అటవీ శాఖ అధికారిపై హైకోర్టు ఆగ్రహం. ఎఫ్ ఆర్ ఓ జి. శ్రీరాములపై సస్పెన్షన్ వేటు
అమరావతి: మే,2(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వ ఉద్యోగులు దైవాంశ సంభూతులు కాదని ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులు మాత్రమేనని గుర్తు చేసింది.హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా, గర్వంగా ప్రవర్తించిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములు పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ అటవీ దళాల అధిపతి డాక్టర్ పి.వి. చలపతిరావు ఉత్తర్వులు జారీ చేశారు.సూర్య…