Telugu News Power

తేజస్వికి మురళీమోహన్ పురస్కారం.

గుంటూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ, పద్మశ్రీ, మాగంటి మురళీమోహన్ తన పేరుపై ఏర్పాటు చేసిన అవార్డును, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వినికి శనివారం, స్థానిక బృందావన్ గార్డెన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తేజస్వి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు….

Read More

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావులమ్మకు రూ.1.80 లక్షల బంగారం కానుక.

భీమవరం: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్.కాం)పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు,ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ, అమ్మవారి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం, స్వర్ణ నిధికి అండలూరు చెందిన చిలుకూరు రాంబాబు, కుసుమరాణి పుణ్య దంపతులు లక్ష ఎనభై వేల రూపాయల విలువ చేసే 12 గ్రాములు బంగారం విరాళంగా సమర్పించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచన పూజలు నిర్వహించినారు.దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్,…

Read More

లడ్డు నాణ్యత పరీక్ష ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.

తిరుపతి: మార్చి, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తిరుమలలో లభించే మంచినీరు, ఆహార పదార్థాల పరీక్షల కోసం అత్యంత ఆధునికమైన ప్రయోగశాలను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తిరుమల పవిత్రతను కాపాడుతూ శ్రీవారి భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందిచేందుకు టీటీడీ చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా,టీటీడీ మరో చారిత్రాత్మక ముందడుగు అడుగు వేసిందన్నారు. స్టేట్…

Read More

ఛాంబర్స్ కళాశాలలో ఈనెల 26న మెగా జాబ్ మేళా. -గోడ పత్రిక ఆవిష్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఈ నెల 26న స్థానిక ఛాంబర్స్ కళాశాలలో జరగనున్న, మెగా ఉద్యోగమేళా గోడపత్రికను స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు శుక్రవారం ఆవిష్కరించారు. ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్న ఛాంబర్స్ కళాశాల యాజమాన్యాన్ని, ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు అభినందించారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించడంలో ఏ విధమైన సహాయం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్టు మంత్రి నిమ్మల ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య…

Read More

నాటి ప్రభుత్వం చేసిన అప్పులు, నేటి ప్రభుత్వానికి తిప్పలు. -మంత్రి నిమ్మల విమర్శ

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిర్మల యలమంచిలి, మార్చి, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ప్రభుత్వం చేసిన 14 లక్షల కోట్ల అప్పుల వల్ల, నేడు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నదని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు వెల్లడించారు. మంత్రి మండలంలో, రోడ్లు భవనాల శాఖ రూ.2.70 కోట్ల రూపాయల నిధులతో వేయనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా కాజ తూర్పులో జరిగిన సభలో మంత్రి…

Read More

ఓడ నిండా గ్యాస్ వస్తుంది, కొరత లేదు. -పౌరసరఫారాల మంత్రి మనోహర్

అమరావతి: మార్చి ,20 (తెలుగు న్యూస్ పవర్ కాం) గ్యాస్ సరఫరా పై వస్తున్న అపోహలు నమ్మవద్దని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. మంత్రి కీలక వివరాలు శుక్రవారం వెల్లడించారు. ఇప్పటివరకు 2.96 లక్షల బుకింగ్స్ గాను 2.78 లక్షల సిలిండర్లు అందజేసినట్టు తెలిపారు. సోషల్ మీడియా అపోహలు సృష్టించడం వల్ల వినియోగదారులు గ్యాస్ కోసం ఎగబడుతున్నారన్నారు. ఈనెల 26న విశాఖకు ఎల్పిజి గ్యాస్ నౌక చేరుకుంటుందని, ఇందువల్లసరఫరా మరింత…

Read More

దొడ్డిపట్లలో గ్రామ దేవత జాతర

యలమంచిలి: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక దొడ్డిపట్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ, గ్రామ దేవత మాణిక్యాలమ్మ, అమ్మవారి జాతర ఉత్సవాలు ఉగాది రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. పి ఆలయానికి సుమారు 700 ఏళ్ల ఘన చరిత్ర ఉందని భక్తులు భావిస్తారు. గ్రామ దేవతల పట్ల గ్రామస్తులు ఎంతో విశ్వాసం చూపుతారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ ప్రముఖులు, మహిళలు విశేషంగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల జాతర ఉత్సవం కనకదుర్గమ్మ మాణిక్యం దేవతా మూర్తులు…

Read More

క్షీరా రామంలో పంచాంగ శ్రవణం.

పాలకొల్లు: మార్చి, 19(తెలుగు న్యూస్ పవర్. కామ్) పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో వేద పండితులు మామిడిపాటి వెంకన్న పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది ప్రజలకు అంతా మంచే జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రాము ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు పి వాసు ధర్మకర్తలు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగాలు, తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు. పంచాంగ శ్రవణం…

Read More

క్షీరా రామం పాలకొల్లులో నిత్య అన్నదాన పథకం ప్రారంభించిన మంత్రి

పాలకొల్లు: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) శ్రీ క్షీరా రామలింగేశ్వర ఆలయంలో ఇక ప్రతినిత్యం దాదాపు 200 మందికి, పండుగ రోజుల్లో 400 మందికి, కార్తీకుమాసం,పుష్కరాలు వంటి తిరుణాళ్ళలో వేల మందికి మహా ప్రసాదం అందజేస్తారని మంత్రి వెల్లడించారు.ఉగాది పర్వదినం సందర్భంగా, గురువారం స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు చే…

Read More