Skip to main content

Telugu News Power

రాష్ట్ర ఆక్వారైతు సదస్సుకు హాజరు కావాలి -రాష్ట్ర అధ్యక్షులు భగవాన్ రాజు పిలుపు. పాలకొల్లులో ఈనెల 30న రైతు సదస్సుకు భారీ ఏర్పాట్లు.

పాలకొల్లు: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా కుల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర స్థాయి సమావేశం ఈ నెల 30న పాలకొల్లులో ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఆక్వారైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పత్రికలకు శనివారం వెల్లడించారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రంగా ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఫీడు రేటు నిర్ధారణకు ముందుగా, ప్రాసెసింగ్ రేటు ఫార్ములా అనుసరించి రేటు నిర్ధారించాలని…

Read More

రూ. 1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం. ఎర్రచందనం అక్రమ రవాణా పై ఉక్కు పాదం. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

అంతరాష్ట్ర స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాత్రపై లోతుగా దర్యాప్తు ఎర్ర చందనం అక్రమ రవాణాని అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు ⁠’ఆపరేషన్ అరణ్య’పై ఎప్పటికప్పుడు సమీక్షిస్తా. అమరావతి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు మరింత కఠినమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆపరేషన్…

Read More

వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్

మనుషులు అడుగుపెట్టలేని ప్రాంతాల్లో క్షీణించిన అడవుల పునరుద్ధరణ దిశగా అడుగులు రాష్ట్రవ్యాప్తంగా 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో మానవ వనరుల సాయంతో లక్షల విత్తన బంతులు వెదజల్లే పక్రియ పూర్తి. 30 వేల హెక్టార్ల లక్ష్యాన్ని నిర్ణీత కాల వ్యవధితో పూర్తి చేయాలన్న పవన్ కళ్యాణ్ సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమంపై అటవీశాఖ అధికారులతో సమీక్షించిన ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్. అమరావతి: జూలై, 25(…

Read More

నేడు ఎమ్మెల్సీ గోపి మూర్తి పర్యటన.

భీమవరం: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, మరోసారి ఆ పదవికి పోటీ చేస్తున్న సందర్భంగా, ఉపాధ్యాయుల మద్దతు కోరుతూ జిల్లాలో పర్యటన కొనసాగిస్తున్నారు. వీరు ఆదివారం ఉదయం 10 గంటలకు తాడేపల్లిగూడెం జడ్పీ హైస్కూల్ వద్ద తణుకు తాడేపల్లిగూడెం క్లస్టర్లు వారిని కలుస్తారు. మధ్యాహ్నం 1 గం. కు భీమవరం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం భీమవరం, ఉండి క్లస్టర్ల వారిని కలుసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు…

Read More

రైతుల పక్షపాతి, రైతు బిడ్డ నిమ్మలపై వైసీపీ దుష్ప్రచారాన్ని రైతులు నమ్మరు.

యలమంచిలి: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సొంత నియోజకవర్గంలో రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వైసిపి పార్టీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు, గోపి ఆ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను స్థానిక తెలుగుదేశం నాయకులు, నీటి సంఘాల అధ్యక్షులు శనివారం తీవ్రంగా తిప్పికొట్టారు . రైతు బిడ్డ, రైతు పక్షపాతి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రైతులకు ఎక్కడ కష్టం వస్తే, అక్కడ వెంటనే…

Read More

శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి ఆషాడ మాస సారె సమర్పణ.

యలమంచిలి: జూలై,25( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాపులపాలెం వద్ద వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారికి శనివారం ఆషాడ మాస సారె సమర్పించారు. అమ్మవారి దేవస్థానం నుంచి మేళ తాళాలతో ప్రారంభమైన సరె ఊరేగింపులు మహిళలు విశేషంగా పాల్గొన్నారు. ఆషాడం సారె తో మూలస్థానేశ్వరి దేవస్థానం వరకు సాగిన ఊరేగింపు కనకదుర్గమ్మ,, దేవరమ్మ, మారెమ్మ ఆలయాల దర్శనం చేసుకుని, గుంతల ముసలమ్మ దేవస్థానానికి చేరుకున్నారు. వివిధ రకాల మిఠాయిలు పండ్లు, డ్రై ఫ్రూట్స్…

Read More

శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో ఘనంగా తొలి ఏకాదశి పర్వదినం. సహస్రనామ పారాయణంలో పాల్గొన్న 800 మంది భక్తులు.

భీమవరం: జూలై, 25( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ప్రాంగణం లో తొలిఏకాదశి సందర్భంగా లలిత, విష్ణు సహస్రనామ పారాయణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి, దేవస్థానం వారు 800 మంది మహిళా భక్తులను ఆహ్వానించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొండాడ నాగభూషణం,…

Read More

విద్యాదాత గాంధీ భగవాన్ రాజుకు సత్కారం.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పూలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి, గ్రామ ప్రముఖులు, గాంధీ మెగా ఫౌండేషన్ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు చేస్తున్న సేవలను పలువురు వ్యక్తులు కొనియాడారు. మేక పేరెంట్స్ డే ఉత్సవాల్లో భాగంగా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ప్రముఖులను సత్కరించే కార్యక్రమంలో భాగంగా గాంధీ భగవాన్ రోజును శుక్రవారం ఘనంగా పాఠశాల…

Read More

తల్లికి వందనం పధకం లో నియోజకవర్గాని కి రూ. 35 కోట్లు. -మంత్రి నిమ్మల వెల్లడి.

పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2 ఏడాది కూడా క్రమం తప్పకుండా తల్లికి వందనం నిధులు వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమం సందర్భంగా స్థానిక వీఆర్ఏ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్ డే లో ముఖ్యఅతిథిగా మంత్రి శుక్రవారం పాల్గొన్నారు. ఈ…

Read More

జల జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమగోదావరి జిల్లాలో అమలవుతున్న జల జీవన్ మిషన్ పనులను వేగవంతం చేసి,నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పైపులైన్ పనుల అనంతరం తవ్విన రహదారులను సమంగా చేసి రోలింగ్ చేయడం తప్పనిసరి అని సూచించారు. సుమారు రూ.1,400 కోట్ల వ్యయంతో 862 గ్రామాల్లో 13.25 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులను…

Read More