Telugu News Power

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీజీఓ అసోసియేషన్ మద్దతు.

భారతదేశ వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఫిబ్రవరి 12, 2026న జాతీయ సార్వత్రిక సమ్మె కు అలాగే అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. అనుబంధ సంఘాలన్నీ సంఘీభావం తెలియజేయాలని పిలుపునిచ్చింది.ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ సంఘీభావం తెలుపుతున్నట్లు, అధ్యక్షులు గుడాల హరిబాబు,కార్యదర్శి గుబ్బల ప్రసాద్ తెలిపారు. డిమాండ్లు: నూతన కార్మిక చట్టాల రద్దు,వేతన సవరణ, పి ఎఫ్ ఆర్ డి ఏ చట్టం…

Read More

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం

ఛాంబర్స్ కళాశాలలో రక్తదాన శిబిరం పాలకొల్లు: ఫిబ్రవరి, 10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక బి ఆర్ ఆర్ & జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రాంగణంలో మంగళవారం, ది పాలకొల్లు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఈ సృష్టిలో కృత్రిమంగా దొరకనిది,…

Read More

పాన్ ఇండియా చిత్రాల రచయిత విజయేంద్రప్రసాద్ అంతర్వేది పర్యటన.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) ప్రఖ్యాత పాన్ ఇండియా చిత్రాల రచయిత, రాజ్యసభ సభ్యులు, ప్రముఖ దర్శకులు రాజమౌళి తండ్రి కోడూరి వెంకట విజయేంద్ర ప్రసాద్, స్థానిక అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలిగిందన్నారు. అంతర్వేది క్షేత్రం చాలా బాగుందని, కళా గా ఉందని, భక్తి భావాన్ని వ్యక్తం చేశారు. ఈ క్షేత్రం దర్శించుకుంటే భక్తులకు కష్టాలు తీరుతాయని, అందరూ వచ్చి ఈ దైవ దర్శనం చేసుకోవాలని…

Read More

గీత కార్మికుని కుటుంబానికి మంత్రి 2.50 లక్షల సాయం.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు తన క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం గీత కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక పాలమూరుకు చెందిన గీత కార్మికుడు, ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మరణించిన సందర్భంగా, వారి భార్య శ్రీదేవికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 2లక్షల రూపాయలతో పాటు, మంత్రి వ్యక్తిగతంగా 50 వేల రూపాయలు అందజేశారు. ఈ రెండున్నర లక్షల రూపాయలతో,…

Read More

అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించిన మంత్రి.

పాలకొల్లు: ఫిబ్రవరి,10(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనుల శాఖామాత్యులు రామానాయుడు పట్టణంలో మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక 27 వార్డులో స్మశాన వాటిక పనుల పురోగతిని పరిశీలించి, అందంగా తీర్చిదిద్దడానికి పోలీసులను చేశారు. స్థానిక 100 పడకల ఆసుపత్రి సుందరీకరణ పనులు పరిశీలించారు. కొత్త కులాయిచెరువు గట్టు పటిష్టత గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో డ్రోన్ పైలెట్ శిక్షణ.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో విద్యార్థుల్లో ఉపాధి నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం మరియు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు, అనంతపురం జిల్లా వారి ఆర్థిక సహకారంతో, పీఎం–ఉషా జి.ఐ.ఈ. ఐ స్కీంలో భాగంగా ఏరీస్ ఆగ్రో లిమిటెడ్ ముంబై, కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్–I, II మరియు మహిళా సాధికారతా విభాగం వారి ఆధ్వర్యంలో బాలికలకు ప్రత్యేక…

Read More

భవన నిర్మాణానికి గాంధీ భగవాన్ రాజు లక్షన్నర విరాళం.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఆర్టిస్టులు, పెయింటర్లు వెల్ఫేర్ అసోసియేషన్ భవనం నిర్మాణంలో కొనసాగుతున్నది. ఈ భవన నిర్మాణానికి, దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఈ అసోసియేషన్ నాయకులు, సోమవారం, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు, కాస్మో కల్చరల్ క్లబ్ అధ్యక్షులు, గాంధీ మెగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజును కలిసి, భవన నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా, భగవాన్ రాజు తన సొంత నిధుల నుంచి 50 వేల…

Read More

ఉపాధ్యాయ డిమాండ్లపై యుటిఎఫ్ పోస్ట్ కార్డ్ ఉద్యమం

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) ఉపాధ్యాయుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ, యుటిఎఫ్ చేపట్టిన ఉద్యమంలో భాగంగా, సోమవారం పోస్ట్ కార్డులు, స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం, తపాలా పెట్టిలో ఉత్తరాలు వేసే కార్యక్రమాన్ని, జిల్లా ప్రధాన కార్యదర్శి,పోలిశెట్టి క్రాంతికుమార్ ప్రారంభించినారు. పి ఆర్ సి కమిషన్ వెంటనే నియమించాలని, డి ఏ బకాయలు చెల్లించాలని, మధ్యంతర బృతి, తక్షణమే ప్రకటించాలని, ఉత్తరాల్లో, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధ్యక్షులు జి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి పి రామమూర్తి నాయుడు…

Read More

కాపులకు 5 శాతం ఈడబ్ల్యూఎస్ కోట వర్తింప చేయాలి -రాష్ట్రీయ జన సంక్షేమ సేన డిమాండ్.

పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) టిడిపి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జిఓ ప్రకారం కాపు రిజర్వేషన్ కోరుతూ మాజీ మంత్రి,ఎంపీ,చేగోండి హరి రామ జోగయ్య, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్రీయ జన సంక్షేమ సేన తరపున సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు లేఖ సంధించారు. అగ్రవర్ణాలైనా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య , క్షత్రియ, వెలమ మొదలగు కులాలతో విద్య ఉద్యోగ రంగాలలో పోటీ పడలేక కాపులు వెనుకబడి…

Read More

తాళాబత్తులకు ఘనసత్కారం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 9(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, నటినట సంక్షేమ సమాఖ్య, తాళబత్తుల వెంకటేశ్వరరావుకు జరిగిన సత్కారం గురించి సోమవారం తెలియజేశారు. ఈ సందర్భంగా వారు,పాలకొల్లు ముద్దుబిడ్డ రచయిత,కళాభిమాని,కళాకారుడు, నాటక సంస్థ ప్రతినిధిగా ఎన్నో ఏళ్లుగా కళామతల్లి సేవలో తరిస్తున్న, తాళ బత్తుల వెంకటేశ్వరరావుకు, గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కళామందిరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న భారతరంగ్ మహోత్సవ్ అంతర్జాతీయ నాటకోత్సవాల సందర్భంగా ప్రతిష్టాత్మకమైన, సత్కారం అందుకున్నారు….

Read More