Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎమ్ కాలేజీ విద్యార్థులు 9 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, జేకేసీ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో జీల్ కంపెనీ క్యాంపస్ డ్రైవ్ జరిగింది. ఈ డ్రైవ్‌లో మొత్తం 20 మంది విద్యార్థులు పాల్గొనగా, అందులో 09 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ హాజరై విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. విద్యార్థులు తమ విద్యతో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. ఐక్యుఏసీ సమన్వయకర్త శ్రీ…

Read More

దివిస్ కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు:ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, లో జేకేసీ ప్లేసెమెంట్ సెల్ మరియు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10మంది విద్యార్థులు, ఉద్యోగాలకు ఎంపికయయ్యాలరు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యకు నైపుణ్యాలు జోడించినప్పుడే ఉపాధి…

Read More

బూట్ క్యాంపుకు ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ఎంపిక.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్టీఐహెచ్), కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ (సీసీఈ) ఆధ్వర్యంలో ‘పీఎం-యూఎస్ హెచ్ఎ’ కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో ఈ నెల 22 నుంచి 5 రోజుల బూట్ క్యాంప్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిగ్రీ కళాశాలల నుండి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులను ఈ శిబిరానికి ఎంపిక చేశారు. స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం…

Read More

ఛాంబర్స్ విద్యార్థులు 14 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) జీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 58 మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఈ ఎంపికలు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.జీల్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ లు పి వెంకటరామన్ మరియు ఏ హేమభూషణ్లు మూడు రౌండ్లు రాత పరీక్ష ,…

Read More

ఇంటర్మీడియట్ పరీక్షాకేంద్రాలపై మెరుపు తనిఖీ.

భీమవరం: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్) ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. స్థానిక మెంటే వారి తోట, జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో ఈ తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. మాస్ కాపీయింగ్ పై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని సూచించారు. పరీక్ష పేపర్లు సీసీ కెమెరాలు పర్యవేక్షణలో మాత్రమే…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష…

Read More

చాంబర్స్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ.

స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సౌజన్యంతో 7 రోజులు పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ జరిగింది.ఈ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు గారు హాజరై తమ కళాశాలలో విద్యతో పాటుగా, కమ్యూనికేషన్ స్కిల్స్, మెడికల్ కోడింగ్, రీజనింగ్, అర్థమెటిక్ ఆప్టిట్యూడ్, హెచ్ ఆర్ స్కిల్స్ లాంటి వాటిని విద్యార్థులకు అందించుట ద్వారా విద్యార్థులలో పోటీ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం విద్యార్థుల ప్రతిభ

పాలకొల్లు ఆర్ టి ఐ హెచ్- సీసీఈ ఇన్నో ట్రై కార్యక్రమంలో స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. స్టార్ తప్పు మైండ్ సెట్, ఇంట్రడక్షన్ టు ఎంటర్ ప్రిన్యూర్ షిప్ కోర్సులు పూర్తి చేసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలో కోర్సు పూర్తి చేసుకున్న వారిలో 10మంది, ఏ ఎస్ ఎన్ ఎం. కళాశాల వారు ఉండటం పట్ల ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, విద్యార్థులను గురువారం జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా…

Read More

ప్రణవి, మెయిన్స్ లో అద్భుత ప్రతిభ.

యలమంచిలి: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) ఇటీవల వెలువడుతున్న, జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో పలువురు తెలుగువారు తమ అద్భుత ప్రతిభను చూపుతున్నారు. వారిలో ముందు వరుసలో నిలిచారు, పశ్చిమగోదావరి జిల్లా, మండల కేంద్రమైన యలమంచిలికి చెందిన తమ్మినీడి ప్రణవి శ్రీలక్ష్మి. జేఈఈ మెయిన్స్ లో 99.54 పర్సంటేయిల్ సాధించారు. ఈమె తండ్రి తమ్మినీడి శ్రీనివాస్, విశాఖపట్నంలో జర్నలిస్టుగా కాగా. తల్లి ఇంజనీరింగ్ కాలేజీలో అధ్యాపకురాలు. ప్రణవి, ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేయాలని, లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు తెలిపారు. సాఫ్ట్వేర్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీలో నులి పురుగు నివారణ కార్యక్రమం.

పాలకొల్లు: ఫిబ్రవరి,17(తెలుగు న్యూస్ పవర్) జాతీయ నులి పురుగు నివారణ కార్యక్రమం, మంగళవారం, స్థానిక ఏయస్ఎన్ యం, ప్రభుత్వ కళాశాలలో మంగళవారం జరిగింది. వైద్యులు ఎం సౌభాగ్యవతి, ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులందరూ తప్పక వేసుకోవాలని సూచించారు. రక్తహీనతను తగ్గించడం, శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ టి. రాజరాజేశ్వరి, డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ లక్ష్మి, టి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More