Skip to main content

Telugu News Power

Telugu News Power

నేటి నుంచి ఉచిత వేసవి సైన్స్ తరగతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక హౌసింగ్ బోర్డ్ లో గల యాక్ట్ (ఏ.సి.టి) సైన్స్ సెంటర్ లో వేసవి శిక్షణ తరగతులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ తరగతులు ఉదయం గం. 9 నుంచి 11 వరకు జరుగుతాయి. ఈ తరగతుల్లో, శాస్త్రీయ భావనలు, శాస్త్ర ప్రయోగాలు, సైన్స్ మ్యాజిక్, వేద గణితం, చిత్రలేఖనం, హస్త కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ శిక్షణా కాలంలో ఈ విధమైన రుసుము చెల్లించనవసరం లేదు….

Read More

ఉద్యానవన పంటలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం.

అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని,ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం కోరారు. పంటలు 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు…

Read More

నరసాపురం ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.

నరసాపురం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపి విభాగాన్ని పరిశీలించి రోగుల నమోదు ఆరా తీశారు. అప్పటివరకు 20 కేసులే వచ్చాయి. ఓపి ఇంత తక్కువగా ఎందుకు ఉందని ప్రశ్నించారు. హాజరు పట్టికలను పరిశీలించి వైద్యులు, సిబ్బంది హాజరును పేరుపేరునా పరిశీలించారు. అనంతరం పురుషుల వార్డు, స్త్రీల వార్డు, అత్యవసర విభాగం, ప్రసూతి విభాగం, పిల్లల విభాగం,…

Read More

స్వాతంత్ర్య సమరయోధులు, విద్యాదాత డి. ఎన్. ఆర్. విగ్రహావిష్కరణ!

భీమవరం: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్వాతంత్ర సమరయోధులు, విద్యాదాత, మహనీయులు, “సంకల్ప జీవి” దంతులూరి నారాయణ రాజు గారి విగ్రహాన్ని స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ, ఉక్కు ,భారీ పరిశ్రమల శాఖమాత్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం ఆవిష్కరించారు.విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మి, 1945లోనే భీమవరంలో కళాశాలను స్థాపించి, సామాన్యులకు విద్యను చేరువ చేసిన గొప్ప కృషీవలుడు నారాయణ రాజు సేవలను మంత్రి కొనియాడారు. దేశభక్తుడు, విద్యాదాత వంటి గొప్ప మహనీయుని విగ్రహాన్ని…

Read More

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపుతాం. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష లో -మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ పర్యాటక పటం లో రాష్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి ఆరాధకులకు, కేరళకు మించిన సౌందర్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగల ప్రయత్నం చేస్తున్నామన్నారు. గోదావరి…

Read More

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లిసా గిల్‌ ప్రమాణస్వీకారం ‌

అమరావతి:ఏప్రిల్ 26: తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితమైన తొలి మహిళ జస్టిస్ లిసా గిల్‌ లోక్‌భవన్ ఆవరణలో శనివారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధానసచివాలయం ముఖ్య కార్యదర్శి జి. సాయి ప్రసాద్ ప్రారంభించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, భారత రాష్ట్రపతి జారీ చేసిన నియామక పత్రాన్ని చదివి వినిపించారు. కార్యక్రమానికి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి జి. అనంత…

Read More

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్” అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు నాయుడు.

ముంబై: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్ . కామ్) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మక “బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025” అవార్డును అందుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ది ఎకనామిక్ టైమ్,ఈ అవార్డును ముంబై లో శనివారం ఘనంగా జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ గౌరవాన్ని స్వీకరించారు. పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు గుర్తింపు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడం,…

Read More

బూరుగుపల్లి హత్య కేసులో మరి కొందరు అరెస్ట్.

పాలకొల్లు: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) యలమంచిలి మండలం, బూరుగుపల్లిలో ఈనెల 16న జరిగిన నూకాలమ్మ జాతరలో బీభత్సం సృష్టించి ఒకరి మృతికి కారణమైన కేసులో శనివారం మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు స్థానిక గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తుల శ్రీనివాస్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ నయీమ్ హస్మి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్నేహితుల…

Read More

విద్యా చైతన్య సమాఖ్య టాలెంట్ టెస్ట్ బహుమతులు.

పాలకొల్లు: ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక విద్యా చైతన్య సమాఖ్య నిర్వహించిన ప్రతిభాపాటవ పోటీల్లో విజేతలకు శనివారం స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమంలో నగదు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఎడ్ల దుర్గ కిషోర్, డాక్టర్ కొండపల్లి లెనిన్, పోలిశెట్టి గోపాలకృష్ణ గోఖలే,సంస్థ అధ్యక్షులు దిరిశాల వెంకట ప్రసాద్, కార్యదర్శి పోలిశెట్టి శ్రీశ్రీ, తోలేటి గాంధీ, మంచెం కనకరాజు, కింజరపు దుర్గాప్రసాద్,మంచెం ఉమామహేశ్వరరావు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు ఎర్ర అజయ్…

Read More

లయన్స్ ఫెమినా ఆరోగ్య కార్యక్రమం.

పాలకొల్లు; ఏప్రిల్, 25(తెలుగు న్యూస్ పవర్. కామ్) లయన్స్ ఇంటర్నేషనల్ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా, స్థానిక లయన్స్ ఫెమినా క్లబ్ ఆధ్వర్యంలో ఉల్లంపర్రు, మాంటిసోరి, పాఠశాలలో శనివారం హెచ్.పి.వి టీకా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ ఇంటర్నేషనల్ వారి సౌజన్యంతో 125 మంది యువతులకు టీకాలు వేశారు. ఇటీవల మహిళలకు సర్వికల్ క్యాన్సర్ పెనుముప్పుగా మారింది. దీని నివారణకు హెచ్ పి వి టీకా అందుబాటులో ఉంది. ఖరీదైన టీకా అందరూ వేయించుకోలేని పరిస్థితి. లయన్స్ ఇంటర్నేషనల్ సామాజిక…

Read More