అజరామర స్ఫూర్తి పుట్టపర్తి. -కలెక్టర్ నాగరాణి
భీమవరం: మార్చి, 29 తెలుగు న్యూస్ పేపర్.కాం) తెలుగు సాహితీ విని ఆకాశంలో ధృవతారగా వెలిగిన పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సాహితీ సష్ట, తెలుగు జాతి మహనీయ మూర్తికి ఘణ నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి అజరామరమైన సేవలు అందించిన “సరస్వతి పుత్రుడు” పుట్టపర్తి నారాయణాచార్యుల స్ఫూర్తి భావితరతరాలకు మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు.