Telugu News Power

Blog

పశ్చిమ బెంగాల్‌లో 91 లక్షల ఓట్ల తొలగింపు.

కొల్ కతా: ఏప్రిల్, 7(తెలుగు న్యూస్ పవర్.కాం) ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఒకటైన పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) చేపట్టింది. ఈ సందర్భంగా, ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల సంఘం ఇప్పటికీ తుది జాబితా ప్రకటించలేదు. గత ఫిబ్రవరి 28న విడుదలైన అధికారిక లెక్కల ప్రకారం, గత నవంబర్‌లో ప్రత్యేక…

Read More

విధి నిర్వహణకు వెళుతూ, తిరిగిరాని లోకాలకు హోం గార్డ్

పాలకొల్లు: ఏప్రిల్, 6 (తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక వెలమ గూడెం కు చెందిన రఘుమండ వెంకటరమణ(56) సోమవారం మరణించారు. పోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వీరు హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా రాఘవ రాత్రి పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉల్లంపూర్ వద్ద వేగంగా వస్తున్న కారు వెనకనుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. గాయపడిన వెంకటరమణ ప్రధమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ఆస్పత్రికి అక్కడ…

Read More

కవచ్ అమలు లో లక్ష్యాలను అధిగమించిన దక్షిణ మధ్య రైల్వే – రైల్వే భద్రతలో కీలక ముందడుగు

హైదరాబాద్: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం) దక్షిణ మధ్య రైల్వే భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కీలక విజయాన్ని సాధించింది. స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ అయిన కవచ్ అమలులో లక్ష్యాలను మించి ప్రగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 487 రూట్ కిలోమీటర్లపై కవచ్ ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది రైల్వే బోర్డు నిర్దేశించిన 402 కి.మీ లక్ష్యాన్ని మించిపోయింది….

Read More

ట్రంప్‌కు నెతన్యాహు అభినందనలు

టెల్ అవీవ్: ఏప్రిల్,6(తెలుగు న్యూస్ పవర్.కామ్), అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం అభినందాలు తెలిపారు. ధైర్యవంతమైన అమెరికన్ పైలట్‌ను అమెరికా వీరులు రక్షించిన చారిత్రక ఆపరేషన్‌పై ఆయన ప్రశంసించారు. “అమెరికా ధైర్యవంతులైన యోధుల చేతిలో ధైర్యవంతమైన అమెరికన్ పైలట్ రక్షించబడినందుకు అధ్యక్షుడు ట్రంప్‌ను అభినందిస్తున్నాను” అని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ అద్భుత ఆపరేషన్‌పై అందరూ సంతోషిస్తున్నారని, ఇది స్వేచ్ఛా సమాజాలు ధైర్యం, నిశ్చయదారితో భయోత్పాదకత, దుర్బల శక్తులను జయించగలవని నిరూపిస్తుందని…

Read More

ఆంధ్ర విశ్వ విద్యాలయం ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం.

మంగళగిరి: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కాం) ఆంధ్ర విశ్వ విద్యాలయం మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కు క్యాంపు కార్యాలయంలో సోమవారం విశ్వవిద్యాయ అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాల గోడ పత్రికను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 8న నిర్వహిస్తున్న వేడుకలకు ముఖ్య అతిథిగా…

Read More

నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ.

పాలకొల్లు: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్) నీటి భద్రత పై వందరోజుల కార్యాచరణకు సంబంధించి సోమవారం స్థానిక లాకుల వద్ద ఉన్న నీటి పారుదల శాఖ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీచైర్మన్ పెనుమత్స రామభద్ర రాజు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర జల వనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు నీటి భద్రతపై వందరోజుల కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది….

Read More

బిజెపి పథకాన్ని ఆవిష్కరిస్తున్న రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి ఉన్నమట్ల కపర్తి

పాలకొల్లు/ ఉండి: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) పాలకొల్లు పట్టణంలో బిజెపి జర్నలిస్ట్ కాలనీ, శక్తి కేంద్రం బూత్ ల వద్ద బూత్ అధ్యక్షులు అప్పలస్వామి, లక్ష్మీనారాయణ ల ఆధ్వర్యంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన కూటమి నేతలతో ,పట్టణ అధ్యక్షుడు కొల్లికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో, శక్తి కేంద్రం కెనాల్ రోడ్ లో మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా జెండా స్థూపం ఆవిష్కరణ, ఎల్ అండ్ టి కాలనీలో పసుపులేటి నంద, రావూరి సుధా,…

Read More

బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.

హైదరాబాద్: , ( ) రాజ‌గోపురానికి 9అంత‌స్తులు, ఈశాన్య‌న కోనేరు. * మూడు రెట్లు పెర‌గ‌నున్న దేవాల‌య విస్తీర్ణం. * రూ.225 కోట్ల‌తోబాస‌ర జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌య పునఃనిర్మాణం. * శృంగేరి పీఠాధిపతుల అనుమ‌తితో పనులు. హైద‌రాబాద్‌: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్.కామ్) ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం, పునఃనిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించుకోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం,…

Read More

నిత్య అన్నదాన పథకానికి రామడుగుల లక్ష విరాళం.

భీమవరం: ఏప్రిల్, 6(తెలుగు న్యూస్ పవర్. కామ్)పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న, ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్య దైవం, శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి నిత్య అన్నదాన ప్రసాద వితరణకి భీమవరం కి చెందిన రాచమడుగుల వెంకటేశ్వరరావు శ్యామల దంపతులు లక్ష నూటపదహారు రూపాయలు విరాళం సమర్పించారు. ఆలయ అర్చకులు వీరికి ఆశీర్వచన పూజలు చేశారు.ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందజేసారు. ధర్మకర్తల మండలి సభ్యులు…

Read More

పంచారామ క్షేత్ర మాడవీధుల్లో భక్తుల ప్రదక్షిణలు.

పాలకొల్లు: ఏప్రిల్,6 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం, సాయంత్రం, సప్త ప్రదక్షిణాల్లోభాగంగా మాడవీధులలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. సుమారు 300 మంది భక్తులు పాల్గొన్నారు. రాత్రి ఏడు గంటలకు శ్రీ స్వామివారి ధూప సేవ,శ్రీ స్వామివారి పంచహారతుల సేవ నిర్వహించి నట్లు కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు.

Read More