Skip to main content

Telugu News Power

నేటి నుంచి క్షీరరామంలో విశేష పూజలు. పుష్కరకాలానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం.

ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు
ఆలయ చైర్మన్ మీసాల రాము

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి వచ్చే నెల 10వరకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్టు ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు గురువారం తెలిపారు. ఉదయం దేవాలయ అర్చకులు, అభిషేక పండితులచే గణపతి పూజ, రుత్విక వరుణ జపము ప్రారంభిస్తారు. వచ్చే నెల 9న విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, కలశ పూజ, రుష్యశృంగ మండపారాధన, ఆవాహన నిర్వహిస్తారు.
శాసనసభ్యులు, నీటిపారుదల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు అమృత హస్తాలతో హారతి నీరాజనం, మంత్రపుష్పములు, వేద ఆశీర్వచన తీర్థ ప్రసాదములు వినియోగం జరుగుతుంది. సోమవారం ఆరుద్ర నక్షత్రం రోజున ఉదయం గం.7-15 ని. ముల నుంచి శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేకం నీరాజన మంత్రపుష్పములు, వేద ఆశీర్వచన తీర్థ ప్రసాదములు వినియోగం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమము పుష్కర కాలానికి ఒకసారి మాత్రమే వస్తుంది. విశేషమైన పూజా కార్యక్రమానికి భక్తులు యావన్మంది ఈ సదావకాశామును సద్వినియోగం చేసుకొని తరలి రావలసిందిగా ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి అధ్యక్షులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.