Skip to main content

Telugu News Power

సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణ 26 రోజుల సాగిన నిరాహార దీక్ష

న్యూఢిల్లీ, జూలై 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ 26 రోజులుగా కొనసాగించిన నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డా. జితేంద్ర సింగ్ సమక్షంలో గురుగ్రామ్‌లోని మెడాంటా ఆసుపత్రిలో ఆయన దీక్ష విరమించారు. వాంగ్‌చుక్ తన ప్రకటనలో, దేశంలో హింస చెలరేగే అవకాశం ఉన్నందున, కేంద్ర ప్రభుత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కొన్ని హామీలు లభించడంతో దీక్షను విరమించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జంతర్ మంతర్…

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.

భోగాపురం: జూలై,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) దశాబ్దాలకు ఎదురుచూస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.4,592 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు 2,203 ఎకరాల సుశాల ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విమానాశ్రయం 3,800 మీటర్ల పొడవవైన రన్వే కలిగి ఉందన్నారు. ఇక్కడ కార్గో టెర్మినల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపిస్తామని…

Read More

దొడ్డిపట్లలో మెగా పేరెంట్స్ సభ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర వ్యాప్ ్యాప్తంగా శుక్రవారం జరిగిన మెగా పేరెంట్స్ డే ఉత్సవం, ఆత్మీయ కలయిక కార్యక్రమంలో, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జ ల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దొడ్డిపట్ల ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.సత్యనారాయణమూర్తి అధ్యక్షత వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సభ లో ముఖ్యఅతిథి, నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర విద్యా శాఖ…

Read More

నేటి నుంచి మంగళగిరి లో 2 రోజుల తెలుగు మహోత్సవం.

మంగళగిరి: జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)తెలుగు మాతృభాష వైభవాన్ని, సాహిత్య సంపదను, కళా సంప్రదాయాలను, జానపద వారసత్వాన్ని భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం “తెలుగు మహోత్సవం” కార్యక్రమాన్ని ఈ నెల 25, 26, రెండు రోజులు గుంటూరు జిల్లా, మంగళగిరి సమీపంలోని చారిత్రాత్మక ఉండవల్లి గుహల వేదికగా ఘనంగా నిర్వహిస్తోంది.ఈ మహోత్సవం అధికారిక గోడ పత్రికను రాష్ట్ర సాంస్కృతిక, సృజనాత్మక సమితి చైర్‌పర్సన్ పొడపాటి తేజస్వినితో కలిసి రాష్ట్ర సచివాలయంలో సంస్కృతిక శాఖామాత్యులు కందుల…

Read More

పెద గోపురంలో దేవేరులకు శాకంబరీ అలంకరణ.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారు, శ్రీలక్ష్మి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం సందర్భముగా శాఖంబరి అవతారంతో శుక్రవారం అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప), వివిధ రకములైన కూరగాయలతో పలు రకాల పండ్లతో అలంకరణ చేసారు. దేవేరుల శాకాంబరి అలంకరణ చూసి భక్తులు తన్మయులై, ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణకు పిలుపు.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేలుపు, ప్రముఖ ఆరాధ్యదైవమైన శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆషాఢ సారె సమర్పణ మహోత్సవం వచ్చేనెల1న ఉదయం 9 గంటలకు శ్రీ అమ్మవారి మహిళా సేవకులు ఘనంగా సమర్పించనున్నట్లు దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమం శ్రీ అమ్మవారి దేవస్థానం సమీపంలోని పూరి గుడి నుంచి శోభాయాత్ర ప్రారంభమై…

Read More

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారినిదర్శించుకున్న కలెక్టర్.

భీమవరం:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం సమర్పించగా, కలెక్టర్ తనయుడు భరత్‌, వారి కుటుంబ సభ్యులు అమ్మవారి అనుగ్రహ దర్శనం అందుకొన్నారు.

Read More

సమాజ రుగ్మతలపై అక్షరాయుధం సంధించిన -జాషువా.

పాలకొల్లు:జూలై, 24(తెలుగు న్యూస్ పవర్. కం) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) తెలుగు విభాగం ఆధ్వర్యంలో నవయుగ వైతాళికులు, కవి చక్రవర్తి, పద్మభూషణ్ గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ,…

Read More

దస్తావేజు లేఖర్ల పక్షాన విపక్షాల మద్దతు.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత ఐదు రోజులుగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం చేస్తున్న దస్తావేజులాఖరులకు విపక్షాల రంగప్రవేశంతో మద్దతు లభించింది. స్థానిక నిరసన శిబిరాన్ని వైసీపీ రాష్ట్ర నాయకులు చెల్లెమ్ ఆనంద ప్రకాష్, జడ్పిటిసి నడపను గోవిందరాజులు నాయుడు శుక్రవారం సందర్శించారు. దస్తగిరి లేఖలు జీవో నెంబర్ 396 ఉపసంహరణ, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారికి అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అవసరమైతే పార్టీ తరపున కార్యక్రమం చేపడతామని…

Read More

జలవనరుల శాఖ మాత్యుల నియోజకవర్గంలో నీటి కొరత. -వైసీపీ ఇన్చార్జ్ గోపి ఆరోపణ

యలమంచిలి: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) సాక్షాత్తు రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు గారి నియోజకవర్గంలోనే రైతులు సాగునీటి కొరత వల్ల అల్లాడుతున్నారని వైసీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆరోపించారు. ఈ సందర్భంగా మేడపాడుకు చెందిన రైతులు ఎండిన నారు ముళ్ళు గోపి కి చూపించారు. నెరవేసిన ఆకు ముందు నీరు లేక పాడైపోతున్నాయని రైతులు వాపోయారు. ఎండిన నారుమలలో వైసీపీ జెండాలు కట్టిన…

Read More