Skip to main content

Telugu News Power

కేరళలో బిజెపి గెలుపు తథ్యం. -కేంద్రమంత్రి వర్మ ఆశాభావం

కేరళ రాష్ట్ర బిజెపి నాయకులతో కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ

కోచి: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కామ్)
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నర్సాపురం పార్లమెంటు సభ్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ మంగళవారం కేరళలోని కొచ్చి విమానాశ్రయం చేరుకున్నారు. వీరికి కేరళ
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, జి జి జోసెఫ్, కార్యదర్శి రేణు సురేష్, జోనల్ ఉపాధ్యక్షులు ఎం ఎన్ గోపి, ఎర్నాకులం అధ్యక్షులు, ఎం ఏ బ్రహ్మ రాజ్, తదితర బిజెపి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో కార్యకర్తలను కలుసుకొని చైతన్యవంతం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేరళ బిజెపి క్యాడర్ వికసిత కేరళ లక్ష్యంగా క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఈసారి మార్పు తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు.