి14(తెలుగు న్యూస్ పవర్)గత 15 రోజుల క్రితం నుంచి రొయ్యల దాణ రేట్లు పెంచవద్దని ఆక్వా రైతులు చేస్తున్న విజ్ఞప్తిని పెడచెవినపెట్టి, ఈనెల 4న, కిలోకు నాలుగు రూపాయల చొప్పున పెంచడంపై ఆక్వా రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పన్నులు తగ్గించినప్పుడు, దానా రేటు తగ్గించకపోగా, ఆక్వా రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మూలిగే నక్కపై, తాటిపండు పడ్డట్టు, దాణా ధర పెంచడంపై రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. స్థానిక జై భారత్ క్షీరారామ రైతు సంఘం, అత్యవసరంగా శనివారం…

Read More

‘సేవా తీర్థ్‌’ లో కొలువు తీరిన ప్రధాని మోడీ.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సేవా తీర్థ్‌ ప్రారంభించారు. ఇకనుండి ప్రధానమంత్రి కార్యాలయం, కార్యకలాపాలన్నీ నూతనంగా నిర్మించిన ఈ సేవ తీర్థ నుండి ప్రధాన మోడీ నిర్వహించనున్నారు. కొత్త పీఎంఓ కార్యాలయం ‘సేవా తీర్థ్‌ ను ప్రారంభించిన వెంటనే, ప్రధాని మోదీ ప్రజా సంక్షేమం కోసం 4 కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. పిఎం రాహత్ పథకం ద్వారా లక్షన్నర వరకు ప్రమాద బాధితుల వైద్య చికిత్స కు అందజేస్తారు….

Read More

వచ్చేనెల 13 నుంచి పాలకొల్లు కళా పరిషత్.

పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చేనెల 13 నుంచి 15వ వరకు పాలకొల్లు కళాపరిషత్ నిర్వహించనున్న నాటిక పోటీలకు సంబంధించి, ఆహ్వాన పత్రిక శుక్రవారం ఆవిష్కరించారు. పాలకొల్లు పట్టణంలో గత 75 సంవత్సరాలుగా, నిర్వహిస్తున్న నాటక పోటీలు, తాము కూడా ప్రోత్సహించాలని ఉద్దేశంతో, పాలకొల్లు కళాపరిషత్ తరపున గత 17 ఏళ్లుగా నాటక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు కె.వి కృష్ణ వర్మ తెలిపారు. అడబాల థియేటర్ వద్ద నాటికలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు…

Read More

త్రాగునీటి కొరత లేకుండా చూడాలి. -కలెక్టర్ ఆదేశాలు

త్రాగునీటి కొరత లేకుండా చూడాలి. -కలెక్టర్ ఆదేశాలు భీమవరం: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) వచ్చే వేసవి నాటికి త్రాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆదేశాలు ఇచ్చారు. స్థానిక వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం మునిసిపల్ శాఖ అధికారులతో కలెక్టర్, నాగరాణి, సంయుక్త కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేశారు. త్రాగునీటి నాణ్యత పై…

Read More

సాగునీటి సరఫరా సక్రమంగా సాగాలి. -కలెక్టర్ నాగరాణి ఆదేశాలు

భీమవరం: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) జిల్లాలో సాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా కాలువల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. వశిష్ట సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో సాగునీటి డ్రైన్లు, షట్టర్లు, కాలవగట్లు, తూడు తొలగింపు పనులను వేగవంతం చేయాలని సూచించారు. మంజూరు కాని పనులకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని, టెండర్లు ప్రక్రియ ముందుగానే పూర్తి చేయాలన్నారు. కాలవలు నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పశ్చిమ…

Read More