Telugu News Power

ప్రపంచ జనాభా దినోత్సవం – అవగాహన కార్యక్రమం.

భీమవరం: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈనెల 11 నుంచి 18 వరకు జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని వశిష్ట కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. కుటుంబాలు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతో సంతోషకరమైన జీవనం…

Read More

జై భారత్ క్షీరా రామ ఆక్వారైతు సంఘం. కొలువుదీరిన కొత్త కమిటీ.

పాలకొల్లు: జూలై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతు సంఘం పూర్వ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా కొత్తవారితో కమిటీ గురువారం ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, అధ్యక్షులుగా బోనం వెంకట నరసయ్య, చినబాబు, కార్యదర్శిగా పెనుమత్స సత్యనారాయణ రాజు, కోశాధికారిగా సోంబాబు, ఉపాధ్యక్షులుగా గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, సంయుక్త కార్యదర్శిగా ఎం…

Read More

రామాలయ పునర్నిర్మాణానికి మంత్రి నిమ్మల దంపతుల శంకుస్థాపన.

పాలకొల్లు: జులై, 9 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు దంపతులు స్వగ్రామం ఆగర్తిపాలెంలో స్వయంభు శ్రీ కోదండ రామాలయం పునర్నిర్మాణానికి గురువారం ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమానికి మేళ తాళాలు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. నిమ్మల దంపతులు పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు, పలువురు కూటమి నాయకులు తరలి వచ్చారు.

Read More

నర్సాపురం-బెంగళూరు వారపు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ సర్వీస్ ప్రారంభం.

పాలకొల్లు: జులై,9( తెలుగు న్యూస్ పవర్. కామ్) నర్సాపురం – బెంగుళూరు వారపు ప్రత్యేక రైలు నేటి నుంచి రెగ్యులర్ వారపు రైలుగా నడుపుతున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఇంతవరకు హీరోయిన్ ప్రత్యేక వారపురలుగా నడిపారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఈ రైలు ప్రయాణం అందుబాటులోకి రావటానికి తీవ్రంగా కృషి చేశారు. పాలకొల్లు రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం గం. 3.30…

Read More

సి ఆర్ డి ఏ అదనపు కమిషనర్ గా రాహుల్ కుమార్ రెడ్డి నియామకం.

భీమవరం: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రతిష్టాత్మక సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా రాహు కుమార్ రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటివరకు వీరు పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ రాహుల్ రెడ్డిని బుధవారం అభినందించారు.

Read More

నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

విజయవాడ: జూలై,8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన అభిమాని మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి,నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు, ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయని పవన్ కళ్యాణ్…

Read More

పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకం- నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల.

తాళ్లపూడి : జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కామ్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపుతో చేపట్టిన పట్టిసీమ తాళ్లపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు మన రామానాయుడు పూజలు చేసి, జల హారతి ఇచ్చి నీటిని బుధవారం విడుదల చేశారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు చుక్క నీరు లేని పరిస్థితుల్లో కూడా ఈ పథకం ద్వారా కృష్ణాజిల్లాకు 450 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు….

Read More

హస్త కళాకారుల కోసం ఆరోగ్య శిబిరాలు.

ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న పవన్ కళ్యాణ్. విజయవాడ: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. పవన్ కళ్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా…

Read More

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు.

పాలకొల్లు: జూలై, 8( తెలుగు న్యూస్ పవర్. కం) మాజీ ముఖ్యమంత్రి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల సృష్టికర్త, మహా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి ఉత్సవాలు వాడవాడల బుధవారం ఘనంగా జరిగాయి. స్థానిక యల్లవాని గురువు వై- జంక్షన్ వద్ద గల వైఎస్ఆర్ నిలువెత్తు విగ్రహానికి ఈ సందర్భంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్సిపి పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు గోపి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా, పూలమాలలు…

Read More

వాకర్స్ క్లబ్ నోటు పుస్తకాలు పంపిణీ.

యలమంచిలి:జూలై, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించడంలో భాగంగా యలమంచిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆర్యపేట విద్యార్థులకు పాలకొల్లు వాకర్స్ క్లబ్ వారు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తటపర్తి సుధాకర్, కార్యదర్శి షేక్ పీర్ సాహెబ్, ఉపాధ్యక్షులు మానెం బసవ రాజు, కోశాధికారి పోతుల ఉమా శంకర్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండపాక రాంబాబు, విద్యా వాలంటీర్ బి.సునంద పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు…

Read More