Telugu News Power

రాజకీయ ముసుగు వెయ్యొద్దు రొయ్యల రైతుల పైన. -జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం ఖండన.

పాలకొల్లు: జూలై, 15( తెలుగు న్యూస్ పవర్. కామ్) రైతు సంఘాల ముసుగులో రాజకీయ పార్టీలకు వంత పలుకుతున్నారన్న వైసీపీ నాయకుల విమర్శను జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం తీవ్రంగా ఖండించింది. వైసిపి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమవరం సభకు హాజరవుతున్న సందర్భంగా వైసీపీ నాయకులు అవాస్తవాలు మాట్లాడటం తగదు అన్నారు. విమర్శలు చేసిన నాయకులు అసలు ఆక్వా రైతుల కాదని వివరించారు. అందువల్ల ఆక్వా రైతులు కష్టసుఖాలు వారికి…

Read More

పార్టీ కోసం పాటుపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. -జనసేన ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల

కైకలూరు: జులై,15( తెలుగు న్యూస్ పవర్. కామ్) ‘జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న కార్యకర్తలకు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని జనసేన పార్టీ నాయకులు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. జనసేన చర్చా వేదిక కార్యక్రమం కైకలూరులో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పార్టీని నమ్మిన కార్యకర్తల క్షేమం,…

Read More

పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏఎమ్ ఓ, చంద్రశేఖర్ తనిఖీ.

యలమంచిలి: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రవ్యాప్తంగా పీఎం శ్రీ పాఠశాల లను పర్యవేక్షించుటలో భాగంగా మంగళవారం దొడ్డిపట్ల,, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల , జిల్లా ఏ ఎం ఓ సిహెచ్ చంద్రశేఖర్, యలమంచిలి మండలం ఎంఈఓ 1 జి వీరస్వామి సందర్శించారు.పాఠశాలలోని మౌలిక వసతులు లేబరేటరీ ,లైబ్రరీ ,స్కౌట్ అండ్ గైడ్స్, కిచెన్ గార్డెన్ ,కంపోస్ట్ ఫిట్ , రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ,రైన్ వాటర్ హార్వెస్టింగ్…

Read More

ముగిసిన ముద్రగడ శకం కాపు ఉద్యమ నేతగా కీర్తి శిఖరాలుకు.

కాకినాడ: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం (73) మంగళవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా హైదరాబాదులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి కి చెందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు శాసనసభ్యులుగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, విజయ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. కాపు ఉద్యమ నేతగా ఉభయ రాష్ట్రాల్లో కీర్తి గడించారు. కాపుల…

Read More

నేడు కైకలూరులో జనసేన ఆత్మీయ సమావేశం.

భీమవరం: జూలై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో, తొలి సమావేశాన్ని కైకలూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు గారు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఆత్మీయ సమావేశం బుధవారం ఉదయం 9:30 గంటలకు కైకలూరులోని సీఎన్ ఆర్ గార్డెన్స్…

Read More

దిగమర్రు లో రైతుబడి కార్యక్రమం.

పాలకొల్లు: జులై, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పొలం పిలుస్తుంది కార్యక్రమo దిగమర్రులో మంగళవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రెసిడెంట్, కౌరు సందీప్, తమ్మినీడి చంద్రశేఖరు, మాజీ సర్పంచ్ రాపాక నగేష్ కరుణాకరన్, రైతులు పాల్గొన్నారు సహాయ సంచాలకు పి మురళీకృష్ణ మాట్లాడుతూ, పంట పొలాలకు నీటి సరఫరా సవ్యంగా జరుగుతుందని రైతులు ఎటువంటి కంగారు పడవద్దని ధైర్యం చెప్పారు. యూరియా, డిఏపి కావాల్సినంత ఎరువు మన మండలంలో అందుబాటులో ఉన్నదని ఎవరో ఇబ్బంది పడవద్దని…

Read More

రైతు సేవ కేంద్రం ఇంచార్జ్ లకు శిక్షణ.

పాలకొల్లు: జూలై 14, (తెలుగు న్యూస్ పవర్. కామ్) సహాయ వ్యవసాయ సంచాలకులు పి. మురళీకృష్ణ, పాలకొల్లు వారి అధ్యక్షతన రైతు సేవ కేంద్రం ఇన్చార్జులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ సహదేవరెడ్డి ప్రధాన శాస్త్రవేత్త మార్టేరు వరి పరిశోధన స్థానం,డాక్టర్ మల్లికార్జున రావు కృషి విజ్ఞాన కేంద్రం, ఉండి అధిపతి హాజరయ్యారు. డాక్టర్ సహదేవరెడ్డి ఇన్చార్జి ఏడిఆర్ మార్టేరు వరి పరిశోధన స్థానం వారు…

Read More

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన మంత్రి కందుల, ఎమ్మెల్యే పంతం.

ముంబయి: జులై, 14( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే 19 నానాజీ విడివిడిగా మంగళవారం కోకిల బెన్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఇటీవల కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలను పాటిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల…

Read More

కలెక్టరేట్ ముట్టడి విజయవంతం -ఫ్యాప్టో

భీమవరం: జూలై, 14 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12 వ పిఆర్సీని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్ డిఏ లను, ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి భారీ సంఖ్యలో హాజరైన ఉపాధ్యాయులతో కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సహకారం తో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం పై ఉద్యోగులు…

Read More

శ్రీ మావుళ్ళమ్మలు దర్శించుకున్న సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ.

భీమవరం: జూలై 14, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ప్రఖ్యాత తెలుగు సినీ నటులు సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఘట్టమనేని జయ కృష్ణ మంగళవారం దర్శించుకున్నారు.ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్, చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు…

Read More