పశు సంపద కోసం రైతులకు అవగాహన కార్యక్రమం. -మంత్రి అచ్చెం నాయుడు
విజయవాడ: జూన్, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో రానున్న వ్యవసాయ సీజన్లో ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాల నేపథ్యంలో, పశుసంపద రక్షణ, పశుపోషకుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టింది. వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, పశువులకు పచ్చిమేత కొరత తలెత్తకుండా చూడాలనే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పశుగ్రాసాల సాగును ప్రోత్సహిస్తోంది.ఇందులో భాగంగా “ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ (పి ఎం డి ఎస్)” రుతుపవనాలకు ముందేపూడి…