జనసేనకు బొలిశెట్టి దూరం.
విశాఖపట్నం: ఫిబ్రవరి,4(తెలుగు న్యూస్ పవర్) జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీకి దూరంగా ఉండబోతున్నట్టు బుధవారం విశాఖపట్నంలో ప్రకటించారు. ఈ నిర్ణయం తాను పార్టీలో నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలకు వెంటనే వర్తిస్తుందని తెలిపారు. పార్టీల మధ్య విభేదాలు పొడచూపుకుండా ఉండేందుకు జనసేన పార్టీ తరపున తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అంతకుముందు జనసేన పార్టీకి కూటమి ప్రభుత్వ ధర్మం ప్రకారం, పదవులు కేటాయించడం లేదని, బొలిశెట్టి బహిరంగ వేదికలపై అసంతృప్తి వ్యక్తం…