Skip to main content

Telugu News Power

శివ సహస్రనామ పూజ

స్థానిక క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ఏడువారాల, ఏడు మారేడు దళాల, సప్త ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న భక్తులకు మంగళవారం విఘ్నేశ్వర పూజ, శివ సహస్రనామ పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో జరిపారు. అభిషేక పండిట్ బమిడిపాటి వెంకన్న, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప ఈ పూజలు నిర్వహించారు. ఈ పూజలో పలువురు దంపతులు పాల్గొన్నారు.

Read More

క్షీరారామ ఆలయ ధర్మకర్తల మండలి సమావేశం

పాలకొల్లు:డిసెంబర్23 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రం, స్థానిక శివాలయం ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానిక అభిషేక మండపంలో అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. నూతన కమిటీ ప్రధానంగా ఆలయ అభివృద్ధి గురించి విస్తృతంగా,ఈ సమావేశంలో చర్చించారు. ఆలయ అర్చకులు, అభిషేక పండితులు యొక్క అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, క్రిస్టప్ప,అభిషేక పండిట్ సూరిబాబు, పర్యవేక్షకులు…

Read More

పాలకొల్లు పంచారామ క్షేత్రంలో కథాకళి నృత్య ప్రదర్శన

పాలకొల్లు: డిసెంబర్ 22 (తెలుగు న్యూస్ పవర్) పంచారామ క్షేత్రమైన పాలకొల్లులో సోమవారం రాత్రి కథాకళి నృత్య ప్రదర్శన జరిగింది. శ్రీనివాస కళ్యాణం అనంతరం సోమవారం బ్రహ్మోత్సవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈ నృత్య కళాకారులు శివాలయ ప్రాంగణంలో మహాదేవుని ముందు తమ ప్రదర్శన ఇచ్చారు. ప్రతి సోమవారం సాయంత్రం జరుగుతున్న మారేడుదళ సప్త ప్రదక్షణ కార్యక్రమంలో సుమారు 250 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచహారుతుల సేవ జరిపించారు. ఆలయ ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

శ్రీనివాస బ్రహ్మోత్సవం ఊరేగింపు

పాలకొల్లు డిసెంబర్ 22 తెలుగు న్యూస్ పపర్ ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సోమవారం శ్రీనివాస బ్రహ్మోత్సవ ఊరేగింపు, పాలకొల్లు పురవీధుల్లో వివిధ కళా ప్రదర్శనలతో ఘనంగా జరిగింది. స్వామివారు కొలువు తీరిన రధం ఈ ఊరేగింపులో తరలిరాగా, భక్తులు స్వామివారిని సేవించి తరించారు. పలు నృత్య ప్రదర్శనలతో పాటు కేరళ కథాకళి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకర్షించింది. ఉభయగోదావరి జిల్లాల గోవింద…

Read More

వైభవంగా సత్యదేవుని వ్రతం

పాలకొల్లు:డిసెంబర్,21(తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతం అత్యంత వైభవంగా జరిగింది. వెయ్యి యాగాల పుణ్యఫలం తో సమానమైన సత్యదేవుని వ్రతం వందల మంది దంపతులతో కిక్కిరిసిపోయింది. నిర్వాహకుల అంచనాలకు అందని సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం ఉచితంగా నిర్వాహకులు అందజేశారు. అన్నవరం సత్యనారాయణమూర్తి దేవస్థానం నుంచి వచ్చిన 11మంది పండితులు, సత్యనారాయణ వ్రతం,…

Read More

కనుల పండుగగా శ్రీవారి కల్యాణోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఉభయ గోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణోత్సవ విగ్రహాలతో శనివారం రాత్రి ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో ఈ ఉత్సవం జరిగింది. తిరుపతి నుంచి వచ్చిన పండితులు, ఇతర ప్రముఖ అర్చకులు ఈ కళ్యాణం ఉత్సవం వైభవంగా జరిపించారు.ఈ కళ్యాణోత్సవంలో కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు దంపతులు, కాటంరెడ్డి సత్యనారాయణ దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా ఉదయం…

Read More

నేడే కల్యాణోత్సవాల ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,19( తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవింద మాల కళ్యాణ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న, 33వ వార్షికోత్సవ కార్యక్రమాలు శనివారం ఉదయం ప్రారంభం కానున్నాయి. గణపతి హోమం ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. వెంకటేశ్వర స్వామి కళ్యాణం సాయంత్రం 5గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణోత్సవ విగ్రహాలతో స్వామివారి కళ్యాణం జరుపుతారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులకు తిరుపతి లడ్డు ప్రసాదం అందజేయడానికి నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ…

Read More

యలమంచిలి శిఖరాలు చేరిక

యలమంచిలి: డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక తాడిగరువు తోట వద్ద వేంచేసి ఉన్న యలమంచిలి గ్రామ దేవత,శ్రీ శ్రీ శ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పుణఃనిర్మాణం చేపట్టారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరగనుంది. నూతన దేవాలయ శిఖరం పై ఉంచవలసిన పంచలోహ శిఖరాలు శుక్రవారం వరకు యలమంచిలి చేరుకున్నాయి. వీటి బరువు 85 కేజీల 385 గ్రాములు. వీటిని తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి స్థానిక విష్ణాలయంలో…

Read More

కళ్యాణోత్సవాలతో పులకించునున్న పాలకొల్లు.

పాలకొల్లు: డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) ఉభయగోదావరి జిల్లాల గోవిందమాల కళ్యాణోత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్న 33వ కళ్యాణోత్సవాలతో పాలకొల్లు భక్తజనం పులకించనున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు పాలకొల్లు ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ పుణ్య కార్యానికి స్థానిక పెనుమదం రోడ్డులో గల ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణం వేదిక కానుంది. గణపతి హోమం శనివారం ఉదయం 7గంటలకు ప్రారంభమవుతుంది. దేవరపల్లి రామకృష్ణ దంపతులు పూజలు నిర్వహిస్తారు. శ్రీ చక్ర పూజ శనివారం ఉదయం…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం సిద్ధం

సఖినేటిపల్లి: డిసెంబర్,16 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథోత్సవ ఘట్టానికి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేవస్థానంలో ముందుగా పూజలు నిర్వహించి, మేళతాళాలతో రథం షెడ్డు కు వెళ్లి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి రథాన్ని బయటకు తీసుకువచ్చారు. ఇకనుండి రథోత్సవం వరకు రథాన్న శుభ్రం చేయటం, అలంకరించడం వంటి పనులు చేపడుతారు. ఊరేగింపుకు రథాన్న సంసిద్ధం చేస్తా మనీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్…

Read More