విద్యార్థులు చదువుతోపాటు ఉపాధి నైపుణ్యాలు నేర్చుకోవాలి – డాక్టర్ బాబ్జి
పాలకొల్లు: జనవరి,5(తెలుగు న్యూస్ పవర్) ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు గల నైపుణ్యాలు నేర్చుకోవాలని, ప్రముఖ వైద్యులు, విద్యావేత్త, డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో సోమవారం మైక్రో గ్రీన్ కల్చర్, మరియు ఫ్యాబ్రిక్ బ్యాగ్ మేకింగ్ నేర్చుకోవడానికి సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ టి రాజరాజేశ్వరి అధ్యక్షత నిర్వహించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మైక్రో గ్రీన్ వంటి మొక్కలు పెంపకం, ఆరోగ్యంతో…