Telugu News Power

విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకోవాలి – డాక్టర్ బాబ్జి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు గల నైపుణ్యాలు నేర్చుకోవాలని, ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం మైక్రో గ్రీన్ కల్చర్, మరియు ఫ్యాబ్రిక్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మైక్రో గ్రీన్ వంటి మొక్కలు పెంపకం, ఆరోగ్యంతో…

Read More

అమెరికాలో ప్రమాదం పాలకొల్లులో విషాదం

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) స్థానిక, ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కొటికలపూడి రాజమోహన్రావు కుటుంబ సభ్యులు, కిన్నెర కూల్ డ్రింక్స్ అధినేత తాతాజీ కుమారుడు, కృష్ణ కిషోర్ (51) (టిన్ను), కోడలు ఆశ కన్నా అమెరికాలోని, వాషింగ్టన్ నగరంలో ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో మరణించినట్టు సమాచారం వచ్చింది. ఈ దంపతులు, తమ సంతానం శివాని, సుచయ్ కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ట్రక్ ఢీ కొట్టడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలియవచ్చింది. ప్రమాదంలో…

Read More

సంక్రాంతి లోపు వరి నాట్లు వేయాలి

పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) రైతులు, పండగ లోపు వరి నాట్లు పూర్తి చేయాలని, పాలకొల్లు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు మురళీకృష్ణ సూచించారు. మండలంలోని శివదేవుని చిక్కాల, దగ్గులూరు, బల్లిపాడు, లంకలకోడేరు, ఆగర్రు, గ్రామాల్లో సోమవారం వ్యవసాయ అధికారులు పర్యటించారు. మండలంలో దాళ్వా 9750 ఎకరాల్లో సాగుఅవుతుంది. ఇప్పటివరకు 1650 ఎకరాలలో నాట్లు వేశారు. నీటి కొరత లేకుండా దాల్వాపంట పండించడానికి, ఏప్రిల్ లోపు కోతకు వచ్చేలా రైతులు ప్రణాళిక వేసుకోవాలని కోరారు. ప్రస్తుతం మండలంలో…

Read More

లక్ష చామంతి పూజ

యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం గణపతి హోమం, స్వామివారి అభిషేకం, లక్ష చామంతి, తులసి పూజ జరిగింది. వెంప పండితులు సూరిబాబు, అర్చకులు వాడపల్లి కృష్ణమాచార్యులు వారి బృందం ఈ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు, ధర్మకర్తలు, వంటిపల్లి ప్రసాద్, పలువురు మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతోఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read More

సావిత్రిబాయి పూలే జయంతి సమావేశం

పాలకొల్లు: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) భారత స్త్రీకి విద్య ద్వారా బంధనాలనుంచి ముక్తి కలిగించాలని పూనుకున్న జ్యోతిబాయ్ పూలే, జయంతి సందర్భంగా,ఆదివారం, స్థానిక వైష్ణవి టెక్నో హైస్కూల్లో, ఎలమంచిలి మండల శాఖ ఈ సమావేశం నిర్వహించారు. సావిత్రిబాయి, చేసిన పోరాటాలను, ఎదుర్కొన్న కష్టాలను, స్ఫూర్తిదాయకమైన ఆమె జీవిత విశేషాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బి శైలజ అధ్యక్షత వహించారు. డి పద్మావతి, ఎస్ డి పాలేశ్వరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. యుటిఎఫ్, యలమంచిలి…

Read More

యలమంచిలి మండలంలో మంత్రి నిమ్మల పర్యటన

పాలకొల్లు,యలమంచిలి: జనవరి,4(తెలుగు న్యూస్ పవర్) రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు, స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు, పాలకొల్లు, యలమంచిలి మండలాలలో ఆదివారం పర్యటించారు. పాలకొల్లు కమ్యూనిటీ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో అదనంగా మరో రెండు బెడ్లు ఏర్పాటు చేశారు. మంత్రి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి వీటిని ప్రారంభించారు. ఆగర్రు లో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అందజేశారు. అనంతరం యలమంచిలి మండలంలో గుంపుర్రు వద్ద వల్లూరు మీడియం డ్రైన్ పై ఇన్ లెట్…

Read More

అమ్మవారికి భూరి విరాళం

యలమంచిలి: జనవరి, 4(తెలుగు న్యూస్ పవర్) స్థానిక కాపులపాలెం, కుళాయి చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆదివారం పందిరి రాడు వేశారు. ఈ సందర్భంగా, తాళ్లూరి శ్రీనివాస్ (వైజాగ్ బుజ్జి) శిరీష దంపతులు అమ్మవారికి 4.59 లక్షల రూపాయల భూరి విరాళం సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చివటపు నాగేశ్వరరావు, కాసా సత్య, వీరబాబు,బొప్పన రాంబాబు, శనగల శ్రీనివాస్, కొడవటి శివరామకృష్ణ, ఆకుల యేసు, కాసా ఆంజనేయులు…

Read More

వాడవాడలా సావిత్రిబాయి పూలే జయంతి

భీమవరం: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) భారతదేశ మొట్టమొదటి, మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఆయా పాఠశాలలో ఘనంగా జరిగాయి. జిల్లాలో దాదాపు 17 మండలాల్లో శనివారం కార్యక్రమం జరిగిందని జిల్లా యుటిఎఫ్ కార్యదర్శి పోలిశెట్టి క్రాంతి కుమార్ తెలిపారు. ఆదివారం మండల స్థాయిలో ఈ కార్యక్రమం జరపనున్నట్టు వెల్లడించారు. ఎలమంచిలి మండలంలో అన్ని పాఠశాలలో జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆయన పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురు మహిళా ఉపాధ్యాయులను ఈ…

Read More

డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన సదస్సు

పాలకొల్లు:డిసెంబర్,3 (తెలుగు న్యూస్ పవర్) డ్రగ్స్ వ్యసనం వల్ల కలిగే శారీరక,మానసిక,సామాజిక, చట్టపరమైన సమస్యలపై విద్యార్థులకు స్థానిక సీఐ కే రజని కుమార్ వివరించారు. పాలకొల్లు అద్దెపల్లి సత్యనారాయణ మూర్తి ప్రభుత్వ కళాశాలలో శనివారం డ్రగ్స్ వ్యసన నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రజిని కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ తో ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ఎస్సై జి పృద్వి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్…

Read More

అమరావతి మెడికల్స్ ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

పాలకొల్లు: డిసెంబర్,3(తెలుగు న్యూస్ పవర్) పట్టణంలో ఏర్పాటయిన నూతన వ్యాపార సంస్థ అమరావతి మెడికల్స్ ను కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ శనివారం ప్రారంభించారు. స్థానిక అద్దేపల్లి వారి సత్రం వద్ద నిర్మించిన వ్యాపార సముదాయంలో ఈ షాపు తెరిచారు. ప్రముఖ వైద్యులు, మాజీ ఎమ్మెల్యే త్సవటపల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, షాపులు ప్రారంభించారు. బ్రాండెడ్, ప్రిస్క్రిప్షన్ మందులు అందుబాటులో ఉంచటం ఈ షాపు ప్రత్యేకత….

Read More