ఉద్యమాల జెండా రెపరెపలాడాలి-ఎమ్మెల్సీ గోపి మూర్తి
భీమవరం: జనవరి,7(తెలుగు న్యూస్ పవర్) ఉద్యమాల జెండా ఎప్పుడూ, రెపరెపలాడుతూనే ఉండాలని, ఎమ్మెల్సీ బొర్ర గోపి మూర్తి పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా శాఖ ఎన్నికల సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరై గోపి మూర్తి ప్రసంగించారు. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్జీవో కార్యవర్గాల నిర్మాణం పూర్తయిన తర్వాత, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యమించడానికి సిద్ధం కావాలని మేల్కొల్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకం తగ్గిందన్నారు….