ఉపాధి శ్రామికులకు పక్షానికోసారి వేతనాలు ఇవ్వాలి.
పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉపాధి శ్రామికులకు పనిచేసిన 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జ్ డిమాండ్ చేశారు. స్థానిక లంకలకోడేరు లో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ శ్రామికులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రెండు నెలల వరకు ఉపాధి శ్రామికులకు వేతనాలు అందటం లేదని ఆరోపించారు. ఫోటోల కోసం మండుటెండలో శ్రామికులను…