Skip to main content

Telugu News Power

ఉండి రైతులకు 28 లక్షలతో ఉచిత స్ప్రేయర్లు పంపిణీ.

ఉండి: ఫిబ్రవరి, 8 (తెలుగు న్యూస్ పవర్) ఉపసభావతి, మాజీ ఎంపీ, స్థానిక శాసనసభ్యులు, కనుమూరి రఘురామకృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద జరిగిన కార్యక్రమంలో 400 మంది రైతులకు ఉచితంగా బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్లు పంపిణీ చేశారు. ఐ సి ఏ ఆర్- భారతీయ వరి పరిశోధనా సంస్థ, హైదరాబాద్ వారి సౌజన్యంతో 28 లక్షల విలువైన ఈ ప్రేయర్ లో రైతులు అనుకున్నారు. రైతులు ఆధునిక, సాంకేతిక వ్యవసాయ…

Read More

వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరణ పై కార్మికలోకం హర్షం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరణ నిర్ణయం పై ప్రభుత్వానికి, స్థానిక శ్రీ వెంకటేశ్వర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక సంఘ కార్యాలయ భవనంలో ఆదివారం జరిగిన సంఘ సమావేశంలో హర్షం ప్రకటించారు. ఈ సమావేశానికి పెచ్చెట్టి బాబ్జి అధ్యక్షత వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు చొరవతో, కార్మిక శాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల బోర్డు మళ్లీ జీవం పోసుకోవడం తమకు…

Read More

కాపు విద్యార్థులకు స్కాలర్షిప్

పాలకొల్లు: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిభ గల పేద కాపు విద్యార్థులకు, ఉపకారవేతనాలు అందజేస్తున్న తులసీ రామచంద్ర ప్రభు ను, స్థానిక మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ వైద్యులు, లయన్స్ క్లబ్ స్థాపకులు, త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, డాక్టర్ బాబ్జి కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు. స్థానిక లయన్స్ క్లబ్ హాల్లో ఆదివారం స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సీఐ కే. రజనీ కుమార్ మాట్లాడుతూ, ప్రతిభకు, పేదరికం అడ్డు కాదన్నారు. విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో…

Read More

యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ హెల్త్ క్యాంప్

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) స్థానిక యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ, స్థానిక మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద గల హర్ష మెడి ల్యాబ్ సంయుక్తంగా, ఆదివారం, స్థానిక టౌన్ హాల్ వద్ద, షుగర్, బిపి పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 125 కి పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందజేశారు. స్థానిక బస్ స్టేషన్ వద్ద, ఈ శిబిరం ద్వారా ఎక్కువ మందికి సేవలు అందించాలని చూసినప్పటికీ స్థానిక ఆర్టీసీ అధికారులు…

Read More

పాలకొల్లు ఛాంబర్ కు నూతన సారధులు.

పాలకొల్లు: ఫిబ్రవరి,8(తెలుగు న్యూస్ పవర్) ప్రతిష్టాత్మక పాలకొల్లు చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఏకగ్రీవంగా జరిగిన ఈ ఎన్నికల్లో, అధ్యక్షులుగా, , కారుమూరి వెంకట రామ నరసింహారావు ఎంపికయ్యారు. వీరిది హ్యాట్రిక్ విజయం. కోకోనట్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు, కటారి నాగేంద్ర కుమార్, ఛాంబర్ ప్రధాన కార్యదర్శిగా, ఎన్నికయ్యారు. వీరికి ఇది రెండో విజయం. ఛాంబర్ కోశాధికారిగా, మామిడి బాబు వరుసగా రెండోసారి ఎంపికయ్యారు. నూతన సారధులను పట్టణ ప్రముఖులు, స్థానిక…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి, 8(తెలుగు న్యూస్ పవర్) శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు సంపూర్ణ, స్వర్ణమయ, స్వర్ణ నిధి పథకానికి, స్థానిక భక్త దంపతులు, గోంట్ల వెంకట రామారావు, వెంకట లక్ష్మి సత్యవతి ఆదివారం బంగారం కానుకగా సమర్పించుకున్నారు. లక్ష 17 వేల రూపాయల విలువైన, 8 గ్రాముల బంగారాన్ని అమ్మవారికి, ఆలయ అధికారుల ద్వారా సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, ఈ పుణ్య దంపతులకు, వేద ఆశీర్వచన పూజలు చేసి,…

Read More

కొంగు బిగించి, ట్రాఫిక్ సమస్యపై కొరడా జులిపించిన కలెక్టర్.

భీమవరం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) పట్టణ ప్రజలు, విద్యావంతులు, దుకాణదారులు ట్రాఫిక్ సమస్య పట్ల అవగాహనతో వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఎంతో కాలంగా భీమవరం పట్టణాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి, స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగారు. ద్విచక్ర వాహనంపై ఆమె పట్టణంలో, ఎస్పీ, అద్నాన్ నయీమ్ అస్మి, అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేశారు. భద్రత వారోత్సవాలు వంటి అనేక సందర్భాల్లో ఈ సమస్యపై అవగాహన కల్పించినప్పటికీ, ఫలితాలు రాలేదన్నరు….

Read More

యలమంచిలిలో రథోత్సవం

యలమంచిలి: ఫిబ్రవరి, 7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక భక్తాంజనేయ స్వామి వారి నూతన నిర్మాణ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు శుక్రవారం నిర్వహించారు. స్వామివారికి సువర్చలాదేవికి కళ్యాణం శుక్రవారం జరిగింది. అనంతరం స్వామి వారిని రథంపై అధిష్టించి, గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రధాని లాగటానికి మహిళా భక్తులు పోటీపడ్డారు. ఏటి గట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు, ప్రధాన వీధుల గుండా సాగిన…

Read More

ఏడువారాల వెంకటేశ్వరుని ఈ ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు.

ఆత్రేయపురం: ఫిబ్రవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఏడువారాల వెంకటేశ్వరుని, స్థిర వారం ఒక్కరోజు ఆదాయం 18 లక్షలు భక్తులు సమర్పించుకున్నట్టు దేవాదాయ వర్గాలు తెలిపారు. వేద ఆశీర్వచనం,1,116 రూపాయల టికెట్ ద్వారా ఈ ఆదాయం లభించింది. వీరికి ఇకనుండి అంతరాలయ దర్శనం కల్పిస్తారు. ఇకనుంచి వి ఐ పి లు కూడా 200 రూపాయల టికెట్ అనివార్యంగా కొనవలసి ఉంటుంది. సిఫార్సులను దూరంగా ఉంచడానికి,250 మంది ఉద్యోగుల సెల్ ఫోన్లు ఆఫీసులో భద్రపరుస్తారు. కేవలం 5 మంది ఆలయ…

Read More

ఉద్యోగుల బకాయలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి.

పాలకొల్లు: ఫిబ్రవరి, 7(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు ను, యుటిఎఫ్ జిల్లా కమిటీ శనివారం కలిసారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయ,ఉద్యోగులకు ఉన్న బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవడానికి శాసనసభలో చర్చించాలని కోరారు. వేతన సవరణకు వెంటనే 12వ కమిషన్ వేయాలని కోరారు. చెల్లించవలసిన డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మధ్యంతర భృతి 29% వెంటనే అమలు చేసి చెల్లించాలని కోరారు….

Read More