Telugu News Power

ప్రపంచమంతా ఉద్యోగాలే

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచమంతా ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు, నరసాపురం వైఎన్ కళాశాల హెచ్ఆర్డి సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్. స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ మార్గదర్శనం పై ముఖ్య అతిథి ప్రసంగంతో దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలు అందుకోవడానికి విద్యార్థులు నిరంతరం స్థిరత్వంతో కూడిన అభ్యసన , భావవ్యక్తీకరణ నైపుణ్యాలు సాధన చేయాలని సూచించారు. సాంకేతిక మార్పులను ఎప్పటికప్పుడు అందుపుచ్చుకునే ప్రయత్నం…

Read More

డిగ్రీ విద్యార్థుల పారిశ్రామిక యాత్ర

పాలకొల్లు: డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులు మంగళవారం పారిశ్రామిక యాత్ర చేశారు. ఈ సందర్భంగా వారు నర్సాపురం లో ఉన్న అంతర్జాతీయ లేస్ ట్రేడ్ సెంటర్ సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న హస్తకళల ఎక్స్పోకు సంబంధించి, తమ పర్యటన ద్వారా పరిశీలించి, పలు విషయాలు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ యాత్రలో సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. లేస్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ కలవకొలను తులసి రావు ఈ లేస్ పార్క్ అంతర్జాతీయ ఖ్యాతి…

Read More

చాంబర్స్ కళాశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం.

పాలకొల్లు:డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) శాస్త్ర,సాంకేతిక రంగాలతో పాటు,మనిషి జీవితం ప్రతినిత్యం గణితంతో ముడిపడి ఉందని గణిత శాఖ హెచ్ ఓ డి డాక్టర్ జి సాయి బాబా పేర్కొన్నారు. ప్రపంచ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో సోమవారం గణిత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ విద్యార్థులు గణితం పట్ల అవగాహన పెంచుకోవాలని కోరారు. తరువాత గణిత సమస్యలకు సమాధానాలు ఇచ్చారు. కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహారావు మాట్లాడుతూ,…

Read More

గణిత మేధావి జయంతి ఉత్సవం

పాలకొల్లు: డిసెంబర్,22(తెలుగు న్యూస్ పవర్) విద్యార్థులు పైకి రావడానికి గణితం ఎంతో అవసరమని ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి పేర్కొన్నారు. స్థానిక అద్దేపల్లి అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం ప్రపంచ గణితమేధావుల్లో ఒకరైన శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్రను, గణిత పరిశోధనలు విద్యార్థులకు వివరించారు. పోటీ పరీక్షల్లో నెగ్గుకు రావాలంటే గణితలో ప్రతిభ తప్పనిసరి అన్నారు. ఈ సందర్భంగా పోస్టర్ మేకింగ్ పోటీల్లో…

Read More

టెట్ పరీక్ష పై వెంటనే రివ్యూ పిటిషన్ వేయాలి-యు టి ఎఫ్ డిమాండ్.

ఆచంట:డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) ఇప్పటికే ఎంతోకాలంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని యుటిఎఫ్ జిల్లా నాయకులు పోలిశెట్టి క్రాంతి కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక మెయిన్ స్కూల్లో మండల శాఖ కార్యవర్గ సమావేశం శుక్రవారం రాత్రి జరిగింది. రాష్ట్ర కౌన్సిలర్ కేతా వెంకటేశ్వర రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ ఆయా చట్టాలు సవరించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలో అమలవుతున్న , సెలవులు…

Read More

విద్యార్థుల హస్తకళల ప్రదర్శన

పాలకొల్లు;డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పవర్) వినియోగదారుల వారోత్సవాలు భాగంగా స్థానిక ఏఎస్ ఎన్ ఎమ్ ప్రభుత్వ కళాశాలలో హస్తకళల ప్రదర్శన, అమ్మకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ టీ కృష్ణ,మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యాపార నైపుణ్యాలు, స్వయం ఉపాధికి దారులు పడతాయని అన్నారు. విద్యార్థులు తాము తయారుచేసిన హస్త కళల వస్తువులను ప్రదర్శించారు. వాటిని అమ్మకానికి ఉంచారు. వాణిజ్య విభాగం, కన్జ్యూమర్ క్లబ్ ఈ కార్యక్రమాన్ని జరిపాయి. ఈ కార్యక్రమంలో కె భద్రాచలం డాక్టర్ ఎం రామకృష్ణ…

Read More

ఉపాధ్యాయుల క్లస్టర్ సమావేశం

యలమంచిలి: డిసెంబర్,20 (తెలుగు న్యూస్ పపర్) విద్యాశాఖ ఆదేశాల మేరకు యలమంచిలి మండలంలో శనివారం క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థుల 100 రోజుల కార్యాచరణ పై విస్తృతంగా చర్చించారు. ఈ ప్రణాళిక అమలు చేయటానికి ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఎంఈఓ రామకృష్ణ రాజు కోరారు. మేడపాడు క్లస్టర్లో ఎంఈఓ ఏ శ్రీవాణి పాల్గొన్నారు. యమంచిలి, చించినాడ,మేడపాడు, దొడ్డిపట్ల క్లస్టర్లకు సిహెచ్ వి సురేష్ బాబు, ఎం సీతారామయ్య, ఎం వెంకట సత్యనారాయణ,…

Read More

విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ

పాలకొల్లు:డిసెంబర్,19 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థినులకు వృత్తి విద్యా శిక్షణ శిబిరం శుక్రవారం ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి ప్రారంభించారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినులకు టైలరింగ్, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులకు ఎంబ్రాయిడరీ నేర్పుతారు. ఈ శిక్షణ పూర్తిగా ఉచితం. డబ్ల్యూ ఎఫ్ ఎఫ్ ఫౌండేషన్, కళాశాల మహిళా సాధికారిక విభాగం సంయుక్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. మహిళలు స్వశక్తిపై ఆధారపడి జీవించటానికి ఇలాంటి శిక్షణ ఇస్తున్నట్టు నిర్వాహకులు…

Read More

యు.టి.ఎఫ్. టెట్ పై ధర్నా

భీమవరం:డిసెంబర్,18 (తెలుగు న్యూస్ పవర్) ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్,రాష్ట్ర సంఘం టెట్ పై ఇచ్చిన కార్యాచరణ పిలుపుమేరకు, గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డిమాండ్ల తో ప్రాతినిధ్యం చేశారు. సీనియర్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని కోరారు. 2. టెట్ కు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఓడి మంజూరు చేయాలన్నారు.3. బదిలీ అయిన ఉపాధ్యాయులు వెంటనే విడుదల చేయాలని 4. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల సెలవు సమస్య పరిష్కరించాలన్నారు.5….

Read More

ఒక కుటుంబ, ఒక వ్యాపారవేత్త ఎన్ఎస్ఎస్ ప్రచారం.

పాలకొల్లు:డిసెంబర్,17 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తత గ్రామాలైన యల్లవానిగరువు,అడవిపాలెం లో విద్యార్థులు, అధ్యాపకులు, ఇంటికో వ్యాపారవేత్త నినాదంతో ప్రచారం చేశారు. ఇది దేశ అభివృద్ధికి బలమైన ఆధారమని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎం రామకృష్ణ, వి విజయలక్ష్మి, బూసి వెంకటస్వామి, ఆశాజ్యోతి, స్వర్ణలత,సచివాలయ సిబ్బంది విద్యార్థులు…

Read More