Skip to main content

Telugu News Power

భీమవరం కొత్త డిఎస్పీగా రఘువీర్ విష్ణు, -దసరా నుంచి సంక్రాంతి వరకు నడిచిన ఆకస్మిక బదిలీ కథ.

భీమవరం: డిసెంబర్,25 (తెలుగు న్యూస్ పవర్) క్రిస్మస్ పర్వదినం రోజున, జిల్లా కేంద్రం భీమవరంలో ఒక పెద్ద కుదుపు సంభవించింది. అకస్మాత్తుగా, సెలవు రోజు ఈ భారీ పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా రఘువీర్ విష్ణు భీమవరం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఇది మామూలు బదిలీ అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ, తెర వెనుక చాలా కథ నడిచిందని, జిల్లా ప్రజలకు తెలిసిందే. పూర్వ డిఎస్పి ఆర్ జి జై సూర్య…

Read More

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) పాలకొల్లు పట్టణంలో క్రిస్మస్ సందర్భంగా ముందు రోజు నుంచే చర్చిలు విద్యుత్ దీపకాంతులతో ఆకట్టుకున్నాయి.ఆరాధనలు, ఊరేగింపులు, బాలల నృత్యాలు, క్రిస్మస్ గీతాలు ఆలాపన, సువార్త వాక్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల క్రిస్మస్ కూటములు జరిగాయి. క్రైస్తవ భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభువును ఆరాధించారు. దేవుని తోటలో నాళం గుప్త,హౌస్ ఆఫ్ ప్రేయర్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు కార్యక్రమం వేడుకల సందర్భంగా…

Read More

వాకర్స్ క్లబ్ ఆర్థిక సహాయం

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక వాకర్స్ క్లబ్ వారు పేద విద్యార్థులకు బుధవారం ఆర్థిక సహాయం అందించారు. స్థానిక డిఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థులు విశ్వనాథం జానకి దేవి, కటకం శెట్టి దుర్గాభవానిలకు చేరో పదివేల రూపాయలు నగదు, రాజోలుకు చెందిన బోనం హాసిని అనే విద్యార్థికి ఏడు వేల రూపాయల ఔషధాలు అందించారు. వాకర్స్ క్లబ్ మానవత్వంతో తమకు సహాయం అందించినందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…

Read More

అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల శంకుస్థాపనలు.

పాలకొల్లు:డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) చిన్న గ్రామాలపై కూడా, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక బల్లిపాడు గ్రామంలో 88.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న, అభివృద్ధి పనులకు బుధవారం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. తాగునీటి సరఫరాకు 68.80 లక్షలతో ప్రారంభం…

Read More

హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి

నర్సాపురం, డిసెంబర్,24(తెలుగు న్యూస్ పవర్) హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆకా సత్యనారాయణ తో కలిసి రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు నరసాపురం లేస్ పార్కు బుధవారం సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న 2వ హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్పో ముగింపు రోజున మంత్రి హాజరయ్యారు. మహిళలకు ఎంతో సహనం, సృజనాత్మకత ఉందని, వారు తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా కనపడుతుంది అన్నారు. ఈ విధంగా…

Read More

ప్రపంచమంతా ఉద్యోగాలే

పాలకొల్లు:డిసెంబర్,24 (తెలుగు న్యూస్ పవర్) ప్రపంచమంతా ఉద్యోగాలు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు, నరసాపురం వైఎన్ కళాశాల హెచ్ఆర్డి సెంటర్ డైరెక్టర్, ప్రొఫెసర్ సిహెచ్ శ్రీనివాస్. స్థానిక ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు బుధవారం వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ మార్గదర్శనం పై ముఖ్య అతిథి ప్రసంగంతో దిశా నిర్దేశం చేశారు. ఉద్యోగాలు అందుకోవడానికి విద్యార్థులు నిరంతరం స్థిరత్వంతో కూడిన అభ్యసన , భావవ్యక్తీకరణ నైపుణ్యాలు సాధన చేయాలని సూచించారు. సాంకేతిక మార్పులను ఎప్పటికప్పుడు అందుపుచ్చుకునే ప్రయత్నం…

Read More

ఇసుక రవాణా బందుతో ఇబ్బందులు.

పాలకొల్లు, డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) ఇసుక తరలించే టిప్పర్ లారీల సమ్మె మంగళవారం కూడా కొనసాగింది. అక్రమ వసూళ్లు, కేసులు, కఠినమైన నిబంధనలు లారీల యాజమాన్యాలను అవస్థలపాలు చేస్తున్నాయి. ఈ మేరకు మంగళవారం టిప్పర్ లారీల పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు రావురి రాజా, జెసి రాహుల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తిప్పల్లారీ యజమానుల సమస్యలను పరిష్కరించాలని రాజా విజ్ఞప్తి చేశారు.

Read More

రెండు చుక్కల పోలియో మందుతో అంగవైకల్యం నుంచి రక్ష

పాలకొల్లు:డిసెంబర్,23(తెలుగు న్యూస్ పవర్) ఐదేళ్ల లోపు బిడ్డలందరికీ పోలియో మందు రెండు చుక్కలు వేయించడం వల్ల వారిని పోలియో వల్ల వచ్చే అంగవైకల్యాన్ని శాశ్వతంగా తరిమికొట్టవచ్చు అని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ వి వరప్రసాద్ పేర్కొన్నారు. ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న లంకలకోడేరు లోని, ఉప్పరిగుడం లో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న సర్వే విధానం ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పోలియో చుక్కలు వేయించుకోని వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూరు…

Read More

కళాశాలలో క్రిస్మస్ వేడుకలు

పాలకొల్లు:డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ,శాంతి,క్షమాగుణాల సమాహారం అన్నారు. ఏసుక్రీస్తు బోధనలు సేవాభావం, క్షమాగుణం, మానవత్వాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కోసి, క్యాండిల్ సర్వీస్ నిర్వహించారు. విద్యార్థులు క్రిస్మస్ కోరల్స్ ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో టి కృష్ణ, కే భద్రాచలం, వి యామిని, ఎం రామకృష్ణ,…

Read More

వినియోగదారుల వారోత్సవాలు ముగింపు.

పాలకొల్లు: డిసెంబర్,23 (తెలుగు న్యూస్ పవర్). స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో వినియోగదారుల ముగింపు ఉత్సవాలు మంగళవారం జరిగాయి. ఈ వారోత్సవాలు ఈనెల 17న ప్రారంభమై 23 తో ముగిసాయి. ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి మాట్లాడుతూ, వినియోగదారులు తమ హక్కులు బాధ్యతలు పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇలాంటి అవగాహన కార్యక్రమాల వల్ల వినియోగదారులను ముంచెత్తుతున్న, కన్జ్యూమెరిజం నుంచి కొంతవరకు బయటపడవచ్చునన్నారు. విద్యార్థులు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ విభాగాలు విజేతలైన విద్యార్థులకు బహుమతులు…

Read More