Telugu News Power

పదో తరగతి ఫలితాల్లో ఎలమంచిలి మండల ప్రగతి.

యలమంచిలి: ఏప్రిల్, 30 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మండల ఉన్నత పాఠశాలల పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మండలంలోని పాఠశాలల వారీగా అత్యధిక మార్కులు,10వ తరగతి ఉత్తీర్ణత శాతం వివరాలు ఇలా ఉన్నాయి: వైవి లంక పాఠశాల 96% పాసు శాతంతో మొదటి స్థానంలో నిలిచింది, కొంతేరు 67%తో చివరి స్థానాని చేరింది. మండలంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఈ ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More

పదో తరగతి ఫలితాల్లో జేయశ్రీ జయకేతనం.

యలమంచిలి: ఏప్రిల్, 30(తెలుగు న్యూస్ పవర్. కామ్) మట్లపాలెం హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న అంబటి జయశ్రీ యుటిఎఫ్ నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించింది. ఆనాడే ఆమె ప్రతిభ కనబరిచింది. ఈరోజు విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు గాను592 మార్కులు సాధించింది. గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులలో నూటికి నూరు మార్కులు సొంతం చేసుకుంది. తెలుగులో 99, ఆంగ్లంలో 98, హిందీలో 95 మార్కులు వచ్చాయి….

Read More

మీసాల పిల్ల, నీ సంకల్పాన్ని సడలించేది ఎవరమ్మా?!

జనరల్ డెస్క్, ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్ కామ్) అందమైన లోకమని, రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి, ఆశలు ఈ లోకానికి మూలమమ్మ, ఆకలికి అందం ఉందా? ఆశలకు అంతం ఉందా? అంటూ తత్వాన్ని బోధించారు మనసు కవి ఆత్రేయ. అందమైన గులాబీకి కూడా ముళ్ళు ఉంటాయి, కానీ తన సహజ సమ్మోహన వాసనకు అవి అడ్డు కాదన్నారు కూడా. ఇంతకీ ఈ ఉపమానం…

Read More

నేటి నుంచి ఉచిత వేసవి సైన్స్ తరగతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల యాక్ట్ (ఏ.సి.టి) సైన్స్ సెంటర్ లో వేసవి శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ తరగతులు ఉదయం గం. 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఈ తరగతుల్లో, శాస్త్రీయ భావనలు, శాస్త్ర ప్రయోగాలు, సైన్స్ మ్యాజిక్, వేద గణితం, చిత్రలేఖనం, హస్త కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఈ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు….

Read More

శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.

పాలకొల్లు: ఏప్రిల్, 21 (తెలుగు మూవీస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, మార్చి 26 నుండి ఏప్రిల్ 8 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 4 వ సెమిస్టర్‌లో మొత్తం 197 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 192 మంది…

Read More

నందమూరి హర్షకు మెయిన్స్ 229 ర్యాంక్.

యలమంచిలి: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) నందమూరి హర్ష జేఈఈ మెయిన్స్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 229 సాధించారు. ఈ పరీక్షకు 11.23 లక్షల మంది హాజరయ్యారు. ఈనెల 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరిగాయి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 సంబంధించి ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి. హర్ష కృషికి 99.989 పర్సంటైల్ లభించింది. తండ్రి తండ్రి నందమూరి శ్రీను వ్యాపారం నిర్వహిస్తారు. హర్ష విజయం పట్ల పలువురు వర్షం వ్యక్తం…

Read More

చాంబర్స్ కళాశాలలో “మనవృక్షం – మన భవిష్యత్తు”

పాలకొల్లు: ఏప్రిల్, 18(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ , పీజీ కళాశాలలో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 20వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా, ఉపకులపతి ప్రొఫెసర్ ప్రసన్న ఆదేశాల మేరకు, ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ లు, ఉన్నత భారత అభియాన్ వారి సహకారంతో 20 మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ కెవిఆర్ నరసింహారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీఆర్ నరసింహారావు మాట్లాడుతూ, మొక్కలు నాటడం ప్రతి…

Read More

ఇంటర్మీడియట్ విద్యార్థుల అభినందన సభ.

పాలకొల్లు: ఏప్రిల్, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాల్లో పాలకొల్లు ఛాంబర్స్ జూనియర్ కాలేజి విద్యార్థులు విశేష ఫలితాలను సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ కారుమూరి బాబ్జీ గురువారంతెలిపారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం లో ఎంపిసి విభాగంలో అడబాల భవ్య తేజశ్రీ 1000 మార్కులకు గాను 987 మార్కులను, బైపిసి విభాగంలో బాలం తేజస్విని 987 మార్కులు సాధించి పాలకొల్లు టౌన్ లో రెండవ స్థానంలో నిలిచింది. ఎంఇసి విభాగంలో రెడ్డి యర్రంనాయుడు 964…

Read More

ఉద్యోగాలకు 52 మంది ఎంపిక.

పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు. మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి…

Read More

సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ విద్యార్థుల ప్రతిభ.

పాలకొల్లు: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)@ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల తమ ప్రతిభ కనబరిచారు. విద్యార్థులు 83శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు సోమవారం తెలియజేశారు. విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల వరుసలో ఉందన్నారు.ఈ విధంగా 9.2 నుండి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులు 35మంది ఉన్నారు. . కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ…

Read More