Telugu News Power

నేడే శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానంలో చండీ హోమం. రైతులకు అమ్మవారు అనుగ్రహించిన విత్తనాల పంపిణీ.

భీమవరం: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణ ఇలవేలుపు, తెలుగు ప్రజలు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో అమ్మవారి అనుగ్రహం కటాక్షం ప్రతి పౌర్ణమి నాడు జరిపే చండీ హోమం దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఉదయం 7 గంటలకు నిర్వహిస్తారు. నాట్లు వేసుకునే వ్యవసాయం సమయం, ఆషాడ మాస ఆరంభాన్ని సూచించే జ్యేష్ట పౌర్ణమి సందర్బంగా ఏరువాక పున్నమి సందర్బంగా రైతు సోదర, సోదరీమణులకు, భక్తులకు శ్రీ…

Read More

సరదాగా మొదలై, సోషల్ మీడియా ఊబిలో కూరుకు పోతున్న మహిళలు.

నర్సాపురం: జూన్,28 తెలుగు న్యూస్ పవర్. కామ్) సైబర్ నేరాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఎంత చెప్పినా వినకుండా మహిళలు కాలక్షేపానికి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు. కొంతమందికి అది వ్యసనంగా కూడా మారిపోతుంది. ఏదో బలహీన క్షణంలో తన గుట్టు అపరిచిత వ్యక్తులకు వెల్లడించడం పెనుముప్పుగా పరిణమిస్తున్నది. ఇలాంటి సంఘటన నర్సాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ కీలకమైన సైబర్ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. పోలీసులు తెలిపిన కేసు…

Read More

పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా కాపు సంఘాల సమావేశం.

విజయవాడ: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు చైతన్య రథం పేరిట రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపు నాయకులు ఆదివారం అమరావతి ఫంక్షన్ హాల్ లో సమావేశం నిర్వహించారు.గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాపు సమాజంలో చీలిక తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పలువురు కాపు సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కాపు యువత, కుల సంఘాల నాయకులు స్వచ్ఛందంగా…

Read More

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్. సాయి శ్రీనివాస్ ను ప్రకటించిన రాష్ట్ర కౌన్సిల్

అమరావతి: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా లంకలపల్లి సాయి శ్రీనివాస్ ను రాష్ట్ర కౌన్సిల్ ఆదివారం ప్రకటించింది. పోటీ చేయడానికి కలిసివచ్చే ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల మద్దతుతో ప్రస్తుత స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్ టి యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ గా లంకలపల్లి సాయి శ్రీనివాస్ పదవులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర కౌన్సిల్ తీర్మానం మేరకు సాయి శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.లంకలపల్లి సాయి శ్రీనివాస్…

Read More

సంచలనాలు సృష్టిస్తున్న కేతన్ అగర్వాల్ హత్య కేసు. వంచనతో ఓడిపోయిన ప్రేమ కథ.

పుణె: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రేమ పేరుతో వంచించి చివరకు హత్య కేసు గా మలుపు తిరిగిన ఘోర సంఘటన. సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసిన నేరపూరిత కుట్ర, లోహగడ్ కోటలో నేర పునర్నిర్మాణంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌ను పోలీసులు లోహగడ్ కోటకు తీసుకెళ్లి నేర పునర్నిర్మాణం…

Read More

సమాజాన్ని చైతన్య పరిచేవారు జర్నలిస్టులు. -మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తి జర్నలిజమని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవలన శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక కిరాణం మర్చంట్ అసోసియేషన్ హాల్లో జరిగిన రెండు రోజుల పాత్రికేయుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తిని ఇవ్వడం కోసం, చైతన్య పరచడానికి జర్నలిస్టులు నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంతో పనిచేస్తారని తన అనుభవం అని…

Read More

ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకొల్లు. -ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పట్టా ప్రధానోత్సవం లో మంత్రి నిమ్మల ఉవాచ. చిత్ర పరిశ్రమ ప్రగతికి హామీ.

పాలకొల్లు: జూన్,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచాన్ని అలరించిన కళాకారుల పుట్టిల్లు పాలకులని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందిన తొలి బ్యాచ్ విద్యార్థులకు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్ లో పట్టా ప్రాధాన్ ఉత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ గౌరవ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చిత్ర…

Read More

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కొత్త ఎంపీలు భేటీ.

న్యూఢిల్లీ: జూన్, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులుగా ఎగువసభలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరి చేత రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు. సానా సతీష్ బాబు, విజయ్ చింతాకాయల, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్( జనసేన) రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఈ పారిశ్రామిక, సామాజిక సేవానైతికతతో భారతీయ…

Read More

రికార్డులు బద్దలు కొట్టిన ప్రభుత్వ బడులు. ప్రైవేటు నుంచి లక్ష మంది విద్యార్థులు చేరిక.

అమరావతి: జూన్, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర విద్యా శాఖ మాత్యులు నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడులకు 1.06 లక్షల మంది ఏడాది మరలి వెళ్ళినట్టు అధికారులు మంత్రికి తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉన్నాయి. వీటిలో 3,515 పాఠశాలలో గరిష్టంగా 46.13 శాతం ప్రవేశాలు జరిగాయి. విద్యారంగంలో ప్రవేశపెట్టిన వినూత్న విధానాల వల్లనే ఇది సాధ్యమైందని సమావేశంలో నిర్ణయించారు. ఈ…

Read More

ప్రపంచ శస్త్ర చికిత్సకు తొలి వైద్యుడు శుశ్రుతునికి స్కాట్లాండ్ గౌరవం.

జనరల్ డెస్క్: జూన్,27( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ వైద్యశాస్త్రానికి మూల పురుషుడు, తొలి శస్త్రచికిత్స నిపుణులు శుశ్రుతునికి స్కాట్లాండ్ రాజధాని ఎడింబర్ లో అరుదైన గౌరవం లభించింది. సుమారు 2,600 ఏళ్ల తర్వాత “సర్జరీ పితామహుడు” శుశ్రుతుని ఎడిన్‌బర్గ్‌లోని ప్రపంచపు అత్యంత పురాతన శస్త్రచికిత్స కళాశాలలో భారత వైద్య వారసత్వానికి ఈ గౌరవం దక్కింది. “సర్జరీ పితామహుడు”గా విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన శుశ్రుత్‌ను అక్కడ ప్రత్యేకంగా సత్కరించారు.భారత వైద్య చరిత్రకు అంతర్జాతీయ గౌరవం ఈ…

Read More