Telugu News Power

Blog

దాతృత్వానికి మంచి మనసు ఉండాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు.

పోడూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బు చాలామంది వద్ద ఉంటుందని, అయితే దాతృత్వానికి మంచి మనసు ఉండాలని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవణుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల 142 మంది 9వ తరగతి విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జిన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, నూజివీడు సీడ్స్, కాంటినెంటల్ కాఫీ, చెట్టినాడ్ సిమెంట్…

Read More

బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తా -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: ఏప్రిల్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధి కోసం కృషి చేస్తానని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా శనివారం అడబాల థియేటర్ సెంటర్లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, మహిళాభ్యున్నతి కోసం, ఆనాడే బాలికల విద్యకు పాఠశాల ఏర్పాటు చేసిన తొలి గురువు మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప దార్శనికుడిని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం…

Read More

చిత్ర పరిశ్రమ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధం. -సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి.

పాలకొల్లు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ లో ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తరగతులను, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సినీ పరిశ్రమ స్థాపించాలనుకున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా…

Read More

తేజస్వికి మురళీమోహన్ పురస్కారం.

గుంటూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ, పద్మశ్రీ, మాగంటి మురళీమోహన్ తన పేరుపై ఏర్పాటు చేసిన అవార్డును, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వినికి శనివారం, స్థానిక బృందావన్ గార్డెన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తేజస్వి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు….

Read More

ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఫిలిం ఇన్స్టిట్యూట్

కాలిఫోర్నియా: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) అంతరిక్ష ప్రయాణంలో చారిత్రక విజయాన్ని నమోదు చేసుకున్న ఆర్ట్ మిస్ 11 విజయవంతంగా భూమికి చేరుకోవడాన్ని, శుక్రవారం రాత్రి నాసా ఆమెస్ విజిటర్ సెంటర్‌లో చాబోట్ స్పేస్ అండ్ సైన్స్ సెంటర్‌లో భారీగా తరలివచ్చిన వీక్షకులు ఆర్టెమిస్ II చారిత్రక స్ప్లాష్‌డౌన్‌ను చూసి సంతోషం వ్యక్తం చేశారు. , చంద్రుడి చుట్టూ విజయవంతమైన పరీక్షా ప్రయాణం తర్వాత ఏప్రిల్ 10న. ఈ ప్రత్యేక కార్యక్రమం మిషన్ వెనుక…

Read More

నేడు పాలకొల్లుకు సినీ ప్రముఖుల రాక.

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్ .కాం) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో స్థాపించిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, సినిమాటోగ్రఫీ మంత్రి శనివారం ప్రారంభిస్తారని అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, దర్శకులు, వివి వినాయక్, వి ఎన్ ఆదిత్య, రేలంగి నరసింహారావు, తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నటులు శ్రీకాంత్, రచయిత పైడిపాటి రాజేంద్రకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ ఈ…

Read More

శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన.

పాలకొల్లు: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎడ్ల బజార్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వాళ్ళ కల్యాణోత్సవాలు గత నెలలో ముగిసాయి. ఈ సందర్భంగా భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం జరిగింది. భక్తులు సు మారు 15 వేల వరకు ఈ మహా ప్రసాదాన్ని స్వీకరించారని, ఆలయ వర్గాలు అంచనా వేశాయి. ఈవో సతీష్ కుమార్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు తులా రామలింగేశ్వర రావు, ధర్మకర్తలు, కొండేటి…

Read More

ముంబై టూర్ సక్సెస్: టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి.

ముంబై: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, రెండు రోజులపాటు జరిగిన హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. గ్రాండ్ హైట్ హోటల్‌లో జరిగిన 21వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా ఈ కార్యక్రమం మించింది. దేశీయ, విదేశీ ప్రముఖ ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు.ఎరోస్ ఇన్నోవేషన్, రెడ్ బుల్, అమర్ చిత్ర కథ, శ్రేమ్ గ్రూప్, అక్కోర్, హైట్ హోటల్స్, బ్రిగేడ్ గ్రూప్, లెమన్…

Read More

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ కిషోర్.

సింహాచలం: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రసిద్ధ సింహాచల, వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవ(నిజరూప దర్శనం) ఉత్సవాల ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జరిగిన దురదృష్టకర సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో మాదిరి తాత్కాలిక ఏర్పాట్లు కాకుండా, భక్తుల భద్రత కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్టు వెల్లడించారు. ,…

Read More

ఈవీఎం గోడౌన్‌ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.

భీమవరం: ఏప్రిల్, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రపరచు గొడౌన్ శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రత అత్యంత కీలకమని కలెక్టర్ స్పష్టం చేసారు. గోదాములో భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, అలారం వ్యవస్థలు అన్ని సక్రమంగా పనిచేస్తున్నాయో లేదోని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని…

Read More