Skip to main content

Telugu News Power

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాకంబరి అవతారంలో అనుగ్రహ దర్శనం. అలంకరణకు 6 టన్నుల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.

భీమవరం: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి గురుపౌర్ణమి సందర్భంగా 6 టన్నుల వివిధ రకముల కూరగాయలు, పళ్ళు, ఆకుకూరలు తో శాకంబరి అలంకారంతో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా, నిర్వహించిన చండీహోమం కార్యక్రమంలో 90 మంది దంపతులు పాల్గొన్నారు. గాయత్రి డాన్స్ అకాడమి అత్తిలి డాన్స్ మాస్టర్ పెద్దిశెట్టి గాయత్రి దేవి…

Read More

క్షీర రామం లో చండీ హోమం

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం ఉదయం 9 గంటలకు చండి హోమం జరిగింది. దంపతులు 26 మంది తో భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఈ హోమం, పూజా కార్యక్రమాలు అభిషేక పండిట్ భమిడిపాటి వెంకటేశ్వర్లు నిర్వహించినారు. ఆలయ కార్యనిర్వహణధికారి ముచ్చెర్ల శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరిండెంట్ వాసు, అర్చకులు వీరబాబు మరియు ఆలయ సిబ్బంది…

Read More

రైతు సమస్యలపై ఎట్టకేలకు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

అమరావతి: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్. కామ్) కష్ట కాలంలో రైతులకు అండగా నిలవాలని వ్యవసాయ అధికారులను, మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన కార్యాచరణ ప్రణాళిక, రైతు అవగాహన కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు. వర్షపాతం 69 శాతం లోటు ఉందని, వచ్చే మూడు నెలల్లో…

Read More

ఢిల్లీలో తెలుగు ప్రముఖులకు సత్కారం. కేంద్రమంత్రి వర్మ అభినందనలు.

న్యూఢిల్లీ: జులై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా, మంగళవారం ఢిల్లీలో‘జాతీయ తెలుగు సారస్వత పరిషత్’ ఆధ్వర్యంలో నిర్వహించిన “జాతీయ తెలుగు వెలుగు సంబరాలు” కార్యక్రమానికి కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంటు సభ్యులు, భూపతి రాజు శ్రీనివాస వర్మ సభాధ్యక్షతన పురస్కార కార్యక్రమం నిర్వహించారు. విశిష్టమైన ప్రజా సేవ చేసిన ఆచంట నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి, పితాని…

Read More

డీఎస్సీ అక్రమాలపై విచారణ కోరుతూ, వైసిపి నిరసన ప్రదర్శన.

భీమవరం: జూలై, 28(తెలుగు న్యూస్ పవర్. కామ్) డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట అన్యాయాలు… ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్-జడ్ ఆగ్రహావేశాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించింది. ప్రజలతో కలిసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌…

Read More

శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి కళాశాలలో ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.

పాలకొల్లు: జూలై,28( తెలుగు న్యూస్ పవర్.కామ్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ I, II యూనిట్లు, ఎకో క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమం మంగళవారం జరిగింది.. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించి కళాశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా, ఆయన మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి వ్యక్తి కనీసం…

Read More

స్పెయిన్‌ను చుట్టేస్తున్న దావానలం. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన.

మేడ్రిడ్: జూలై,28( తెలుగు న్యూస్ పవర్. కామ్) పకృతిలో వచ్చే తీవ్ర మార్పుల వల్ల ఎల్నినో రంగ ప్రవేశం చేసింది. భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలతో కుత కుత ఉడికిపోతున్నది. మంచు దేశాల్లో మంటలు పుట్టిస్తున్నది. ప్రజలు తీవ్ర ఉష్ణోగ్రతలతో తట్టుకోలేక రోడ్ల మీదకు వచ్చి ఆహాకారాలు చేశారు. ఇప్పుడు ఈ తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల మరో ముప్పు ముంచుకొచ్చింది.స్పెయిన్‌లో కార్చిచ్చులు తీవ్రరూపం దాల్చడంతో ప్రభుత్వం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మాడ్రిడ్‌కు సమీపంలో, అవిలా ప్రాంతంలో దావానలాలు…

Read More

శక్తిశాట్ కు ఎంపికపై ప్రశంసల పరంపర. అంతరిక్షానికి నిచ్చెనలు వేస్తున్న జెస్సి మేథస్సు.

రాజమహేంద్రవరం: జూలై, 28 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కు చెందిన బాలిక కందుల జెస్సీకి ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, సాంస్కృతిక శాఖామాత్యులు కందుల దుర్గేష్ ను కలుసుకున్న జెసికి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చారు. ఈమె ప్రస్తుతం ధవలేశ్వరంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి. అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జెస్సి సాధించిన విజయం రాష్ట్రమంతటా,…

Read More

వచ్చే నెల 9న, క్షీరారామంలో మంత్రి నిమ్మల ఆధ్వర్యంలో వరుణ జ్వాలాభిషేకం.

పాలకొల్లు: జూలై, 28( తెలుగు న్యూస్ పవర్.కామ్) పట్టణంలో వేంచేసియున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానము నందు,వచ్చేనెల 9న ఉదయం గం 9 గంటలకు 108 కలశములతో లోక కళ్యాణర్థము వరుణ జ్వాలాభిషేకం జరగనుంది. స్థానిక శాసనసభ్యులు,రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. దేవాదా య ధర్మాదాయ శాఖ వారి సూచనలు మేరకు, శ్రీ పార్వతి, క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జ్వాలాభిషేకం పూజలు డాక్టర్ నిమ్మల…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్యాన్నదాన పధకానికి రూ. 3.15 లక్షల విరాళం.

భీమవరం: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి శాశ్వత నిత్యాన్నప్రసాద వితరణకు భీమవరం బిల్డర్స్ అసోసియేషన్స్ గౌరవ అధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్, వడుపు గోపి, గ్రంధి రవితేజ, ఎర్రంశెట్టి నాగేశ్వరావు, లీలా కృష్ణ తదితర 23 మంది మిత్రబృందం రూ.3.15 లక్షలు విరాళంగా అందజే సారు. వీరికి విశేష పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్…

Read More