అఖండ జ్ఞానజ్యోతి అస్తమయం, మాడభూషి మరణం పట్ల పలువురి దిగ్భ్రాంతి.
పాలకొల్లు: ఏప్రిల్, 8(తెలుగు న్యూస్ పవర్. కామ్) అఖండ జ్ఞాన నిధి, సాహితీ స్రష్ట మాడభూషి కృష్ణ ప్రసాద్ (72) బుధవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా వారు ఊపిరితిత్తుల సమస్యకు చికిత్స పొందుతున్నారు. వీరి భార్య జయంతి, యలమంచిలి మండలం, అడవిపాలెం లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. వీరి మరణ వార్త పాలకొల్లులో విషాదం నింపింది. కృష్ణ ప్రసాద్ సుదీర్ఘకాలం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేశారు. పోడూరు మండలం, గుమ్ములూరులో, పాఠశాల సహాయకులు,…