కూటమి ప్రభుత్వంలో ఆక్వా రంగం కుదేలు. -వైఎస్సార్ సిపి తీవ్ర విమర్శలు
తక్షణమే ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఉద్యమం. భీమవరం : మే,13(తెలుగు న్యూస్ పవర్.కామ్) కూటమి ప్రభుత్వం వల్ల ఆక్వా రంగం కుదేలవుతున్నదని, వైఎస్సార్ సిపి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు భీమవరం జిల్లావైఎస్సార్ సిపి కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపుపై వైఎస్సార్ సిపి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆక్వా ఫీడ్ ధరల పెంపు దారుణమని, ప్రభుత్వ పెద్దలు, ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై…