కేంద్ర మంత్రులను కలిసిన రాష్ట్ర ఆక్వా రైతు సంఘ ప్రతినిధులు.
న్యూఢిల్లీ : జూలై 20, ( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ప్రతినిధుల బృందం, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లను ఢిల్లీలో సోమవారం కలిసింది. రొయ్యల మేత ధరల నియంత్రణకు జన్యు మార్పు చేసిన సోయాబీన్ మీల్ దిగుమతికి అనుమతివ్వాలని కోరింది. అమెరికా, చైనా, ఐరోపా, తదితర ప్రధాన మార్కెట్లలో భారతీయ రొయ్యల ఎగుమతులు తీవ్ర పోటీని ఎదుర్కొంటున్నాయి. భారత-అమెరికా…