Telugu News Power

Telugu News Power

“జలధార – జలహారతి”కు కలెక్టర్ శ్రీకారం

పోడూరు; ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పెనుమదం గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం “జలధార – జలహారతి” కార్యక్రమానికి కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం శ్రీకారం చుట్టారు. అప్పి చెరువు పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గుణపంతో తవ్వి పనులు ప్రారంభించారు. కూడికచేత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం పాల్గొన్న కార్మికులకు స్వయంగా…

Read More

మహిళా బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరసన.

నిడదవోలు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్) తూర్పు గోదావరి జిల్లా, నిడదవోలు లో మహిళా రిజర్వేషన్ బిల్‌ ప్రతిపక్షం అడ్డుకోవడానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన జరిగింది. బిల్‌ను ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడానికి వ్యతిరేకంగా ఇక్కడ మహిళలతో కలిసి ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో స్థానిక మహిళా సంఘాలు, యువత, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. “మహిళల హక్కులు, ప్రజాస్వామ్య గొంతు” అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష వ్యూహాన్ని…

Read More

చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి…

Read More

రద్దీ రైల్వే స్టేషన్లలో 7 స్థానంలో విజయవాడ.

విజయవాడ: ఏప్రిల్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల జాబితా లో రైళ్ళ రాకపోకలుఆధారంగా 2024–2025 సంవత్సరానికి సంబంధించిన తాజా రైల్వే శాఖ శనివారంప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ 7వ స్థానంలో నిలిచింది. ప్రథమ స్థానంలో చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై ఉండగా, రోజుకు 1,250 రైళ్ళ రాకపోకలతో దేశంలోనే అత్యంత రద్దీ స్టేషన్‌గా నమోదైంది. రెండో స్థానంలో హౌరా…

Read More

నేను మంత్రిని కాదు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలా పనిచేశానో, ఇప్పుడు కూడా అలాగే కృషి చేస్తున్నానని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పాలకొల్లు ప్రధాన కాలువకు సంబంధించి రూ. 4.90 కోట్ల తో వివిధ పనులకు మంత్రి శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి, ఆశీర్వదించి నందుకు వారి ఆకాంక్షల మేరకు…

Read More

భీమవరంలో వేడిగాలి గుమ్మటం సవారి.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచంలో అత్యంత ఖరీదైన పట్టణాల్లో ఒకటైన జిల్లా కేంద్రం భీమవరం లో హాట్ ఎయిర్ బెలూన్ (వేడిగాలి గుమ్మటం) ఎగ్జిబిషన్, డిఎన్ఆర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ ప్రదర్శన తొలిసారి పట్టణానికి వచ్చింది. ఒక్కో బిర్యాని ఆరుగురు సభ్యుల సవారిశి అనగా ఉంటుంది. సుమారు 200 మీటర్ల ఎత్తుకు గాలిగుమ్మటం ఎగురుతుంది. వేసవి సెలవుల్లో బాలలకు ఇది చక్కటి అనుభూతి కలుగజేస్తుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి…

Read More

బూరుగుపల్లి లో ఘోరం, వృద్ధుడ్ని కారుతో ఢీ కొట్టిన వైనం.

యలమంచిలి: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బూరుగుపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి జాతర గురువారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్రంగా రక్షణ ఏర్పడింది. చౌక దుకాణం మాజీ డీలర్ కృష్ణ కుమారుడు బోణం గణేష్ బయటనుంచి కొందరు వ్యక్తులను బయట నుంచి తీసుకువచ్చి జాతరలో బీభత్సం సృష్టించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ హఠాత్పరిణామానికి జాతరలో పాల్గొని జనం చెల్లాచెదురయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సొసైటీ మాజీ…

Read More

ప్రత్యేక కార్యక్రమంలో దివ్యాంగుల అర్జీలు స్వీకరించిన కలెక్టర్.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)జిల్లాలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 15 అర్జీలు స్వీకరించి నట్టు తెలిపారు. ఆరోగ్యం, పెన్షన్, ఉపాధి, బ్యాంకు రుణాలు వంటి సమస్యలపై దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సేవాభావంతో స్పందించాలని,…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో చండీ హోమం.

భీమవరం: ఏప్రిల్, 17(తెలుగు న్యూస్ పవర్.కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసియున్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా, చండీహోమం జరిగింది.దేవస్థానo అర్చకులు, వేదపారాయణలు ఘనంగా హోమం నిర్వహించారు. ఈ హోమం పూజలో 60 మంది పైగా దంపతులు పాల్గొన్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, వుదిసి మీనాక్షి, కారెంపూడి ఆదిలక్ష్మి పాల్గొన్నారు.

Read More

సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు. -నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకర్.

నరసాపురం: ఏప్రిల్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్)ఈ నెల 13న నరసాపురం మండలం, సీతారాంపురం సౌత్ గ్రామంలోని స్వర్ణాంధ్ర కాలేజీ వద్ద జరిగిన ర్యాలీని ఉద్దేశించి, కొందరు వ్యక్తులు ఇన్స్టాగ్రామ్‌లో అభ్యంతరకరమైన పోస్టులు మరియు వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే విధంగా ఉన్న ఈ చర్యలను తీవ్రంగా పరిగణిస్తూ, మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో వివిధ సెక్షన్ల కింద చట్టం-2015 మరియు ఐటి చట్టం-2000 లోని సంబంధిత సెక్షన్ల కింద…

Read More