Telugu News Power

మహాశివరాత్రి ఏర్పాట్లపై తహశిల్దార్, సమన్వయ కమిటీ సమావేశం.

పాలకొల్లు: ఫిబ్రవరి, 5(తెలుగు న్యూస్ పవర్) మహాశివరాత్రి సందర్భంగా, స్థానిక క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఏర్పాట్ల గురించి తహశిల్దార్ యడ్ల దుర్గా కిషోర్ అధ్యక్షతన, వారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. మహాశివరాత్రి ఈనెల 15న అత్యంత వైభవంగా జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలక్కుండా ఉండటానికి తహసిల్దార్ కిషోర్ వివిధ శాఖల అధికారులకు పలు…

Read More

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది క్షేత్రంలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు తొమ్మిది రోజులు పాటు ఘనంగా జరిగాయి. పవళింపు సేవతో మంగళవారం రాత్రి కి సంపూర్ణం అయ్యాయి. అర్చక స్వాములు స్వామివారికి పుష్ప ఉత్సవం చేశారు. అంతరాలయంలో స్వామి వారిని, అమ్మవారిని కొలువు తీర్చి, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు అర్చకులు నిర్వహించారు. తిరుమంజనములు, ద్వాదశ తిరువారాధన, దర్పణసేవ, ధూప సేవ జరిగింది. ప్రత్యేక పూలతో అలంకరించిన ఏకాంత పవళింపు మందిరంలో…

Read More

హంస వాహనంపై స్వామివారి తెప్పోత్సవం.

సఖినేటిపల్లి: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) నవ నరసింహ క్షేత్రాల్లో ప్రముఖమైన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, మంగళవారం స్వామివారికి తెప్పోత్సవం జరిగింది. ఉత్సవాల్లో 9వది, ఆఖరి రోజున, ఆలయానికి ఉత్తరాన ఉన్న, నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరులో, స్వామివారు, దేవేరులు తెప్పోత్సవం లో విహరించారు. కనుల పండుగగా జరిగిన, ఈ దృశ్యం తిలకించడానికి భక్తజనుల రెండు కళ్ళు సరిపోలేదని, తన్మయత్వంతో…

Read More

మావుళ్ళమ్మకు భక్తులు బంగారం బహుకరణ.

భీమవరం: ఫిబ్రవరి,2(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణనిధికి, ఎనిమిది గ్రాముల బంగారం, (లక్షా పదివేల రూపాయలు) వాడపల్లి వాస్తవ్యులు పున్నం నూకరాజు, షణ్ముఖ సూర్య దుర్గ దంపతులు సోమవారం, అమ్మవారికి కానుకగా సమర్పించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, పూజలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేష వస్త్రం, అమ్మవారి చిత్రం, ప్రసాదాలు అందజేశారు. ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

Read More

మారేడు దళములతో ప్రదక్షిణలు

పాలకొల్లు: ఫిబ్రవరి, 2( తెలుగు న్యూస్ పవర్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి భక్తులు సోమవారం సాయంత్రం ఆలయ ప్రదక్షణ చేశారు. ప్రతివారం భక్తులు ఏడు మారేడు దళములతో 7 ఏడు ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వారం భక్తులు అధిక సంఖ్యలో, సుమారు 300 మంది పాల్గొన్నారు. దేవస్థానం వారు వీరికి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదక్షిణలో ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, పర్యవేక్షకులు పి వాసు,భక్తులు పాల్గొన్నారు. ఆలయ ముచ్చర్ల శ్రీనివాసరావు,…

Read More

అంతర్వేది నరసింహస్వామి చక్రస్నానం లో అద్భుత దర్శనం

సఖినేటిపల్లి: ఫిబ్రవరి, 1(తెలుగు న్యూస్ పవర్) నవనరసింహ క్షేత్రాలలో ప్రముఖమైన అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం ఉత్సవాల్లో భాగంగా, ఆదివారం,8వ రోజు శ్రీవారి సుదర్శనచక్రస్నాననం అత్యంత వైభవంగా జరిగింది. దేవాలయ చరిత్రలో జరగని ఓ అద్భుతం ఈ సందర్భంగా చోటుచేసుకుంది. స్వామివారు, సుదర్శన చక్రస్నానం కోసం, గరుడ పుష్పక వాహనంపై గ్రామోత్సవం చేసి సముద్ర తీరానికి చేరుకున్నారు. సరిగ్గా అదే సమయానికి నిచ్చలంగా, నిర్విహంగంగా, ఆకాశంలో అప్పటి వరకు ఒక్క పక్షి లేకున్నా, ఆకాశంలో నుంచి…

Read More

మావుళ్ళమ్మకు కనకపు కానుక

భీమవరం: ఫిబ్రవరి,1(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఇలవేల్పు, తెలుగు ప్రజల ఇష్ట దైవం, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి, కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి సుబ్రహ్మణ్యం, జ్యోతి దంపతులు 11 గ్రాముల బంగారం కానుకగా సమర్పించుకున్నారు. ఈ కనకం విలువ సుమారు లక్షా 50 వేల రూపాయలు. మావుళ్ళమ్మ అమ్మవారికి, నిలువెత్తు, సంపూర్ణ పసిడి తొడుగు చేయించాలని దేవస్థానం వారు సంకల్పించారు. ఈ పథకానికి స్వర్ణనిధిగా నామకరణం చేశారు. ఈ పథకం ద్వారా పలువురు భక్తులు…

Read More

అంతర్వేది ఉత్సవాల్లో భాగంగా వైభవంగా చోర సంవాదం.

సఖినేటిపల్లి: జనవరి,31(తెలుగు న్యూస్ పవర్) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా శనివారం రాత్రి, 16 స్తంభాల మండపం వద్ద చోర సంవాద వేడుక జరిగింది. అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు, పేరూరు పండితులు ఘనంగా ఈ ఘట్టాన్ని ఆవిష్కరించారు. చోర సంవాదం , భగవంతుడైన, శ్రీ మహావిష్ణువుకు, దారి దోపిడీ దొంగగా ఉన్న :పరకాళుడు’ అనే మహారాజుకు మధ్య జరిగేదే, చోర సంభాషణ. సంభాషణ ను ‘సున్నాలు-పన్నాలు’ పేరుతో వైష్ణవ పన్నవంగా తమిళంలో ఆలయ…

Read More

గజ, పొన్న వాహనములపై నరసింహ స్వామి గ్రామోత్సవం.

సఖినేటిపల్లి: జనవరి30(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అంతర్వేది, దక్షిణ కాశి క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు, గజ, పొన్న వాహనములపై గ్రామోత్సవం చేశారు, భక్తులను అనుగ్రహించారు. స్వామివారు, సాయంత్రం, గజవాహన గ్రామోత్సవం విశిష్టత గురించి అర్చక స్వాములు వెల్లడించిన విశేషాలు. గజరాజులు రాజసానికి ప్రతీకలు. రణరంగంలో, రాజ దర్బారులో, ఉత్సవాల్లో గజరాజు ప్రాధాన్యతా స్థానం. గజరాజు తనపై స్వామివారిని అధిష్టించుకున్నట్టు, భక్తులు తమ హృదయ పీటికపై స్వామివారిని ఆగష్టించుకుని…

Read More

పొన్న వాహనం పై స్వామివారి గ్రామోత్సవం.

స్వామివారి కల్యాణోత్సవంలో భాగంగా, శుక్రవారం, ఆరో రోజు రాత్రి, స్వామివారు పున వాహనంపై ఊరేగారు. ఈ వాహనం ప్రత్యేక సంతరించుకుంది, మిగతా వాహనాలన్నీ, వివిధ రూపాల్లో ఉంటే, పొన్న వాహనం మాత్రం, మహాభారత ఘట్టాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కృష్ణుడు, గోపికల చీరలు దొంగిలించకపోయే ఘట్టం మధ్యలో నరసింహుడు లక్ష్మీసమేతుడై, కొలువుదీరి భక్తులకు దర్శనం ఇస్తారు. పొన్న వృక్షం అంటే కల్ప వృక్షం. ఈ వృక్షంపై ఉన్న స్వామివారి దర్శించుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయని, పొన్నవాహన సేవ…

Read More