Skip to main content

Telugu News Power

మండల పరిషత్ సమావేశం.

యలమంచిలి:జూలై,24 ( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సమావేశం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి జెడివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరును ఎంపీపీ సమీక్షించారు. పనులు వేగవంతం చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశంలో, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, జిల్లెల్ల…

Read More

ఆక్వా రైతులకు త్వరలోనే విద్యుత్ సబ్సిడీ అమలు. -విద్యుత్ శాఖ మంత్రి హామీ.

అమరావతి: జూలై 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా సంఘ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు బృందం, గురువారం పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యుల ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మాత్యులు గొట్టిపాటి రవికుమార్ ను గురువారం కలిశారు. ఈ సందర్భంగా ఆక్వారైతులకు భే షరతుగా విద్యుత్ సబ్సిడీ అందరికీ అందేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యను రావుగాహన చేసుకున్న మంత్రి గొట్టిపాటి వారి రోజుల్లో ఆక్వా…

Read More

విశ్వమానవ వేదికకు సేవలకు జాతీయ పురస్కారం.

పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) విస్వమానవవేదిక వేదిక సమాజానికి అందిస్తున్న స్వచ్ఛంద సేవలకు జాతీయ పురస్కారం లభించిందని వ్యవస్థాపకులు మల్లుల సురేష్ గురువారం తెలిపారు. లతా రాజ ఫౌండేషన్ 22వ జాతీయ ధార్మిక పురస్కారం కోసం ఎంపిక చేసినట్లు ఫౌండేషన్ ట్రస్టీ రాజా, ట్రస్టి డాక్టర్ సిద్దోజి రావు విశ్వ మానవులకు సమాచారం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు విశ్వమానవేదిక సేవలను కొరియాడుతూ, అభినందించారు.

Read More

ప్రభుత్వం దిగివచ్చే వరకు పెన్ డౌన్ నిరసన ఆగదు. -ఉభయగోదావరి జిల్లాల లేఖర్ల అధ్యక్షుడు సముద్రాల స్పష్ఠీకరణ.

పాలకొల్లు: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత 4 రోజులుగా స్థానిక సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్ల పెన్ డౌన్ నిరసన శిబిరాన్ని గురువారం ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షులు సముద్రాల నాగరాజు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దస్తావేజు లేక న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు ప్రభుత్వం దిగివచ్చి నిజమైన దస్తావేజు లేఖల సంఘాలతో సంప్రదింపులు జరిపి వారి ఆమోదం తెలిపిన తర్వాతే నిరసన…

Read More

యలమంచిలి లో హస్తకళాకారుల వైద్య శిబిరం.

యలమంచిలి, జూలై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నదమ్ముల్లా ఐకమత్యంతో కలిసి పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ పాలకొల్లు నియోజకవర్గ నాయకులు బోనం వెంకట నరసయ్య ( చిన బాబు) పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో హస్తకళాకారులకు గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు హస్త…

Read More

దేశవ్యాప్తంగా ‎ 6 ఏళ్లుగా అమలుకాని వృద్ధ కళాకారుల పింఛను పధకం.

నిధుల విడుదల కోసం లోక్ సభ లో కేంద్రమంత్రి షెకావత్ కు ఏలూరు ఎంపీ పుట్టా వినతి. ‎ న్యూఢిల్లీ / అమరావతి:జూలై, 23 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ‎ భారతదేశ సాంస్కృతిక, కళా వారసత్వానికి గణనీయమైన కృషి చేసిన వృద్ధ కళాకారులకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా అందిస్తున్న పింఛను పధకం గత ఆరేళ్లుగా ఆగిపోయిందని, మానవతా దృక్పథంతో వెంటనే ఈ బకాయిలు విడుదల చేయాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ….

Read More

​పాఠశాల విద్యలో విప్లావాత్మక మార్పులకు శ్రీకారం: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

న్యూఢిల్లీ: జూలై,23( తెలుగు న్యూస్ పవర్. కామ్)రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులతో నిర్వహించిన రెండు రోజుల సమావేశంలో మొదటి రోజు సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత వహించారు. కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ పర్యవేక్షణలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల పురోగతిని ఈ సమావేశంలో గురువారం సమీక్షించారు. ​జాతీయ విద్యా విధానం (ఎన్ ఈ పి 2020) దిశగా బలమైన అడుగులు పడుతున్నాయన్నారు. ​సమావేశంలో మాట్లాడిన కేంద్ర…

Read More

విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ కల్పనే లక్ష్యం: జిల్లా కలెక్టర్ నాగరాణి.

పాలకొల్లు: జూలై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు, దాసరి నారాయణరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా గురువారం జరిగింది. ఈ ప్రత్యేక జాబ్ మేళాలో కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా, ప్రైవేట్ రంగంలోని అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలని ఇతవు పలికారు . జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల…

Read More

దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ జయంతి వేడుక- పట్టణ ప్రముఖుల నివాళి

పాలకొల్లు: జులై, 23( తెలుగు న్యూస్ పవర్. కామ్) శతాధిక చిత్రాల దర్శకుడు, తెలుగు చలనచిత్ర గతిని మార్చిన దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ 77వ జయంతి వేడుకలు గురువారం ఆయన మాతృభూమి, స్థానిక సొంత థియేటర్ మారుతిలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వంగా నరసింహారావు మాట్లాడుతూ, పాలకొల్లు కీర్తిని పెంచిన గొప్ప వ్యక్తులు దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణలు అని కొనియాడారు….

Read More

అజరామరశక్తి ముద్రగడ -ప్రముఖుల ఘననివాళి

పాలకొల్లు: జూలై,22( తెలుగు న్యూస్ పవర్. కామ్) మాజీ మంత్రి,, ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కు స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో బుధవారం పలువురు ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. కాపు జాతి అభ్యున్నతి కోసం ముద్రగడ చేసిన సేవలను తలు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముద్రగడ స్ఫూర్తి కాపులకు అజరామర శక్తి గా అభివర్ణించారు. కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు, కాపు కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు అమలులోకి రావటానికి…

Read More