Skip to main content

Telugu News Power

గజ, పొన్న వాహనములపై నరసింహ స్వామి గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది, దక్షిణ కాశి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు, గజ, పొన్న వాహనములపై గ్రామోత్సవం చేశారు, భక్తులను అనుగ్రహించారు. స్వామివారు, సాయంత్రం, గజవాహన గ్రామోత్సవం విశిష్టత గురించి అర్చక స్వాములు వెల్లడించిన విశేషాలు. గజరాజులు రాజసానికి ప్రతీకలు. రణరంగంలో, రాజ దర్బారులో, ఉత్సవాల్లో గజరాజు ప్రాధాన్యతా స్థానం. గజరాజు తనపై స్వామివారిని అధిష్టించుకున్నట్టు, భక్తులు తమ హృదయ పీటికపై స్వామివారిని ఆగష్టించుకుని…

Read More

పొన్న వాహనం పై స్వామివారి గ్రామోత్సవం.

స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా, శుక్రవారం, ఆరో రోజు రాత్రి, స్వామివారు పున వాహనంపై ఊరేగారు. ఈ వాహనం ప్రత్యేక సంతరించుకుంది, మిగతా వాహనాలన్నీ, వివిధ రూపాల్లో ఉంటే, పొన్న వాహనం మాత్రం, మహాభారత ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కృష్ణుడు, గోపికల చీరలు దొంగిలించకపోయే ఘట్టం మధ్యలో నరసింహుడు లక్ష్మీసమేతుడై, కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. పొన్న వృక్షం అంటే కల్ప వృక్షం. ఈ వృక్షంపై ఉన్న స్వామివారి దర్శించుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయని, పొన్నవాహన సేవ…

Read More

శివరాత్రి ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం.

పాలకొల్లు: జనవరి,30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి శివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై ధర్మకర్తల మండలి సమావేశం శుక్రవారం స్థానిక అభిషేక మండపం నందు నిర్వహించారు. ఈ సమావేశానికి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు అధ్యక్షత వహించారు. వచ్చేనెల 15వ తేదీన జరిగే శివరాత్రి మహోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. భక్తుల సౌకర్యార్థం, చలువ పందిళ్లు, వేయించడం, దర్శనాలకు తగినట్టుగా క్యూలైన్ల ఏర్పాటు, విద్యుత్ వెలుగుల అలంకరణ, భక్తులకు మంచినీటి సౌకర్యం,…

Read More

అంతర్వేది రథోత్సవం, భక్తజనుల కోలాహలం

సఖినేటిపల్లి;జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, గురువారం తెల్లవారుజామున అంగరంగ వైభవంగా జరిగింది. ఉగ్ర నరసింహ స్వరూపం గల,స్వామివారు పెళ్లి కళ సంతరించుకొని, పెళ్ళికొడుకై తరలిరాగా, లక్ష్మీదేవి అమ్మవారు, సిగ్గులొలుకుతూ, పెళ్లికూతురై వివాహ వేదిక చేరుకున్నారు. స్వామివారి కల్యాణ వేడుక బుధవారం రాత్రి గడియలు దాటి 1.56 గంటల ముహూర్తానికి గురువారం జీలకర్ర బెల్లం పెట్టే దృశ్యం చూసి భక్తులు తరించిపోయారు. మంగళసూత్ర ధారణ తదితర వివాహ క్రతువు పండితులు జరిపించారు. ఈ ఏడాది…

Read More

మావుళ్ళమ్మ ఉండి లెక్కింపు.

భీమవరం: జనవరి,29(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి హుండీ లెక్కింపు గురువారం జరిగింది. సుమారు, 59,25,412 నగదు, కానుకల ద్వారా మొక్కులు తీర్చుకున్న భక్తులు సమర్పించుకున్నారు. బంగారం 45.100గ్రాముల, వెండి 210 గ్రాములు భక్తులు హుండీలో వేశారు. వివిధ విదేశీ కరెన్సీ నోట్లు అమ్మవారికి భక్తులు సమర్పించుకున్నారు.

Read More

వెండి మకర తోరణం కానుక

పాలకొల్లు: జనవరి, 21, (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, కుక్కల గుడి అనే రామాలయం దగ్గర వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో, స్వామివారికి 18 కేజీల వెండితో చేయించిన మకర తోరణాన్ని బంగారు కృష్ణ బాబు, నాగరాణి దంపతులు కానుక సమర్పించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురుల శాఖ మాత్యులు, నిమ్మల రామానాయుడు, అమృత హస్తాలతో బుధవారం, స్వామివారికి అలంకరింప చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామి, పాలకొల్లుకే గాక…

Read More

నేడే యలమంచిలి, పుంతల ముసలమ్మ, మహా అన్నదానం.

యలమంచిలి: జనవరి,20(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి, కుళాయి చెరువు వద్ద గల, శ్రీశ్రీశ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా, బుధవారం, సాయంత్రం, మాంసాహార వంటకాలతో మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో 12 రకాల వంటకాలు భక్తులకు రుచి చూపనున్నారు.

Read More

క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి, ఎకరా 75 సెంట్ల భూమి కానుకగా ఇచ్చిన,పోతురెడ్డి కామరాజు మనువమలు.

పాలకొల్లు: జనవరి,16(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరారామలింగేశ్వర స్వామి వారికి, పూలపల్లి గ్రామానికి చెందిన పోతురెడ్డి కామరాజు, వారి మనుమలు ఎకరా 75 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. స్వామివారి దర్శనం నిమిత్తం ఈ కానుక సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భమిడిపాటి వెంకన్న అభిషేక పండితులచే, పార్వతీ పరమేశ్వరులకు, అర్చన పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం భూమి కానుకగా ఇచ్చిన దాతలను శేష వస్త్రములతో ఆలయ అధికారులు సత్కరించారు. వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు….

Read More

లక్ష్మీ గణపతి హోమం

పాలకొల్లు: జనవరి, 6(తెలుగు న్యూస్ పవర్) స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష్మీ గణపతి హోమం జరిగింది. ఏడు వారాలు, మారేడు దళ సప్త ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు విగ్నేశ్వర స్వామి వారి పూజ, శివ సహస్రనామం పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభిషేక పండిట్ భమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు.

Read More

లక్ష చామంతి పూజ

యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం గణపతి హోమం, స్వామివారి అభిషేకం, లక్ష చామంతి, తులసి పూజ జరిగింది. వెంప పండితులు సూరిబాబు, అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యులు వారి బృందం ఈ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు, ధర్మకర్తలు, వంటిపల్లి ప్రసాద్, పలువురు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతోఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More