శ్రామికులకు మంత్రి విందు
పాలకొల్లు: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న శ్రామికులకు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు శ్రమైక జీవన సౌందర్యాన్ని గుర్తిస్తూ, వారికి చీరలు బహుమతిగా ఇస్తూ, విందు భోజనం ఏర్పాటు చేసి గౌరవిస్తున్నారు. ఈ పరంపరలో భాగంగా, శనివారం స్థానిక చింతపర్రు గ్రామంలో ఈ సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి శ్రామికులకు మజ్జిగ చలివేంద్రాలు నిర్వహించిన దాతలకు, శ్రేణులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. తన మంత్రి పదవిని…