Telugu News Power

Telugu News Power

జనసేనకు, లోకేష్ లక్ష విరాళం.

మచిలీపట్నం: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఎన్నారై జనసైనికుడు లోకేష్, జనసేన పార్టీకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.ఈ మొత్తాన్ని, పెద్దిరెడ్డి వనజ, పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాల పట్ల, అచంచలమైన విశ్వాసంతో ఈ విరాళం అందజేస్తున్నట్లు జర్మనీలో ఉంటున్న లోకేష్ తెలిపారు. పార్టీపట్ల అభిమానంతో భూరివిరాళం అందజేసిన లోకేష్ ను జనసైనికులు అభినందించారు.

Read More

జాతీయ తెలుగు సదస్సు గోడ పత్రిక ఆవిష్కరణ.

పాలకొల్లు: మార్చి, 14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో ఈ నెల 24న తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు “సాహిత్యం -మహిళా చైతన్యం” అనే అంశం పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా తిరువీధులరాజరాజేశ్వరి తెలియజేశారు. కళాశాలలో ఈ సదస్సు గోడపత్రికను ఆవిష్కరించారు. తెలుగు శాఖాధ్యక్షులు డాక్టర్ బూసి వెంకటస్వామి సదస్సు సమన్వయకర్తగా,సహా సమన్వయకర్తగా జువాలజీ శాఖాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ,సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీగా కళాశాల…

Read More

శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల, పాలకొల్లులో ఉద్యోగమేళ.

పాలకొల్లు: మార్చి,14(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్‌.ఎన్‌.ఎం ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), పాలకొల్లు లో ఈనెల 16 న ప్లేస్‌మెంట్ సెల్ మరియు జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జే కే సి) ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజా రాజేశ్వరి తెలిపారు. ఈ జాబ్ మేళాలో పలు ప్రముఖ సంస్థలు సన్రైజ్ వర్క్ ఫోర్స్, డయాకిన్, టాటా ఎలక్ట్రానిక్స్, క్యాప్సిటన్ సర్వీసెస్ లిమిటెడ్, హీరో, ఇండో సోలార్, అపోలో…

Read More

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గా జస్టిస్ లిసా గిల్.

అమరావతి: మార్చి, 13(తెలుగు న్యూస్ పవర్.కామ్) భారత న్యాయ వ్యవస్థలో మహిళలు కూడా కీలక స్థానాలు సంపాదిస్తూ ముందుకు సాగుతున్న ఉదాహరణల్లో ఒకరు లీసా గిల్ ఒకరు. ఆమె శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అమూర్తగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యం పొందింది. జస్టిస్ లిసా గిల్ 1966 నవంబర్ 17న చండీగఢ్‌లో జన్మించారు. ఆమె ప్రాథమిక విద్యను చండీగఢ్‌లోని కార్మెల్ కాన్వెంట్ పాఠశాలలో పూర్తి చేశారు. తరువాత ఆమె పంజాబ్ యూనివర్సిటీ…

Read More

మాజీ డిజిపి దొర మృతి.

హైదరాబాద్: మార్చి, 13,(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె దొర శుక్రవారం మృతి చెందారు. వీరు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ చికిత్స పొందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా లో 1943 లో జన్మించారు. ఐపీఎస్ అధికారిగా 1965లో ఎంపికయ్యారు. కేంద్ర విజిలెన్స్ అధికారిగా కూడా పనిచేశారు.ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏపీ పోలీస్ కు బ్రాండ్ క్రియేట్ చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. అన్న ఎన్టీఆర్…

Read More

కళాభిమానులు, దాతల ప్రోత్సాహమే, 75 ఏళ్లుగా నాటక పరిషత్ లకు ఊపిరి. -పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షులు కృష్ణ వర్మ.

పాలకొల్లు: మార్చి, 13 (తెలుగు న్యూస్ పవర్. కాం) గత 75 ఏళ్లుగా పాలకొల్లు పట్టణంలో నాటక పరిషత్ లు నిర్వహించడానికి, కళాభిమానులు, దాతల ప్రోత్సాహమే కారణమని, పాలకొల్లు కళా పరిషత్ అధ్యక్షులు, మాంటిసోరి విద్యాసంస్థల అధినేత, కె.వి.కృష్ణ వర్మ పేర్కొన్నారు. పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 17వ జాతీయస్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి రాయప్రోలు భగవాన్ ప్రారంభించారు. జక్కంపూడి కుమార్ సభకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, ఈ బిజీ లైఫ్…

Read More

వ్యవసాయానికి ప్రాధాన్యం, రైతులను కాపాడుకోవడం -కూటమి ప్రభుత్వ లక్ష్యం, మంత్రి నిమ్మల

పాలకొల్లు; మార్చి,13(తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటం, రైతులను కాపాడుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.స్థానిక శివదేవుని చిక్కాల గ్రామంలో మూడో విడత పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం శుక్రవారం రాత్రి జరిగిన సందర్భంగా, మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా, ఆఖరి విడతగా రూ.2, 675ల కోట్ల రూపాయలు రైతుల…

Read More

సి ఎస్ ఆర్ నిధులు పర్యావరణ పరిరక్షణకు కేటాయించాలి. -ఎంపీ పాక సత్యనారాయణ

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కాం) పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించాలని, రాజ్యసభ సభ్యులు, బిజెపి నాయకులు బాగా సత్యనారాయణ కోరారు. రాజ్యసభలో, గురువారం ఈ మేరకు సూచన చేశారు. కంపెనీల చట్టం, 2013 ప్రకారం తమ లాభాల్లో 2శాతం వాటా సిఎస్ఆర్ నిధులకు కేటాయించవలసి ఉందన్నారు. ఈ మొత్తం,2023-2024 లో రూ.34, 908 లు ఉందన్నారు. ఈ నిధులు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణ, పర్యావరణ…

Read More

ఉత్తరాంధ్ర ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త.

న్యూఢిల్లీ: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారు. గుణుపూర్–విశాఖపట్నం (58505/06)ప్యాసింజర్ రైలు ఇకపై హరిశ్చంద్రపురం వద్ద, (8525/26) బెరహంపూర్–విశాఖపట్నం (8525/26) ప్యాసింజర్ రైలు మందస…

Read More

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం.

అమరావతి: మార్చి, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ నియామకం ఉత్తర్వులు గురువారం విడుదల చేశారు. కమిటీ చైర్మన్, వేటుకూరి ఏవీఎస్ఎస్ఎన్ రాజు, కాకినాడ, సభ్యులుగా, కె.వి వెంకట పద్మావతి,గుంటూరు, డాక్టర్ దోని శ్రీనివాసమూర్తి, శ్రీ సత్య సాయి జిల్లా, ఉండవల్లి గాంధీ బాబు, అల్లూరి సీతారామరాజు జిల్లా, చాలా మధుసూదన్ రావు, మంగళగిరి, మండల గంగ సూర్యనారాయణ, కాకినాడ జిల్లా, భావరాజు పద్మావతి, రాజమండ్రి నియమితులయ్యారు. వీరు పదవీకాలం మూడు…

Read More