Skip to main content

Telugu News Power

Telugu News Power

అల్లు రామలింగయ్యకు నివాళులర్పిస్తున్న అభిమానులు

పాలకొల్లు ముద్దుబిడ్డ స్వర్గీయ పద్మశ్రీ అల్లు రామలింగయ్య వర్ధంతి సందర్బంగా టాక్సీ స్టాండ్ వద్ద ఆయన కాంశ్య విగ్రహం వద్ద తులా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అల్లు రామలింగయ్య నాటక రంగం నుంచి సినీ రంగానికి వెళ్లి తొలినాళ్లలోనే మద్రాసు పరిశ్రమలో పాలకొల్లు ఖ్యాతిని చాటారని తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, జైలు కూడా వెళ్లారని వెల్లడించారు. హోమియో వైద్యునిగా అనేక మందికి సేవలందించారనిసీ వెల్లడించారు.ఆయన పరిశ్రమకు మెగా ప్రొడ్యూసర్…

Read More

పెట్రోలు డీలర్ల కమిషన్ పెంపుకు మంత్రి హామీ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కలిశారు.దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ రిటైల్ అవుట్‌లెట్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీలర్ల మార్జిన్‌లో 2017 నుంచి ఎలాంటి పెంపు లేకపోవడంతో పెరుగుతున్న నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ ఛార్జీలు, బ్యాంకు వడ్డీలు, ఇతర చట్టబద్ధ ఖర్చుల కారణంగా డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు…

Read More

బీజేపీలో చేరాలంటూ బెదిరింపులు వచ్చాయని సీజెపి అభిజీత్ దీప్కే ఆరోపణ.

న్యూఢిల్లీ: జులై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) బొద్ధింకల జనతా పార్టీ (సీజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తనకు బీజేపీలో చేరాలని బెదిరింపులు వచ్చాయని శుక్రవారం ఆరోపించారు. “మీకు, మీ కుటుంబానికి మేలు కావాలంటే బీజేపీలో చేరండి” అనే తరహా హెచ్చరికలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇది శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న యువతపై ఒత్తిడి తెచ్చే విధానమని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్ర నాయకులు యువత సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి,…

Read More

ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త మైలురాయి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాని మోదీచే నేడు ప్రారంభం.

విజయనగరం / అమరావతి: జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతిని మలుపు తిప్పే ప్రతిష్ఠాత్మక ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని’ (భోగాపురం ఎయిర్పోర్ట్) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేస్తారు. విజయనగరం జిల్లా భోగాపూర్ వద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జిమ్మెర్ గ్రూప్ దాదాపు రూ.5,640 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది. ​ఈ సందర్భంగా విమానాశ్రయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం…

Read More

గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరికకు రంగం సిద్ధం. రేవులో రాకపోకలు బంద్.

అమరావతి:జూలై,31( తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదావరి నదికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏ పీ ఎస్ డి ఎమ్ ఏ) అప్రమత్తత హెచ్చరిక జారీ చేసింది. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.39 లక్షల క్యూసెక్కులకు చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసే…

Read More

రాష్ట్ర పండుగగా శ్రీ పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి.

అమరావతి: జులై 31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్ని కుల క్షత్రియులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీ పూర్ణమండ లక్ష్మణ స్వామి వర్మ జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు చిలకలపూడి పాపారావు స్థానిక తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం పత్రికా సమావేశం నిర్వహించారు. చక్కని కురుక్షత్రియ చిరకాల మంచ నెరవేర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, సహకరించిన…

Read More

భోగాపురం విమానాశ్రయంలో థింసా నృత్యానికి ప్రపంచ రికార్డు.

విశాఖపట్నంభోగాపురం:జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సంప్రదాయ థింసా నృత్యం ప్రపంచ వేదికపై మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో 13,500 మంది గిరిజన మహిళలు, కళాకారులు ఒకేసారి థింసా నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. గిరిజనుల సాంప్రదాయ కళారూపమైన ధింసా నృత్యాన్ని ఒకే వేదికపై భారీ స్థాయిలో ప్రదర్శించడం…

Read More

శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేక పూజలు ప్రారంభం.

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు దండిగా పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం స్థానిక శాసన సభ్యులు, జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశములు మేరకు శ్రీ స్వామివారికి జలాభిషేకం పూజలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రుద్ర గాయత్రీ జపములు, నమకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, అభిషేకములు జరుగు ఈ ఏకాదశ క్రతువులో అభిషేక పండిట్లు అర్చకులు , రుత్వికులతో విశేషపూజలు నిర్వహిస్తారు. ఉదయం…

Read More

సూపర్ ఎల్ నినో, సాగు నీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలి.

-రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. నీటిపారుదలశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో భేటీ మంగళగిరి: జూలై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణపై దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడుకు సూచించారు. సాగు నీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన…

Read More

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. -ఆక్వా రైతు సంఘం హెచ్చరిక.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సభ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభించి, రాష్ట్ర రాజధాని అమరావతికి, అక్కడ నుంచి దేశ రాజధాని…

Read More