Telugu News Power

ఛాంబర్స్ జాబ్ మేళాలో 138 మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి,26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ వారి సౌజన్యంతో జాబ్ మేళా గురువారం నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో ఆశావహులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు ఈకార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థి దశలోనే క్రమశిక్షణతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ప్రతి…

Read More

జల వనరులను కాపాడుకోవాలి.

పాలకొల్లు: మార్చి, 22(తెలుగు న్యూస్ పపర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల లో ఆదివారం ప్రపంచ నీటి దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులలో నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు వ్యాసరచన మరియు పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, నీటి ప్రాముఖ్యత, సంరక్షణ,అవసరం, భవిష్యత్తు తరాలకు నీటి వనరులను కాపాడాల్సిన…

Read More

యువతకు కొలువులతో, కూటమి ప్రభుత్వం మేలుకొలుపు. -మంత్రి నిమ్మల రామానాయుడు

పాలకొల్లు: మార్చి,20(తెలుగు న్యూస్ పవర్. కాం) కూటమి ప్రభుత్వం యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో శుక్రవారం మంత్రి మీడియా ప్రనిధులతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చి, మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రం నుంచి 400 కంపెనీలనుభయపెట్టి తరిమేసిందన్నారు. నాడు ఉద్యోగ ఉపాధి అవకాశాలు…

Read More

జిల్లాలో పది పరీక్షలకు 24,127 మంది హాజరు.

భీమవరం: మార్చి, 16(తెలుగు న్యూస్పవర్.కామ్).పశ్చిమగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంత ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు పేపర్, కొంతమేర కష్టంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్య సహాయం అందించటానికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వేసవికాలం కావటంలో పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం కల్పించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విదధించారు. జిల్లాలో 132 కేంద్రాల్లో 24,127 మంది విద్యార్థులు…

Read More

వాట్సప్ ద్వారా పదవ తరగతి హాల్ టికెట్.

భీమవరం: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) రానున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ వాట్సాప్ ద్వారా పొందటానికి విద్యాశాఖ ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఫోన్లో వాట్స్అప్ ఓపెన్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, వాట్సప్ పాలన నెంబర్ 95523 00009 ను, కాంటాక్ట్ నంబర్లలో సేవ్ చేయాలి. ఈ నెంబర్ కు హాయ్ సందేశం పంపాలి. వచ్చే మెను లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంపికను చేయండి. అక్కడ ఎస్ఎస్సి మార్చి, 2026 హాల్…

Read More

ఎంఎంకె ఉన్నత పాఠశాల ఆకస్మిక తనిఖీ

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనురల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు స్థానిక ఎం ఎం కే ఎన్ ఎం ఉన్నత పాఠశాల ఆకస్మికముగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ, మధ్యాహ్నం భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్, విచారణ అభివృద్ధికి విప్లవాత్మకమైన మార్పులు తీసుకువ స్తున్నారని వెల్లడించారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుబాటులోకి…

Read More

శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల, పాలకొల్లులో ఉద్యోగమేళ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు లో ఈనెల 16 న ప్లేస్‌మెంట్ సెల్ మరియు జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జే కే సి) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజా రాజేశ్వరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు సన్రైజ్ వర్క్ ఫోర్స్, డయాకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, క్యాప్సిటన్ సర్వీసెస్ లిమిటెడ్, హీరో, ఇండో సోలార్, అపోలో…

Read More

చాంబర్స్ విద్యార్థులు 31మందికి ఉద్యోగాలు.

పాలకొల్లు: మార్చి, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)స్థానిక ఛాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల ప్రాంగణంలో బుధవారం క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ జరిగింది. ఛాంబర్స్ విద్యార్థులు 31 మంది ఎంపికయ్యారు.వీరిలో హెటిరో ల్యాబ్స్ కి 15మంది,ఫాక్స్కాంన్ కు 14 మంది,టాటా ఎలక్ట్రానిక్స్ కు ఇద్దరు ఎంపికైయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు తెలిపినారు. హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్ కంపెనీలు కు ప్రాంగణ ఎంపికలు జరిగాయి.ఈ ప్రాంగణ ఎంపికలకు 56 మంది విద్యార్థులు…

Read More

బి ఆర్ ఎం వి బాలికలకు పరీక్ష సామాగ్రి బహూకరణ.

పాలకొల్లు: మార్చ్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్)బాలికల విద్య సమాజ ప్రగతికి, కుటుంబ శ్రేయస్సుకు అత్యంత కీలకమని, విద్యను ప్రభుత్వంతో పాటు అందరూ ప్రోత్సహించాలని వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు తటవర్తి సుధాకరరావు పేర్కొన్నారు. వాకర్స్ క్లబ్ బుధవారం పట్టణంలోని బి వి ఆర్ యం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న 139 మంది పదవతరగతి విద్యార్థినులకు 7 వేల రూపాయల విలువైన పరీక్షా ఉపకరణాలను అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.ప్రభాకర శాస్త్రి అధ్యక్షత వహించారు.క్లబ్…

Read More

ఏ ఎస్ ఎన్ ఎం కళాశాలలో సామాజిక అవగాహన సదస్సు.

పాలకొల్లు: మార్చి, 10(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఎస్‌.ఎన్‌.ఎం. ప్రభుత్వ (అటానమస్) కళాశాలలో విద్యార్థులకు సామాజిక అవగాహన పెంపొందించేందుకు “మానవ అక్రమ రవాణా” అంశంపై అవగాహన సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ఎన్‌ఎస్ఎస్ యూనిట్–1 & 2, ఎన్‌సిసి యూనిట్ మరియు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, హైదరాబాద్ వారి సంయుక్త ఆధ్వర్యంలో బాలుర విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి మాట్లాడుతూ,…

Read More