Skip to main content

Telugu News Power

మిర్చి యార్డ్ ఉపాధ్యక్షురాలిగా జనసేన వీర మహిళ.

గుంటూరు: ఫిబ్రవరి, 6 (తెలుగు న్యూస్ పవర్) ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైన గుంటూరు మిర్చి యార్డు, ఉపాధ్యక్ష పదవికి, బిట్రగుంట మల్లిక ఎంపికయ్యారు. గతంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, జనసేన పార్టీలో అనేక పార్టీ పదవులలో పనిచేశారు. గుంటూరులో కార్పొరేటర్ గా జనసేన తరఫున పోటీ చేశారు. వీరి ఎంపిక పట్ల జనసేన శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పలువురు జనసేన నాయకులు మల్లికను అభినందించారు.

Read More

మానవత కెరీర్ గైడెన్స్ .

పాలకొల్లు: ఫిబ్రవరి,6 (తెలుగు న్యూస్ పవర్) దిగమర్రు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సందర్భంగా, వారి ప్రతినిధులు పాల్గొని, విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ గురించి వివరించారు. విద్యార్థులు పట్టుదలతో చదివి, తమ కలలు నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిభావంతులైన 8,9,10 విద్యార్థులకు మానవతా సంస్థ వారు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కోట శ్రీనివాస్, చాముకూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ముంచుకొస్తున్న ఏ ఐ ముప్పు

విజయవాడ: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) వేగంగా ముంచుకొస్తున్న ఏఐ ముప్పు వల్ల, సాఫ్ట్వేర్ కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. అంత్రోపిక్ , క్లాడ్ ఐటీ రంగంలో ఉన్న వారికి సుపరిచితమైనది. ఇటీవల ఒక ఏ ఐ ఆటోమేషన్ టూల్ విడుదల చేసింది. ఇందులో 11 రకాల ఓపెన్ సోర్స్, ప్లగ్ఇన్స్ ప్రవేశపెట్టింది. ప్లగ్గిన్స్ అంటే ప్రస్తుతం వాడుతున్న మూల సాఫ్ట్వేర్ కు అనుబంధగా ఉండి, వాటి సామర్థ్యాన్ని మరింత విస్తృత పరుచడానికి ఈ ప్లగ్గిన్స్…

Read More

కుటుంబ సర్వేతో ప్రభుత్వ పథకాలకు అర్హులు -కమిషనర్ విజయ సారథి

పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిష్టాత్మకంగా జరుప తలపెట్టిన సమీకృత కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలని పాలకొల్లు మున్సిపల్ కమిషనర్ బి విజయ సారధి, గురువారం తన ఛాంబర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సర్వే లో నమోదైన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు. సర్వే జాబితాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ప్రయోజనాలు అందజేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే ప్రారంభించినట్టు వెల్లడించారు. పట్టణంలో…

Read More

నిజాయితీకి సూపర్ స్టార్ రజినీకాంత్ సత్కారం.

చెన్నై: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్)సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను సత్కరించారు. చెన్నై టీ నగర్ లో రోడ్డు పక్కన పట్టించుకోకుండా పడి ఉన్న 45 సవర్ల బంగారు ఆభరణాలు, విధి నిర్వహణలో ఉండగా పద్మ కంట పడ్డాయి. వెంటనే వాటిని పై అధికారులకు ఆమె అందజేసాశారు. పాండి బజార్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. సుమారు 45 లక్షల రూపాయల విలువైన బంగారాన్ని పోలీసులు సొంతదారులకు అప్పగించారు. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్ కే…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామియే మా రక్షకుడు-ఎమ్మెల్యే దేవర ప్రసాద్.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహుడే తమను కాపాడుతున్నాడని, జనసేన నాయకులు, రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ వెల్లడించారు. స్వామివారి ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, ప్రవచన కార్యక్రమం సందర్భంగా, గురువారం, వరప్రసాద్ మాట్లాడారు. మోంత తుఫాను, ఇరుసుమండ బ్లో అవుట్ నుంచి ఆ నరసింహస్వామి కాపాడారని తెలిపారు. ఈ క్షేత్రంలో తొమ్మిది బుధవారాల ప్రాశస్త్యం గురించి చాగంటి వారు తన ప్రవచనంలో తెలియజేయాలని కోరారు. దాదాపు 34 ఎకరాలు…

Read More

దివీస్ కంపెనీలు 7మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,5(తెలుగు న్యూస్ పవర్) దివీస్ కంపెనీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఏడు మంది ఉద్యోగాలు సాధించారు. స్థానిక ఛాంబర్స్ కళాశాలలో గురువారం జరిగిన ఈ ఇంటర్వ్యూలకు 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దివిస్ కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్, పూర్ణ ప్రసాద్, శరత్ అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. విజేతలకు 18 వేల నుండి 24 వేల రూపాయల వరకు వేతనం ఇస్తారు. వీటితోపాటుగా ఇతర అలవెన్సులు, పిఎఫ్, ఈఎస్సై వంటి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో…

Read More

జనసేనకు బొలిశెట్టి దూరం.

విశాఖపట్నం: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీకి దూరంగా ఉండబోతున్నట్టు బుధవారం విశాఖపట్నంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తాను పార్టీలో నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలకు వెంటనే వర్తిస్తుందని తెలిపారు. పార్టీల మధ్య విభేదాలు పొడచూపుకుండా ఉండేందుకు జనసేన పార్టీ తరపున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అంతకుముందు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం, పదవులు కేటాయించడం లేదని, బొలిశెట్టి బహిరంగ వేదికలపై అసంతృప్తి వ్యక్తం…

Read More

ట్రంప్ టారిఫ్ తగ్గింపు, ఆక్వారంగానికి ఊపు.

అమరావతి: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) భారత సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై విధించిన పన్ను 7శాతం ట్రంప్ ప్రభుత్వం తగ్గించడం, ఆక్వారంగానికి పూర్వ వైభవం తీసుకువస్తుందని వ్యవసాయ, మత్స్యశాఖామాత్యులు కింజరపు అచ్చం నాయుడు బుధవారం ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఇందుకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.గతంలో ఈ పన్ను 25 శాతంగా ఉండేది. ప్రస్తుతం ఆ పన్ను 18 శాతానికి కుదించారు. ఇందుకు అదనంగా అపరాధ రుసుము కూడా గతంలో వసూలు చేయడంతో సుమారు 58%…

Read More

సామూహిక ఎలుక నిర్మూలన.

పాలకొల్లు: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) వ్యవసాయ శాఖ చేపట్టిన సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం బుధవారం వివిధ మండలాల్లో జరిగింది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ, అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ఎలుకల నిర్మూలన కోసం స్వయంగా, ఎరను తయారుచేసి ఆగర్తిపాలెం రైతులకు పంపిణీ చేశారు. రైతులకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఉచితంగా పంచుతున్న బ్రోమోడియోలిన్ వాడి ఎలకల నుంచి పంటను రక్షించుకోవాలని ‘కోడి’ కోరారు. ఈ కార్యక్రమంలో ఆగర్రు సోసైటీ అధ్యక్షులు జాన్ రాజు, సర్పంచ్ కావలి…

Read More