Telugu News Power

Telugu News Power

సార్వాసాగుకు రైతులు సిద్ధపడాలి. -వ్యవసాయ అధికారుల సూచన

పాలకొల్లు: జూన్,1(తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు నియోజకవర్గం లో కాలువలు జూన్ ఒకటో తారీఖున గోదావరి నీటి విడుదల చేస్తామని ప్రభుత్వం వారు తెలియజేశారు కావున రైతు సోదరులు అందరు కూడా జూన్ మొదటి వారంలో నారుమడలు వేయడానికి సిద్ధపడాల్సిందిగా కోరుచున్నాము ఖరీఫ్ లో వరి రకాలు ఎంటియు 1318 ఎం టి యు 7029 అలాగే 12:93, 12 82, 1140,సంపద స్వర్ణ,ఈ వెరైటీలు అన్నీ కూడా సాగుకు అనుకూలము రైతు సోదరులు సమాయత్తమయి…

Read More

ఉపాధి శ్రామికులకు మజ్జిగతో సేద తీర్చిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) తరలిరాద తనే వసంతం, తన దరికి రాని వనాల కోసం అన్నట్టుగా స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు స్వయంగా ఉపాధి శ్రామికుల వద్దకు స్వయంగా వెళ్లి సోమవారం వారికి మజ్జిగతో సేద తీర్చారు. స్థానిక వెలివెల గ్రామంలో పంట బోదులలో పని చేస్తున్న శ్రామికుల వద్దకు కాలువలో దిగి వెళ్లి శ్రామికులకు మజ్జిగ అందజేశారు. గత ఏడాది నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో…

Read More

ఆక్వా రైతులను సీఎం ఆదుకోవాలి. -మాజీ ఎమ్మెల్సీ అంగర విజ్ఞప్తి

పాలకొల్లు: జూన్, 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయిందని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చాలా కాలంగా ఆక్వా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చక్కబడటానికి వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని, రైతులను ఆదుకోవాలని అంగర విజ్ఞప్తి…

Read More

బాధితులకు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు బెదిరింపులు. రైస్ మిల్లు వ్యవహారంలో ఏడు కోట్లు ఎగవేత.

పాలకొల్లు:జూన్ 1 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తమను చంపుతామంటూ బెదిరిస్తున్నారని వైసీపీ నాయకుడు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెలగ శ్రీరామమూర్తి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నిర్మాణానికి సంబంధించి మేక శేషుబాబు కుటుంబసభ్యులు తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా అమ్మాయి పెళ్లి ఆగిపోయిందని బాధితుడు వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సస్పెండ్ అయ్యి మళ్లీ ఇటీవల…

Read More

రైతన్నగా మంత్రి రామన్న

పాలకొల్లు: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) అందరికీ అన్నం పెట్టే అన్నదాతగా కీర్తించబడే రైతు గా వ్యవసాయ క్షేత్రంలో పనిచేయటం తనకు ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుందని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అధికారిక విధులకు ఆదివారం విరామం కావడంతో, ఉదయాన్నే సైకిల్ పై బయలుదేరి తన స్వగ్రామం లో ఉన్న వ్యవసాయ, ఆక్వాక్షేత్రాలను మంత్రి పరిశీలించారు. రొయ్యల చెరువు వద్ద వాటి ఆరోగ్య పరిస్థితిని, పెరుగుదలను పరిశీలించారు….

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో చండీ హోమం.

భీమవరం: మే,31(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు. ఈ హోమం లో 80 మంది పైగా పాల్గొన్నారు. పరోక్ష పధ్ధతిలో మరి కొంతమంది పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు….

Read More

నేటి నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం. విశాఖపట్నం కేంద్ర కార్య స్థానం.

జనరల్ డస్క్: మే, 31 (తెలుగు న్యూస్ పవర్ కాం). కేంద్ర ప్రభుత్వం దక్షిణ తీర రైల్వే జోన్ అధికారికంగా ప్రకటించింది. ఇది 2026 జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. విశాఖపట్నం ప్రధాన కార్యాలయంగా ఉంటుంది.“కొత్త రైల్వే జోన్” ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, జోన్ ఏర్పాటును ఖరారు చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కొత్త జోన్‌గా ప్రకటించారు. నేటి నుంచి అమలులోకి వచ్చింది. విశాఖపట్నం అధికారిక ప్రధాన కార్యాలయం గా ఉంటుంది.ఇది భారత…

Read More

నేడు నటులు కృష్ణ పుట్టినరోజు.

జనరల్ డెస్క్: (తెలుగు న్యూస్ పవర్. కామ్) బుర్రిపాలెం బుల్లోడు, ఘట్టమనేని శివరామకృష్ణ అనే కృష్ణ చలనచిత్ర రంగంలో చంచలనాలకు మారుపేరు. సాహసాలకు చిరునామా, మానవత్వానికి నిలువెత్తు రూపం, కొత్తదనాన్ని కోరే ధైర్యం అయన విశిష్టతలు. హాలీవుడ్ తలదన్నే కౌబాయ్ చిత్రాల ద్వారా తెలుగు సినీ రంగాన్ని కొత్త మలుపు తిప్పారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి నిర్మించారు. భారత పౌరాణిక సినీ వినీలాకాసంలో…

Read More

పాలకొల్లులో దర్శకరత్న దాసరి వర్ధంతి.

పాలకొల్లు: మే, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశ్వవిఖ్యాత దర్శకరత్న దాసరి నారాయణరావు 9వ వర్ధంతి సందర్భంగా ఆయన మాతృభూమి పాలకొల్లు లో పట్టణ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అత్యధిక చిత్రాలకు దర్శకత్వ వహించిన దాసరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు. పాలకొల్లు పట్టణాన్ని విశ్వ వినువీధులకు చేర్చారని వక్తలు ప్రశంసించారు. ఈ సందర్భంగా, కెనాల్ రోడ్డులో గల దాసరి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని కాపాడుకోవాలని తీర్మానించారు. ఫ్లెక్సీలతో…

Read More

రొయ్యలు, చేపలతో జూన్, 8న పేదలకు ఉచిత భోజనాలు. -పాలకొల్లు ఆక్వా రైతు సంఘం.

పాలకొల్లు: మే, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దోపిడీ కోరల్లో చిక్కుకున్న రొయ్యల రైతులకు విముక్తి కలిగించడానికి వినూత్న పద్ధతులు అన్వేషిస్తున్నట్టు జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. ఈ సందర్భంగా, శనివారం పత్రికా సమావేశంలో మాట్లాడారు. రొయ్యలకు స్థానిక మార్కెట్లో డిమాండ్ సృష్టించటానికి ప్రణాళిక అమలు చేయనున్నట్టు తెలిపారు. పట్టణ వార్డుల్లో, గ్రామాల్లో ఉన్న చిరు వ్యాపారులకు రొయ్యలు నిలవ చేసే ఫ్రిడ్జ్ లో…

Read More