Telugu News Power

జగన్ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ రద్దు చేసినప్పుడు, వైసిపి కాపు నాయకులు ఏమయ్యారు? -విప్ బొలిశెట్టి ప్రశ్న.

అమరావతి: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన కాపు రిజర్వేషన్ జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పుడు, ఈ కాపు నాయకులంతా ఏమయ్యారని, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ అమలు కోసం వినతి పత్రం అందజేయటానికి, భారతీయ కాపు సేన అధ్యక్షులు కాలువ వెంకటేశ్వరరావు అధ్యక్షతన పలువురు ప్రతినిధులు బొలిశెట్టిని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి విషయానికి, కాపు నాయకులు పవన్ కళ్యాణ్…

Read More

వైసిపి పార్టీలో ఆటో డ్రైవర్ల చేరిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక రైల్వే గేట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లు శుక్రవారం వైసీపీ పార్టీలో చేరారు. నియోజకవర్గ ఇన్చార్జి గుడాల హరి గోపాల్ రావు,గోపి స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 18 మంది తటస్తులు ఈరోజు పార్టీలో చేరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్, మాజీ ఫ్లోర్ లీడర్, వైసీపీ సీనియర్ నాయకులు యడ్ల తాతాజీ, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర…

Read More

కాలేజీ కలప అమ్మకం

పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో నిరుపయోగంగా ఉన్న కలప అమ్మాలని, యాజమాన్యం నిర్ణయించింది. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈనెల 20న కొటేషన్లు షీల్డ్ కవర్లో కళాశాలలో అందజేయాలని ప్రిన్సిపల్ టీ రాజరాజేశ్వరి శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

Read More

ఛాంబర్స్ కళాశాలలో “స్థానికపాలన-ఆధునికపోకడలు” పై సదస్సు.

పాలకొల్లు: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల ప్రాంగణంలో, గురువారం, ప్రకాశం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్, హైదరాబాద్ వారి సౌజన్యంతో “స్థానిక పాలనలో ఆధునిక పోకడలు” అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టంగుటూరి శ్రీరామ్, వేమూరి ఆనంద సూర్య, ఛాంబర్స్ కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా టంగుటూరి శ్రీరామ్ మాట్లాడు, ప్రపంచవ్యాప్తంగా స్థానిక సంస్థలలో సుపరిపాలన, ఈ…

Read More

రఘు బాబుకు ఘన నివాళి

పాలకొల్లు; ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) బిజెపి పాలకొల్లు పట్టణ శాఖ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు, పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు, ఎస్ టి పి రఘు రామానుజాచార్యులు ఆకస్మిక మృతికి ఘన నివాళి అర్పించారు. చిత్రపటం వద్ద పాలకొల్లు పట్టణ శాఖ అధ్యక్షులు కొల్లి కొండా ప్రసాద్, బిజెపి రాష్ట్ర మీడియా సెల్ కన్వీనర్ ఉన్మట్ల కబర్ధి, బిజెపి సీనియర్ నాయకులు రైల్వే మెంబర్ జక్కంపూడి కుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెరుకూరి శ్రీనివాస…

Read More

అమెరికా రోడ్డు ప్రమాదంలో మరణించిన కందుల జాహ్నవికి 262 కోట్లు నష్టపరిహారం.

కర్నూలు: గురువుగారు 12,(తెలుగు న్యూస్ పవర్) జాహ్నవి కందుల ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లా, ఆదోని కి చెందిన విద్యార్థి. ఈమె అమెరికాలో ఎమ్మెస్ చేయటానికి వెళ్లారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ క్యాంపస్ నుంచి నడిచి రోడ్డు దాటి వెళుతుండగా, జనవరి5, 2023 ఒక పోలీస్ అధికారి డ్రగ్స్ మత్తులో, 40 కిలోమీటర్ల వేగం వెళ్లవలసిన చోట, వంద కిలోమీటర్ల వేగం మించి, అక్కడ నుంచి వెళ్తున్న జాహ్నవిని ఢీకొట్టాడు. ఆమె వంద అడుగుల దూరంలో పడి, అక్కడికక్కడే…

Read More

జాతీయ సార్వత్రిక సమ్మె ఘనవిజయం.

భీమవరం/పాలకొల్లు/యలమంచిలి: ఫిబ్రవరి, 12(తెలుగు న్యూస్ పవర్) అఖిలభారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన జాతీయ సార్వత్రిక సమ్మె ఘన విజయం సాధించిందని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడంపై, దేశంలోని ప్రముఖమైన 10 కార్మిక సంఘాలు గురువారం జాతీయ సార్వత్రిక సమ్మె జరిపాయి. కార్మికుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని కాలరాస్తూ, మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు వెంటనే ఉపసంహరించుకోవాలని…

Read More

దేశవ్యాప్త సమ్మెకు ఎన్జీవోల సంఘీభావం.

పాలకొల్లు: ఫిబ్రవరి,12 (తెలుగు న్యూస్ పవర్) జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా, గురువారం, అఖిల భారత కేంద్ర కార్మిక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర యూనిట్ల తరఫున, స్థానిక ఏ పి ఎన్ జి ఓ యూనిట్ సంఘీభావం తెలిపింది. రాష్ట్ర, జిల్లా సంఘాల పిలుపుమేరకు, భోజన విరామ సమయంలో, స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఎన్జీవో నాయకులు, సభ్యులు, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ…

Read More

భారత్ రంగ్ మహోత్సవ్ లో కొంతేరు యూత్ క్లబ్ కు గుర్తింపు.

యలమంచిలి: ఫిబ్రవరి, 11(తెలుగు న్యూస్ పవర్) నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా,శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం, గుంటూరు, వేదిక(తెలుగు నాటక పరిశుద్ధుల సమ్మేళనం)వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న, భారత్ రంగ్ మహోత్సవ్ కార్యక్రమంలో, కొంతేరు యూత్ క్లబ్ గుర్తింపు లభించింది. కథకుడు, రచయిత, నాటక రచయిత, గుణ నిర్నేత, నిర్వాహకుడు, గంట కళ్యాణి నాయుడు ఈ సందర్భంగా పురస్కారం అందుకున్నట్టు, బుధవారం తెలిపారు. అంతర్జాతీయ నాటకోత్సవం దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటక అకాడమీ…

Read More

పూలపల్లిలో మెగా పార్క్

పాలకొల్లు: ఫిబ్రవరి,11 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక పూలపల్లి గ్రామంలో గాంధీ మెగా పార్క్ నిర్మాణానికి, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామంలో ప్రజలు, కుటుంబ సమేతంగా, ఆహ్లాదకర వాతావరణం లో గడపడానికి, అందరికీ అనువైన చక్కని ప్రదేశంలో ఈ పార్కు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో దుర్గాదేవి ఆలయానికి, ఇతర కమ్యూనిటీ హాల్ల నిర్మాణానికి స్థలాలు కేటాయించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పలువురు…

Read More