Skip to main content

Telugu News Power

పి-4 ఉన్నత పాఠశాల ప్రారంభించిన మంత్రి లోకేష్.

మోపిదేవి: జూన్, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్) అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4కోట్లతో నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూలు నూతన భవనాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ కొక్కిలిగడ్డ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. రెండేళ్లలో విద్యావ్యవస్థలో సంస్కరణలన్నీ పూర్తి చేశామన్నారు. ఉపాధ్యాయులంతా పూర్తిగా ఫలితాలపైనే శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థలో ఉన్న వారంతా ఏకత్రాటి…

Read More

ఛాంబర్స్ కళాశాల ప్రాంగణ ఎంపికల్లో 40 మంది ఎంపిక.

పాలకొల్లు: జూన్, 22( తెలుగు న్యూస్ పవర్. కామ) స్థానిక బి ఆర్ ఆర్, జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో సోమవారం దివిస్ లాబొరేటరీస్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో 40మంది అభ్యర్థులు ఎంపికైయ్యారు. వారిలో 12 మంది ఛాంబర్స్ విద్యార్థులని, కళాశాల చైర్మన్ కారుమూరి నరసింహ రావు తెలిపారు.ఈ ప్రాంగణం ఎంపికులకు వివిధ ప్రాంతాల నుండి 60 మంది అభ్యర్థుల హాజరైయ్యారు. ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వరరావు. సెక్రటరీ కె.వి సీతారామరాజు, ట్రెజరర్…

Read More

దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలం ఏర్పాటు.

పోడూరు: జూన్,16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాల ఆట స్థలం నిరాదరణకు గురై, నిరుపయోగంగా మారింది. దాతల సహకారంతో మళ్లీ పూర్వ వైభవం వచ్చి విద్యార్థులకు ఆటస్థలం ఏర్పాటైన సంఘటన స్థానిక వేడంగి గ్రామంలో జరిగింది. మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల (మెయిన్) పాఠశాల ఆటస్థలం మొక్కలు పెరుగుట వలన ఆటస్థలం నిరుపయోగంగా మూలన పడింది. గ్రామ పెద్దలు బొలిశెట్టి మంగయ్య నాయుడు, బొలిశెట్టి నాగ రమేష్ ఈ సమస్య పరిష్కారం కోసం పూనుకున్నారు….

Read More

పెళ్లినాటి ప్రమాణాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ దంపతులు.

అచ్చంపేట: జూన్, 14 (తెలుగు న్యూస్ పవర్. కామ్) డబ్బుకు దాసోహం అయిన ఈ లోకంలో, తమ కష్టార్జితాన్ని ఇతరులకు ఇచ్చుటలో ఉన్న హాయిని అనుభవిస్తున్నారు పెళ్లయిన ఓ ప్రేమ జంట. తెలుగు సినీ ప్రపంచంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న విజయ దేవరకొండ, రష్మిక మదన్న నటీనటుల జంట. వివాహం శాశ్వత బంధం కావాలని జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, ఏడు అడుగులు వంటివి ఎన్నో పెళ్ళినాటి ప్రమాణాలు చేయిస్తారు. తమ వివాహం సందర్భంగా, తెలంగాణ…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో పర్యావరణ దినోత్సవం.

పాలకొల్లు: జూన్, 5 (తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల, వద్ద శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ యూనిట్–I, యూనిట్–II , ఈకో క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కడలి రత్న మాణిక్యం ప్రారంభించారు. కళాశాల ఆవరణలో వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ…

Read More

ఛాంబర్స్ కళాశాల విద్యార్థులకు అవగాహనా తరగతులు.

పాలకొల్లు: జూన్, 4 (తెలుగు న్యూస్ పవర్. కామ్). స్థానిక కెవిఎమ్ ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులలోని బెరుకును పోగొట్టేందుకు, వ్యక్తిత్వ వికాసం, అభ్యసనా నైపుణ్యాలను పెంపొందింపజేసేందుకు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, నర్సాపురం వై ఎన్ కళాశాల కామర్స్ ,మేనేజ్మెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాసరావు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుకొనే క్రమంలో ఏకాగ్రత అవసరమని, కష్టంతో కాకుండా, ఇష్టంగా చదువుకోవాలని తెలియజేశారు. తల్లిదండ్రుల పట్ల, అధ్యాపకుల పట్ల ఎటువంటి భావాలను కలిగి…

Read More

పాఠశాలలో విద్యార్థులను చేర్పించిన ఎంపీడీవో.

పాలకొల్లు: జూన్, 3 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక లంకలకోడేరు, పెదపేట పాఠశాల పరిధిలోగల ఇంటింటికి వెళ్లి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంపీడీవో ఎస్. ఎన్. ఉమామహేశ్వరరావు, ఎంఈఓ గంగాధర శర్మ, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ బృందం తల్లిదండ్రులను కలసి విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ప్రతి విద్యార్థికి…

Read More

ఛాంబర్స్ కళాశాలలో అధ్యాపకులకు శిక్షణా శిబిరం ప్రారంభం.

పాలకొల్లు: జూన్, 2 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్., జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల వృత్తి నైపుణ్య శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ విశ్రాంత ప్రొఫెసర్ ఎన్ సాంబశివరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు, సెక్రటరీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను,…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో స్వచ్ఛంద కార్యక్రమం.

పాలకొల్లు: మే 16 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాలలో మూడవ శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా “ప్లాస్టిక్ రహిత ఆంధ్రా” సాధనే ముఖ్య అజెండాగా ఎన్.ఎస్.ఎస్ I, II యూనిట్లు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. రత్న మాణిక్యం మాట్లాడుతూ, ప్లాస్టిక్ మహమ్మారి వల్ల భూగర్భ జలాలు, పర్యావరణం, మూగజీవాల ప్రాణాలు…

Read More

గ్రంధాలయాలకు దేవినేని పుస్తకాల వితరణ.

భీమవరం:మే,14 (తెలుగు న్యూస్ పవర్.కామ్) కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదన రావు బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సి.నాగరాణి చేతులు మీదుగా జిల్లాలోని 31 గ్రంథాలయాలకు 6 విభాగాలకు సంబంధించిన మొత్తం 228 పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, గ్రంధాలయాలకు అందించిన పుస్తకాలలో బాలల గేయాలు, బతుకు పాటలు, ఎదిగే ఆడపిల్ల ఏమీ తెలుసుకోవాలి, పద్య పారిజాతాలు, మహాత్ముని అడుగు…

Read More